Banks closed : బ్యాంకు కస్టమర్లకు అలర్ట్... వరుసగా 5 రోజులు బ్యాంకులు బంద్..ఎందుకో తెలుసా?

దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఖాతాదారులకు ముఖ్యమైన హెచ్చరిక. ఈ నెల 25, 26 తేదీల్లో ఎస్‌బీఐ ఉద్యోగులు దేశవ్యాప్తంగా సమ్మెకు దిగనున్నారు. వారాంతపు ,పండుగ సెలవులతో కలుపుకుని వరుసగా ఐదు రోజలు బ్యాంకులు పనిచేయవు.

Cockroach Janata Party : సోషల్ మీడియాను ఊపేస్తున్న 'కాక్రోచ్ జనతా పార్టీ (CJP)'.. విదేశీ కుట్రపై ఇంటెలిజెన్స్ ఆరా!

దేశంలోని నిరుద్యోగ యువతను ఉద్దేశించి CJI చేసిన వ్యాఖ్యలకు నిరసనగా సోషల్ మీడియాలో 'కాక్రోచ్ జనతా పార్టీ' (CJP) పుట్టుకొచ్చింది. దీనిపై ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. విదేశీ శక్తుల ప్రమేయంపై ఇంటెలిజెన్స్ అధికారులు ఆరా తీయడం పెను సంచలనంగా మారింది.

Supreme Court : ఐఏఎస్ అధికారుల పిల్లలకూ కోటా కావాలా? రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు!

రిజర్వేషన్ల ఫలాలను అందుకొని సామాజికంగా, ఆర్థికంగా అత్యున్నత స్థాయికి చేరిన కుటుంబాలు.. తిరిగి అదే కోటాను ఆశించడంపై సుప్రీంకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. పూర్తి స్థాయిలో స్థిరపడినప్పుడు, ఇక వారి పిల్లలకు రిజర్వేషన్ల కోటా ఎందుకు?" అని ప్రశ్నించింది.

Summer Tips: ఏసీ నుంచి సడెన్ గా బయటకు వస్తే డేంజర్.. ఏమవుతుందో తెలుసా?

దేశాన్ని కుదిపేస్తున్న భీకరమైన వడగాలులు, ఎండల తీవ్రతకు AC అనేది విలాస వస్తువు నుండి ప్రతి ఒక్కరి అవసరంగా మారింది. అయితే, సుదీర్ఘ సమయం ఏసీ గదుల్లో ఉండి అకస్మాత్తుగా ఎండలోకి వస్తే శరీరంపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Top 50 Hottest Cities : భారత్‌ మండిపోతోంది... ప్రపంచంలోనే 50 అత్యంత వేడి నగరాలు ఎక్కడున్నాయో తెలుసా?

భారతదేశంలో భానుడి ఉగ్రరూపానికి జనం అల్లాడిపోతున్నారు. మునుపెన్నడూ లేని విధంగా మే నెలలో సూర్యుడు నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు. ప్రపంచం లోనే అత్యంత వేడి గల టాప్-50 నగరాలు (Top 50 Hottest Cities) మన భారతదేశంలోనే ఉండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

NEET: నీట్ ఫీజు రీఫండ్ పోర్టల్ ప్రారంభం.. పరీక్షా కేంద్రాల మార్పుకు చాన్స్

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఓ కీలక ప్రకటన విడుదల చేసింది. అభ్యర్థులు తమ పరీక్ష ఫీజును క్లెయిమ్ చేసుకునేందుకు మే 21, 2026న ఆన్‌లైన్ పోర్టల్‌ను ప్రారంభించినట్లు పేర్కొంది.

BIG BREAKING: రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల

రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. జూన్‌ 18న పెద్దల సభకు ఎన్నికలు జరపనున్నట్లు ఎన్నికల కమిషన్ వెల్లడించింది. దేశవ్యాప్తంగా 24 స్థానాలకు ఎ‍న్నికలు జరగనుండగా ఏపీలో నాలుగు స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. 

