Counting: రేపే ఎన్నికల ఫలితాలు.. 5 రాష్ట్రాల్లో హై అలెర్ట్

తమిళనాడు, పశ్చిమబెంగాల్, కేరళ, అస్సాం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు రేపే జరగనుంది. ఈ నేపథ్యంలో కౌంటింగ్ కేంద్రాల వద్ద భద్రతా బలగాలు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.

Passenger jumps : చైన్నై ఎయిర్‌పోర్టులో షాకింగ్‌ ఘటన... ఎమర్జెన్సీ డోర్‌ నుంచి దూకేసిన ప్యాసిండర్‌

షార్జా నుండి చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న ఎయిర్ అరేబియా విమానంలో ఆదివారం తెల్లవారుజామున ఒక షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. విమానం రన్‌వేపై ల్యాండ్ కాగానే ఓ ప్రయాణికుడు హఠాత్తుగా ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్‌ను తెరిచి బయటకు దూకేశాడు.

NEET 2026 :  నేడే 'నీట్‌-యూజీ 2026'... అభ్యర్థులు ఈ నిబంధనలు పాటించాల్సిందే

అత్యంత ప్రతిష్టాత్మకమైన 'నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్' నేడు జరగనుంది. దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరవుతున్న నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA), యూజీసీ పకడ్బందీ ఏర్పాట్లు చేశాయి.

BIG BREAKING: ఢిల్లీలో పేలిన ఏసీ.. 9 మంది దుర్మరణం!

దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం తెల్లవారుజామున పెను విషాదం చోటుచేసుకుంది. వివేక్ విహార్ ప్రాంతంలోని ఒక నివాస భవనంలో ఎయిర్ కండీషనర్ (ఏసీ) పేలడంతో సంభవించిన భారీ అగ్నిప్రమాదం తొమ్మిది మంది ప్రాణాలను బలితీసుకుంది.

ప్రభుత్వ పాఠశాలలో కలుషిత నీరు కలకలం.. 12 మంది విద్యార్థులకు అస్వస్థత

రాజస్థాన్‌లోని బర్మార్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. సనావాడ పరిధిలోని  ఓ ప్రభుత్వ సీనియర్ సెకండరీ పాఠశాలలో కలుషిత నీరు తాగి 13 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురవ్వడం కలకలం రేపింది.

BIG BREAKING: భారీ పేలుడు.. ముగ్గురు జవాన్లు మృతి

ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ జిల్లాలో భారీ IED పేలుడు సంభవించింది. శనివారం మధ్యాహ్నం ఛోటేబేథియా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గరు జవాన్లు ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపుతోంది.

Strong room : స్ట్రాంగ్ రూముల్లో లీడర్ల భవిష్యత్తు...ఇంతకీ ఈ  స్ట్రాంగ్‌రూమ్‌ అంటే ఏంటంటే?

పలు రాష్ట్రాల ఎన్నికలు ముగిశాయి. అభ్యర్థుల భవిష్యత్తు ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంది. ఈవీఎంలను స్ట్రాంగ్‌రూమ్‌కు తరలించారు. ఎన్నికల ప్రక్రియలో అత్యంత కీలకమైన ఘట్టం పోలింగ్ ముగిసిన వెంటనే ఈవీఎం (EVM), వీవీప్యాట్ యంత్రాలను తరలించే కేంద్రమే స్ట్రాంగ్ రూమ్.

Web Stories
web-story-logopremium tea bagsవెబ్ స్టోరీస్

వామ్మో.. గ్రీన్ టీ తాగేవారికి ప్రమాదం పొంచి ఉందా!!

web-story-logochickenవెబ్ స్టోరీస్

చికెన్ తినే వాళ్లు ఈ జాగ్రత్తలు తెలుసుకోండి!!

web-story-logoEternal youth vaccineవెబ్ స్టోరీస్

నిత్య యవ్వనం కోసం వ్యాక్సిన్ ఉందని తెలుసా..?

web-story-logoFoods double brain powerవెబ్ స్టోరీస్

ఈ ఆహారాలు తింటే మెదడు సామర్థ్యం రెట్టింపు ఖాయం

web-story-logoDry eyesవెబ్ స్టోరీస్

ఈ చిన్న నిర్లక్ష్యం చేస్తే మీ కళ్లకు హానే..!!

web-story-logoFoot massageవెబ్ స్టోరీస్

రోజూ ఫుట్ మసాజ్‌తో అనేక ఆరోగ్య లాభాలు తెలుసా..?

web-story-logofruitsవెబ్ స్టోరీస్

ఈ పండ్లు చలికాలంలో తింటే డేంజరని తెలుసా..?

web-story-logoBirds and animalsవెబ్ స్టోరీస్

ఆ పక్షులు, జంతువులు ఇంట్లోకి వస్తున్నాయా..?

web-story-logoSAM- RAJ PIC FOURవెబ్ స్టోరీస్

పెళ్లి ఫొటోలు షేర్ చేసిన సమంత!

web-story-logoRoti dough in fridgeవెబ్ స్టోరీస్

ఫ్రిజ్‌లో పిండిని ఎంత సమయం నిల్వ చేయాలో తెలుసా..?