Web Stories
web-story-logopremium tea bagsవెబ్ స్టోరీస్

వామ్మో.. గ్రీన్ టీ తాగేవారికి ప్రమాదం పొంచి ఉందా!!

web-story-logochickenవెబ్ స్టోరీస్

చికెన్ తినే వాళ్లు ఈ జాగ్రత్తలు తెలుసుకోండి!!

web-story-logoEternal youth vaccineవెబ్ స్టోరీస్

నిత్య యవ్వనం కోసం వ్యాక్సిన్ ఉందని తెలుసా..?

web-story-logoFoods double brain powerవెబ్ స్టోరీస్

ఈ ఆహారాలు తింటే మెదడు సామర్థ్యం రెట్టింపు ఖాయం

web-story-logoDry eyesవెబ్ స్టోరీస్

ఈ చిన్న నిర్లక్ష్యం చేస్తే మీ కళ్లకు హానే..!!

web-story-logoFoot massageవెబ్ స్టోరీస్

రోజూ ఫుట్ మసాజ్‌తో అనేక ఆరోగ్య లాభాలు తెలుసా..?

web-story-logofruitsవెబ్ స్టోరీస్

ఈ పండ్లు చలికాలంలో తింటే డేంజరని తెలుసా..?

web-story-logoBirds and animalsవెబ్ స్టోరీస్

ఆ పక్షులు, జంతువులు ఇంట్లోకి వస్తున్నాయా..?

web-story-logoSAM- RAJ PIC FOURవెబ్ స్టోరీస్

పెళ్లి ఫొటోలు షేర్ చేసిన సమంత!

web-story-logoRoti dough in fridgeవెబ్ స్టోరీస్

ఫ్రిజ్‌లో పిండిని ఎంత సమయం నిల్వ చేయాలో తెలుసా..?

Miss Venezuela : కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఘోరం... మిస్ వెనెజువెలాపై కత్తెరతో దాడి..వీడియో వైరల్‌

గతేడాది అందాల పోటీల్లో 'మిస్ వెనెజువెలా 2025' కిరీటాన్ని దక్కించుకున్న ప్రముఖ మోడల్ ఆండ్రియా డెల్ వాల్ (Andrea del Val) పై ఆమె సొంత సెలబ్రిటీ స్టైలిస్ట్ లగూనా (Laguna) కత్తెరతో భీకరంగా దాడికి తెగబడ్డాడు. కేన్స్‌లోని ఒక హోటల్ గదిలో ఈ ఘటన చోటు చేసుకుంది.

US Iran War Updates: ఇజ్రాయెల్‌ కోసం అమెరికా ఆయుధాల ఖాళీ! మిత్రదేశాల్లో మొదలైన యుద్ధ భయం..?

ఇరాన్‌తో అమెరికా సాగిస్తున్న యుద్ధం మధ్య ఒక నివేదిక బయటకు వచ్చింది. ఇజ్రాయెల్‌ను రక్షించే క్రమంలో అమెరికా తన క్షిపణి నిధులు(మిస్సైల్ స్టాక్) సగానికి పైగా కోల్పోయిందట. కానీ, ఇజ్రాయెల్ మాత్రం తన స్వంత ఆయుధ సంపత్తిని కాపాడుకుందనే ప్రచారం వెల్లువెత్తుతోంది.

Donald Trump : ఇరాన్‌ను వదిలేసి.. ఇక క్యూబాపై ఫోకస్ ! ట్రంప్ వ్యూహం వెనుక అసలు కథ ఇదేనా?

పశ్చిమాసియా (ప్రాచ్య దేశాల) సంక్షోభం ఎంతకీ ముగింపునకు రాకపోవడంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన విదేశాంగ వ్యూహాన్ని మార్చుకుంటున్నారు. ఇరాన్ ను వదిలి అమెరికాకు చాలా కాలంగా కొరకరాని కొయ్యగా మారిన క్యూబాపై ట్రంప్ దృష్టి సారించినట్లు తెలుస్తోంది.

Donald Trump: ఆ పెళ్లికి వెళ్తే నన్ను చంపేస్తారు.. ట్రంప్ షాకింగ్ కామెంట్స్!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన పెద్ద కుమారుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్ వివాహం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'ఇరాన్' సమస్య నేపథ్యంలో ఒకవేళ నేను పెళ్లికి వెళ్లినా నన్ను విమర్శిస్తారు, వెళ్లకపోయినా నన్ను టార్గెట్ చేస్తారని వాపోయారు.

BREAKING: పఠాన్‌కోట్‌లో ఆర్మీ కాన్వాయ్‌లపై నిఘా.. పాక్ గూఢచారి అరెస్ట్..

దేశ సరిహద్దుల్లో ఉగ్రవాద కార్యకలాపాలను అరికట్టేందుకు భద్రతా దళాలు నిరంతరం సాగిస్తున్న ప్రయత్నాల్లో ఓ కీలక విషయం బయటపడింది. పంజాబ్‌లోని పఠాన్‌కోట్ జిల్లాలో భద్రతా సంస్థలు, స్థానిక పోలీసులు కలిసి అత్యంత సున్నితమైన గూఢచర్య నెట్‌వర్క్‌ను ఛేదించారు.