Passenger jumps : చైన్నై ఎయిర్‌పోర్టులో షాకింగ్‌ ఘటన... ఎమర్జెన్సీ డోర్‌ నుంచి దూకేసిన ప్యాసిండర్‌

షార్జా నుండి చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న ఎయిర్ అరేబియా విమానంలో ఆదివారం తెల్లవారుజామున ఒక షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. విమానం రన్‌వేపై ల్యాండ్ కాగానే ఓ ప్రయాణికుడు హఠాత్తుగా ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్‌ను తెరిచి బయటకు దూకేశాడు.

US- PAK Deal : పాక్ బ్రోకరేజ్ కు ప్రతిఫలం.. భారత్ కు షాక్ ఇస్తూ ట్రంప్ షాకింగ్ నిర్ణయం!

ఇరాన్-అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించేందుకు 'మధ్యవర్తి'గా వ్యవహరిస్తున్న పాకిస్థాన్‌కు అమెరికా భారీ లబ్ధిని చేకూర్చింది. సుమారు 488 మిలియన్ డాలర్ల విలువైన F-16 రడార్ సపోర్ట్ కాంట్రాక్ట్‌లో పాకిస్థాన్‌ను భాగస్వామిని చేస్తూ నిర్ణయం తీసుకుంది.

Israel strikes : హెజ్‌బొల్లాపై ఇజ్రాయెల్ విరుచుకుపాటు...50 కీలక స్థావరాలు ధ్వంసం

లెబనాన్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న హెజ్‌బొల్లా ఉగ్రవాద సంస్థపై ఇజ్రాయెల్ రక్షణ దళాలు (IDF) ఆదివారం తెల్లవారుజామున మెరుపు దాడులు చేశాయి. ఈ దాడుల్లో హెజ్‌బొల్లాకు చెందిన దాదాపు 50కి పైగా కీలక మౌలిక సదుపాయాలపై వైమానిక దళం బాంబుల వర్షం కురిపించింది.

Tampa ship : 107 ఏళ్ల తర్వాత దొరికిన మొదటి ప్రపంచ యుద్ధం నాటి నౌక

మొదటి ప్రపంచ యుద్ధ చరిత్రలో అత్యంత విషాదకరమైన, అమెరికా నౌకాదళానికి భారీ నష్టాన్ని మిగిల్చిన 'యూఎస్‌ఎస్‌ తాంపా' (USS Tampa) నౌక కథనం ఇప్పుడు మళ్ళీ వెలుగులోకి వచ్చింది. సుమారు 107 ఏళ్ల తర్వాత ఈ నౌక ఆనవాళ్లను బ్రిటన్ డైవర్లు గుర్తించడం విశేషం.  

Iran: యుద్ధాన్ని ఆపేందుకు అమెరికా, ఇజ్రాయెల్‌పై ప్రపంచ దేశాలు ఒత్తిడి చేయాలి: ఇరాన్

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ ఇరాన్ సుప్రీం లీడర్ ప్రతినిధి అబ్దుల్ మాజిద్ హకీమ్ ఇలాహి కీలక వ్యాఖ్యలు చేశారు. యుద్ధం ఆపడం కోసం ఇజ్రాయెల్, అమెరికాపై ప్రపంచ దేశాలు ఒత్తిడి తీసుకురావాలని కోరారు.

Iran: ఇజ్రాయెల్‌కు గూఢచర్యం.. ఇద్దరిని ఉరితీసిన ఇరాన్

ఇజ్రాయెల్‌కు గూఢచర్యం చేస్తున్నారనే ఆరోపణలతో శనివారం ఇరాన్‌ ప్రభుత్వం ఇద్దరు వ్యక్తులను ఉరితీయడం కలకలం రేపుతోంది.  సెంట్రల్ ఇస్ఫాహాన్ ప్రావిన్స్ పరిధిలోని నటాంజ్ న్యూక్లియర్ స్థలం వద్ద ఇద్దరిని ఉరితీసింది.

క్యూబాను స్వాధీనం చేసుకుంటాం.. మరోసారి బాంబు పేల్చిన ట్రంప్.. 60 ఏళ్ల అమెరికా-క్యూబా వైరం ఏంటో తెలుసా ?

ఇరాన్‌తో యుద్ధం ముగిసిన వెంటనే క్యూబాను స్వాధీనం చేసుకుంటామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. ఇరుదేశాల మధ్య నెలకొన్న విభేదాలు ఏంటి ? అసలు ట్రంప్ ఎందుకు ఈ దేశాన్ని స్వాధీనం చేసుకోవాలని అనుకుంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

KA Paul : కవిత నన్ను రూ.10 కోట్లు అడిగింది..కానీ, కేసీఆర్‌ వద్దన్నాడు.. కేఏ పాల్ సంచలన ఆరోపణలు

కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ స్థాపనపై కేఏ పాల్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. కవిత తన వద్దకు వచ్చి పార్టీ నిధుల కోసం రూ. 10 కోట్లు అడిగారని కవితకు ఒక్క రూపాయి కూడా ఇవ్వవద్దని కేసీఆర్ స్వయంగా తనను కోరడంతో వెనక్కి తగ్గానని పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Jewelry robbery : కరీంనగర్‌ PMJ జ్యువెలరీలో కాల్పులు.. ఒకరి మృతి, భారీగా నగలు దోపిడీ ?

కరీంనగర్  జిల్లా కేంద్రంలో ఆదివారం పట్టపగలు  ఒక్కసారిగా కాల్పుల శబ్దాలతో ఉలిక్కిపడింది. జ్యోతినగర్‌లోని అత్యంత రద్దీగా ఉండే ప్రాంతంలో ఉన్న PMJ జ్యువెలరీ షాపులోకి ఐదుగురు సాయుధ దుండగులు చొరబడి బీభత్సం సృష్టించారు.

Hyderabad : హైదరాబాద్‌లో కారు డ్రైవర్ రాక్షసత్వం... బానెట్‌పై బాధితుడిని 2 కి.మీ ఈడ్చుకెళ్లిన వైనం

భాగ్యనగరంలో మరోసారి మానవత్వాన్ని మంటగలిపేలా జరిగిన 'హిట్ అండ్ రన్' ఘటన సంచలనం సృష్టిస్తోంది. ఒక కారు డ్రైవర్ బీభత్సం సృష్టించాడు. కారుతో ఢీ కొట్టడమే కాకుండా బాధితుడిని కిలోమీటర్ల మేర బానెట్‌పై ఈడ్చుకెళ్లిన ఘటన స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురిచేసింది.

Liquor prices : మద్యం ప్రియులకు షాక్‌..లిక్కర్ ధరల పెంపునకు కసరత్తు

తెలంగాణలో మద్యం ప్రియులకు రేవంత్ సర్కార్ షాక్ ఇవ్వనుంది. పెరుగుతున్న ఉత్పత్తి వ్యయం, డిస్టలరీల ఒత్తిడి నేపథ్యంలో రాష్ట్రంలో మద్యం ధరలను పెంచేందుకు ఎక్సైజ్ శాఖ కసరత్తు  చేస్తోంది. సాధారణ బ్రాండ్లపై రూ. 60 , ప్రీమియం బ్రాండ్లపై రూ. 120 వరకు భారం పడనుంది.

Suicide : కూకట్‌పల్లిలో విషాదం... ప్రేమ వివాహం.. అంతలోనే ఆత్మహత్య..

హైదరాబాద్‌ కూకట్‌పల్లి కుమ్మరిబస్తీకి చెందిన యంజాల కార్తీక్‌ (28), రాజీవ్‌గాంధీనగర్‌కు చెందిన మంజుల అలియాస్‌ జ్ఞానసిక (27)లు ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. అయితే పెళ్లయిన నెలన్నరకే ఇద్దరూ ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది.

Instagram Blackmail Trap Case : ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అమ్మాయిలకు వల...లక్షల్లో వసూలు చేసిన ముఠా గుట్టు రట్టు

ఇన్‌స్టాగ్రామ్ వేదికగా సాగుతున్న వలపు వలను జూబ్లీహిల్స్ పోలీసులు బట్టబయలు చేశారు. ఆకర్షణీయమైన ఫోటోలు, విలాసవంతమైన జీవనశైలిని ప్రదర్శిస్తూ యువతులను వంచించే ఓ ముఠా గుట్టును రట్టు చేసిన పోలీసులు, నిందితుల అరాచకాలను వెలుగులోకి తెచ్చారు.