Global Warming: వేడెక్కుతున్న భూమి.. రాబోయేది సాధారణ వేసవి కాదు, 'సూపర్ ఎల్ నినో' కాలమే!

గ్లోబల్ వార్మింగ్ ప్రభావం వల్ల భూమిపై వేడి రోజురోజుకు పెరుగుతోంది. అయితే రాబోయే రోజుల్లో ఈ పరిస్థితి మరింత భయంకరంగా మారొచ్చని వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

BIG BREAKING: భీకర కాల్పులు.. 25 మంది మృతి

మధ్య అమెరికా దేశమైన హోండురాస్‌లో రెండు వేర్వేరు కాల్పుల ఘటనలు తీవ్ర కలకలం రేపాయి. సాయుధ దుండగులు జరిపిన ఈ దాడిలో ఆరుగురు పోలీసులతో సహా మొత్తం 25 మంది మృతి చెందారు.

CM Revanth Reddy : రేపు యాదగిరి గుట్టకు సీఎం రేవంత్ రెడ్డి.. రూ.100 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం

తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా గుర్తింపు పొందిన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దివ్యక్షేత్రాన్ని రేపు సీఎం రేవంత్ రెడ్డి సందర్శిస్తారు. సుమారు రూ.100 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఐదు అభివృద్ధి పనులకు సీఎం భూమిపూజలు, శంకుస్థాపనలు చేస్తారు.

Anasuya Vishnu Priya: పోలీసులకు ఫిర్యాదు చేసిన అనసూయ, విష్ణుప్రియ..ఎందుకో తెలిస్తే షాక్‌...

టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ మహిళా సెలబ్రిటీలు అనసూయ, విష్ణుప్రియ సోషల్‌ మీడియా వేధింపులు, అసత్య ప్రచారాలపై పోలీసులను ఆశ్రయించారు. మహిళా సెలబ్రిటీలపై జరుగుతున్న ఆన్‌లైన్‌ దుష్ప్రచారం, ట్రోలింగ్‌, వ్యక్తిత్వ హననంపై వారు ఫిర్యాదు చేశారు.

Land Scam : శంషాబాద్‌లో భారీ భూ కుంభకోణం.. ప్రభుత్వ భూముల కేటాయింపుపై వివాదాస్పద ఉత్తర్వులు

రాష్ట్ర రాజధానికి సమీపంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న శంషాబాద్‌ మండలంలోని పెద్ద షాపూర్‌ ప్రాంతంలో ప్రభుత్వ భూముల కేటాయింపుపై తీవ్ర వివాదం నెలకొంది. రూ.కోట్లు విలువ చేసే భూమిని స్థానిక తహసీల్దార్‌ ఒక ప్రైవేటు వర్గానికి అనుకూలంగా కేటాయించినట్లు సమాచారం.

Big Breaking : రేవంత్ కు బిగ్ షాక్.. ఆకునూరి మురళి రాజీనామా!

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విద్యా వర్గాలలో ఒక ఊహించని పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన తన రాజీనామా లేఖను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) కి అందజేశారు.

SRH vs RCB Match: ఉప్పల్‌లో చివరి మ్యాచ్‌.. బ్లాక్‌లో టికెట్ల దందా.. రూ.లక్షకు ఒక టికెట్

ఉప్పల్‌ స్టేడియంలో శుక్రవారం సన్‌రైజర్స్ హెదరాబాద్ (SRH), రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరు (RCB) జట్లు తలపడనున్న సంగతి తెలిసిందే.  ఉప్పల్‌లో ఇదే చివరి మ్యాచ్ కావడంతో బ్లాక్ టికెట్ల మాఫియా నడుస్తోంది.

Telangana: మండుతున్న ఎండలు.. వడదెబ్బతో 22 మంది మృతి

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. మధ్యాహ్నం పూట బయటకు రావాలంటేనే జనాలు జంకుతున్నారు. గురువారం ఒక్కరోజే తెలంగాణలో వడదెబ్బకు గురై 22 మంది ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపుతోంది.

Big breaking : ఉప్పల్‌లో మ్యాచ్‌కు ముందే బ్లాక్ టికెట్ల దందా... బుకింగ్స్‌పై అనుమానాలు.. పోలీసుల ప్రత్యేక నిఘా!

ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా శుక్రవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్ల మధ్య జరగనున్న హై-వోల్టేజ్ మ్యాచ్‌కు ముందే బ్లాక్ టికెట్ల దందా జోరందుకుంది. ఈ అక్రమ దందా పై పోలీసులు నిఘా పెట్టారు.