Balkonda : ప్రేమించిన యువకుడు మోసం చేశాడని..పోలీస్‌ స్టేషన్‌ పై నుంచి దూకిన యువతి

నిజామాబాద్ జిల్లా బాల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం నాడు ఒక దిగ్భ్రాంతికర ఘటన చోటుచేసుకుంది. తనను ప్రేమ పేరుతో వంచించిన వ్యక్తిపై ఫిర్యాదు చేసేందుకు వచ్చిన ఓ యువతి, స్టేషన్ భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు యత్నించడం స్థానికంగా కలకలం రేపింది.

AP liquor case : ఏపీ లిక్కర్‌ కేసులో బిగ్‌ ట్వి్స్ట్‌...త్వరలో ఐటీ ఎంట్రీ

వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్‌ కేసు విచారణ కొత్త మలుపు తిరిగింది. ఇప్పటికే ఈ కేసును ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) విచారిస్తున్నాయి. తాజాగా ఈ కేసులో ఇన్‌కమ్‌ ట్యాక్స్‌( ఐటీ) కూడా ఎంట్రీ ఇవ్వనున్నట్టు సమాచారం.

Anchor Reshmi : ఎడ్లబండిపై ఆటో....వైసీపీ, యాంకర్‌ రష్మి సోషల్ మీడియా వార్

జంతు ప్రేమికురాలైన యాంకర్ రష్మి గౌతమ్.. వైసీపీ నేతల నిరసన తీరును తప్పుబట్టడం ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద యుద్ధానికి దారితీసింది. మూగజీవాల పట్ల క్రూరత్వాన్ని ప్రశ్నించినందుకు రష్మిని టార్గెట్ చేస్తూ వైసీపీ కార్యకర్తలు తీవ్ర విమర్శలతో విరుచుకుపడుతున్నారు.

Suicide Case : మూడు సంబంధాలు..ఆరు ప్రేమలు..సీతారాంరెడ్డి ఆత్మహత్య కేసులో సంచలనం

హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సురసాని సీతారాంరెడ్డి ఆత్మహత్య కేసు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. మృతుడు రాసిన 19 పేజీల సుదీర్ఘమైన మరణ వాంగ్మూలం (సూసైడ్ నోట్) బయటకు రావడంతో, ఈ కేసులో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

Andhra Pradesh : అడ్డంగా దొరికిపోయాడు.. సీఐ చిన్నమల్లయ్య రాసలీలలు!

వినుకొండ సీఐ చిన్న మల్లయ్య చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఆయనకు సంబంధించిన ఓ రాసలీలల వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బెడ్ పై ఓ మహిళతో ఆయన సన్నిహితంగా ఉన్న దృశ్యాలు బయటకు రావడంతో పోలీస్ శాఖలో కలకలం రేగుతోంది.

Andhra Pradesh 10th Results 2026 : ఏపీ టెన్త్ ఫలితాలు విడుదల...బాలికలదే పై చేయి

ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి (SSC) ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యా,ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ ఈ ఫలితాలను అధికారికంగా ప్రకటించారు. ఈ ఏడాది విద్యార్థుల ఉత్తీర్ణతలో గణనీయమైన వృద్ధి కనిపించింది. బాలుర కంటే బాలికలు 5.22 శాతం ఎక్కువ ఉత్తీర్ణత సాధించారు.

Andhra Pradesh 10th Results 2026 : నేడు ఏపీ పదవతరగతి ఫలితాలు..చెక్ చేసుకోండిలా...

ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షలు రాసిన 6.30 లక్షల మంది విద్యార్థుల నిరీక్షణకు తెరపడింది. ఏపీ పదో తరగతి (SSC) ఫలితాలు ఈ రోజు (ఏప్రిల్ 30, 2026) ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి. విద్యా , ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ స్వయంగా ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు.

Visakha Express : విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో దారుణం....వివాహితపై అత్యాచారం

విశాఖ ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రయాణిస్తున్న ఒక వివాహితపై గుర్తుతెలియని వ్యక్తి అత్యాచారానికి పాల్పడిన దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పల్నాడు జిల్లా రెంటచింతల మండల కేంద్రానికి చెందిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఉదంతం బయటపడింది.

Elon Musk: రికార్డు సృష్టించిన ఎలాన్ మస్క్.. ఏడాదికి రూ.15 లక్షల కోట్ల ప్యాకేజీ

ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ వేతన ప్యాకేజీ మళ్లీ వార్తల్లో నిలిచింది. 2025 ఆర్థిక సంవత్సరానికి గానూ మస్క్‌ ఏకంగా 158 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 15 లక్షల కోట్లు) భారీ వేతనాన్ని టెస్లా బోర్డు ప్రకటించింది.

Bank Holidays : మే నెలలో ఏకంగా 12 రోజులు బ్యాంకులు క్లోజ్.. లిస్ట్ ఇదిగో!

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) విడుదల చేసిన క్యాలెండర్ ప్రకారం.. మే నెలలో మొత్తం 12 రోజుల పాటు బ్యాంకులు పనిచేయవు. ఇందులో జాతీయ పండుగలు, రాష్ట్రాల వారీగా వచ్చే ప్రాంతీయ సెలవులతో పాటు రెండో శనివారం, నాలుగో శనివారం,  ఆదివారాలు కూడా కలిసి ఉన్నాయి.

Infosys: ఇన్ఫోసిస్‌లో లేఆఫ్‌లు.. క్లారిటీ ఇచ్చిన CEO సలీల్‌ పరేఖ్‌

ఈ మధ్యకాలంలో ఏఐ ప్రభావం వల్ల చాలా టెక్‌ కంపెనీల్లో లేఆఫ్‌లు పరంపర కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఇన్ఫోసిస్‌ ఐటీ ఉద్యోగులకు శుభవార్త అందించింది. తమ కంపెనీల్లో ఉద్యోగుల తొలగింపు చర్యలు చేపట్టమని తెలిపింది.

Apple నూతన సీఈఓగా జాన్ టెర్నస్: బాధ్యతల నుండి తప్పుకోనున్న టిమ్ కుక్

ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ ఇంక్ కీలక నాయకత్వ మార్పును ప్రకటించింది. దాదాపు 15 ఏళ్ల పాటు సంస్థను విజయపథంలో నడిపించిన టిమ్ కుక్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) బాధ్యతల నుండి తప్పుకోనున్నారు.

హైదరాబాద్‌లో రూ.14.85 కోట్ల భూకుంభకోణం.. ‘సంధ్యా’ శ్రీధర్ రావుపై EOW కేసు!

వివాదాస్పద భూములను ఎరగా చూపి, ఢిల్లీకి చెందిన ఓ ప్రముఖ సంస్థను కోట్లాది రూపాయలకు ఆరోపణలపై సంధ్యా కన్స్ట్రక్షన్స్ యజమాని శరణాల శ్రీధర్ రావు, ఆయన భార్య సంధ్యపై సైబరాబాద్ ఎకనామిక్ అఫన్సెస్ వింగ్ కేసు నమోదు చేసింది.

Flipkart Mobile Offers: ఛార్జింగ్ భయం ఇక లేదు.. బ్యాటరీ బీస్ట్ ఫోన్ల లిస్ట్ ఇదే!

ఫ్లిప్‌కార్ట్ మొబైల్ బొనాంజా సేల్ ప్రారంభమైంది. 6000mAh, 7000mAh బ్యాటరీ ఉన్న స్మార్ట్‌ఫోన్లు ఎక్కువ డిమాండ్‌లో ఉన్నాయి. వివో, రియల్‌మీ, వన్‌ప్లస్ ఫోన్ల బ్యాటరీ, SOT టెస్ట్ ఫలితాలు పరిశీలించగా ఫాస్ట్ ఛార్జింగ్, ప్రాసెసర్ కూడా బ్యాటరీ పనితీరులో కీలకం అని తేలింది.

Snap Layoffs: స్నాప్‌చాట్ సంచలన నిర్ణయం: 20 శాతం మంది ఉద్యోగులపై వేటు!

ప్రముఖ సోషల్ మీడియా యాప్ స్నాప్‌చాట్ మాతృసంస్థ స్నాప్ ఇంక్ తన ఉద్యోగులకు భారీ షాక్ ఇచ్చింది. కంపెనీ తన మొత్తం పనితీరులో 15 నుండి 20 శాతం మేర ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించుకుంది.

Holi Color Removal : హోలీ రంగులు వదలడం లేదా? ఇలా చేసి చూడండి

హోళీ పండుగ సందర్భంగా చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా స్నేహితులు, బంధువులు, ఆత్మీయులతో కలసి సరదాగా రంగులు పూసుకుంటూ ఎంజాయ్ చేస్తారు. కానీ, ఆ తర్వాత చర్మం, గోళ్లపై రంగులు అంటుకుంటాయి. ఆ రంగులను వదిలించుకోవాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి.

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

తాజా కథనాలు
    Image 1Image 2
    <--
    Join out Whatsapp Channel
    -->