AP News : ఏపీలో కొత్త నిప్పుల కొలిమిగా మారిన 'లైమ్‌సిటీ'.. దానికి గల కారణాలు ఇవే!

ఏపీలో అత్యధిక ఉష్ణోగ్రతలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన 'రెంటచింతల' ఇప్పుడు ఆ స్థానాన్ని కోల్పోయింది. దాన్ని ఇపుడు 'పిడుగురాళ్ల' భర్తీ చేసింది. తాజాగా రికార్డు స్థాయిలో 48.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదై రాష్ట్రంలోనే అత్యంత వేడి ప్రాంతంగా రికార్డుల కెక్కింది.

Crime News : ప్రకాశం జిల్లాలో ఘోరం: కూతురితో సన్నిహితంగా ఉన్నాడని ముక్కలుగా నరికి...

ప్రకాశం జిల్లా మార్కాపురం పరిధిలోని యర్రగొండపాలెంలో  ఒళ్ళు గగుర్పొడిచే దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. తన కూతురితో సన్నిహితంగా ఉంటున్నాడనే కక్షతో ఓ వ్యక్తి, ఒక యువకుడిని దారుణంగా హత్య చేశాడు. అంతటితో ఆగకుండా మృతదేహాన్ని ముక్కలుగా నరికి బోరుబావిలో పడేసాడు.

Abhinay Darshan : అభినయ్‌ దర్శన్ 'హత్యాయత్నం' డ్రామా వెనుక కుట్ర కోణం..మత విద్వేషాల కోసమే పక్కా స్కెచ్.

గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో సంచలనం సృష్టించిన పాస్టర్ అభినయ్ దర్శన్‌పై 'హత్యాయత్నం' కేసు ఊహించని మలుపు తిరిగింది. ఈ దాడి ఘటన ఒక పక్కా ప్లాన్ ప్రకారం ఆడిన హైడ్రామా అని అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ సంచలన నిజాలను వెల్లడించారు.

Chandrababu-Palm Fruit: కుప్పంలో తాటి ముంజలు తిన్న చంద్రబాబు.. అవి తింటే ఎన్నిలాభాలతో తెలుసా?

సీఎం చంద్రబాబు దంపతులు చిత్తూరు జిల్లా కుప్పం శ్రీప్రసన్న తిరుపతి గంగమాంబ జాతరలో పాల్గొన్నారు. తిరుగు ప్రయాణంలో తంజమ్మకొట్టాలు వద్ద ఆగారు. కల్లుగీత కార్మికులు తాటిముంజలు తీస్తుండగా వారి వద్దకు వెళ్లిన చంద్రబాబు దంపతులు..తాటిముంజలను రుచి చూశారు.

Kodali Nani : హ్యాపీ బర్త్ డే నాన్న.. తారక్ కు కొడాలి నాని బర్త్ డే విషెస్!

టాలీవుడ్ టాప్ హీరో, గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ ఈరోజు తన పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్టీఆర్ అభిమానులు పండగ చేసుకుంటుండగా.. సినీరాజకీయ ప్రముఖులు విషెస్ చెబుతున్నారు. 

Crime News : అల్లూరి జిల్లాలో దారుణం... పింఛను డబ్బుల కోసం తండ్రిని చంపిన కొడుకు!

కన్న తండ్రి అని కూడా చూడకుండా, కేవలం పింఛను డబ్బుల కోసం ఓ కొడుకు కర్రతో కొట్టి ప్రాణాలు తీసిన ఘోర కలి అల్లూరి సీతారామరాజు జిల్లాలో వెలుగుచూసింది. పెదబయలు మండలంలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

Pastor Abhinay's case : పాస్టర్‌ అభినయ్ కేసులో బిగ్ ట్విస్ట్...దాడిని డ్రామాగా తేల్చిన పోలీసులు

అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో సంచలనం సృష్టించిన పాస్టర్ అభినయ్ దర్శన్ దాడి ఉదంతం చివరకు ఒక పెద్ద హైడ్రామాగా తేలింది. సింపతీ కోసం సొంతంగా కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం వహించి ఆడిన నాటకమిదని పోలీసులు ఆధారాలతో సహా నిరూపించారు.

GOLD RATES : బిగ్ షాక్ : భారీగా పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్లో తులం ఎంతంటే?

పసిడి ప్రియులకు భారీ షాక్. గత కొన్ని రోజులుగా హెచ్చుతగ్గులతో సాగుతున్న బంగారం ధరలు ఒక్కసారిగా నింగిని తాకాయి. అంతర్జాతీయ మార్కెట్లో చోటుచేసుకుంటున్న పరిణామాలు, దేశీయంగా పెరిగిన డిమాండ్ కారణంగా 22 క్యారెట్లు, 24 క్యారెట్ల బంగారం ధరలు భారీగా పెరిగాయి

PF చందాదారులకు గుడ్ న్యూస్.. ఇకపై UPI ద్వారా నేరుగా పీఎఫ్ విత్‌డ్రా!

ఈపీఎఫ్‌ఓ చందాదారులు తమ PF ఖాతాలోని నగదును యూపీఐ చెల్లింపు గేట్‌వే ద్వారా సులభంగా తమ బ్యాంకు అకౌంట్‌లోకి బదిలీ చేసుకోవచ్చు. త్వరలోనే ఇది అందుబాటులోకి రానుంది.

MODI CONGVOY REDUCE : ప్రధాని మోడీ పొదుపు మంత్రం..సొంత కాన్వాయ్‌పై సంచలన నిర్ణయం

పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించుకోవాలని ప్రధాని మోదీ చేసిన పిలుపు సరికొత్త చర్చకు దారితీసింది. ఈ ప్రకటనపై సోషల్ మీడియా వేదికగా మోదీపై ట్రోల్స్, విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో తన కాన్వాయ్‌లోని వాహనాల సంఖ్యను తగ్గించుకుంటూ నిర్ణయం తీసుకున్నారు.

PM Modi: బంగారం కొనద్దన్న మోదీ.. భారీగా పతనమైన పసిడి షేర్లు

ప్రధాని మోదీ దేశ ప్రజలకు ఏడాది పాటు బంగారం కొనద్దని కీలక విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. దీంతో సోమవారం స్టాక్ మార్కెట్లో పసిడి షేర్లు భారీగా పడిపోయాయి. ప్రముఖ సంస్థ టైటాన్ షేర్ విలువ 7 శాతం పడిపోయింది. కళ్యాణ్ జ్యువెలర్స్ 9 శాతానికి పైగా పతనమయ్యింది.

Elon Musk: రికార్డు సృష్టించిన ఎలాన్ మస్క్.. ఏడాదికి రూ.15 లక్షల కోట్ల ప్యాకేజీ

ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ వేతన ప్యాకేజీ మళ్లీ వార్తల్లో నిలిచింది. 2025 ఆర్థిక సంవత్సరానికి గానూ మస్క్‌ ఏకంగా 158 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 15 లక్షల కోట్లు) భారీ వేతనాన్ని టెస్లా బోర్డు ప్రకటించింది.

Bank Holidays : మే నెలలో ఏకంగా 12 రోజులు బ్యాంకులు క్లోజ్.. లిస్ట్ ఇదిగో!

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) విడుదల చేసిన క్యాలెండర్ ప్రకారం.. మే నెలలో మొత్తం 12 రోజుల పాటు బ్యాంకులు పనిచేయవు. ఇందులో జాతీయ పండుగలు, రాష్ట్రాల వారీగా వచ్చే ప్రాంతీయ సెలవులతో పాటు రెండో శనివారం, నాలుగో శనివారం,  ఆదివారాలు కూడా కలిసి ఉన్నాయి.

Infosys: ఇన్ఫోసిస్‌లో లేఆఫ్‌లు.. క్లారిటీ ఇచ్చిన CEO సలీల్‌ పరేఖ్‌

ఈ మధ్యకాలంలో ఏఐ ప్రభావం వల్ల చాలా టెక్‌ కంపెనీల్లో లేఆఫ్‌లు పరంపర కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఇన్ఫోసిస్‌ ఐటీ ఉద్యోగులకు శుభవార్త అందించింది. తమ కంపెనీల్లో ఉద్యోగుల తొలగింపు చర్యలు చేపట్టమని తెలిపింది.

Holi Color Removal : హోలీ రంగులు వదలడం లేదా? ఇలా చేసి చూడండి

హోళీ పండుగ సందర్భంగా చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా స్నేహితులు, బంధువులు, ఆత్మీయులతో కలసి సరదాగా రంగులు పూసుకుంటూ ఎంజాయ్ చేస్తారు. కానీ, ఆ తర్వాత చర్మం, గోళ్లపై రంగులు అంటుకుంటాయి. ఆ రంగులను వదిలించుకోవాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి.

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

తాజా కథనాలు
    Image 1Image 2
    <--
    Join out Whatsapp Channel
    -->