CM Revanth Reddy: అది మోదీ మెడపై కత్తిలా మారుతుంది: సీఎం రేవంత్ రెడ్డి

బీసీ కలగణన మొగ్గ దశలోనే అడ్డుకోడానికి కుట్రలు జరుగుతున్నాయని అఖిలభారత పద్మశాలి మహాసభలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. కులగణనపై అసెంబ్లీలో తీర్మానం చేస్తే.. మోదీ మెడపై కత్తిలా వేలాడుతుందని బీఆర్ఎస్, బీజేపీ లెక్కలు తప్పని ఆరోపిస్తున్నాయని ఆయన అన్నారు.

New Update
Chief Minister Revanth Reddy

Chief Minister Revanth Reddy Photograph: (Chief Minister Revanth Reddy )

కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో కులగణన నిర్వహించి బలహీనవర్గాల లెక్క తేల్చామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. బీసీలకు న్యాయం జరగడం ఇష్టం లేని వారి లెక్కలు తప్పని మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. కులగణనపై అసెంబ్లీలో తీర్మానం చేస్తే.. మోదీ మెడపై కత్తిలా వేలాడుతుందని బీఆర్ఎస్, బీజేపీ కులగణన లెక్కలు తప్పని ఆరోపిస్తున్నాయని రేవంత్ రెడ్డి అన్నారు. అఖిలభారత పద్మశాలి మహాసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం మాట్లాడారు. బలహీన వర్గాల హక్కులను కాలరాసి వారి గొంతులను నులిమేసే కుట్ర జరుగుతోందని రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. 

Also read: Kumbh Mela: జైలు నుంచి బెయిల్‌పై బయటకొచ్చి.. కుంభమేళాలో జాక్‌పాట్ కొట్టిన రౌడీ‌షీటర్

కెసిఆర్ లెక్కలో ఉన్నత కులాలు 21 శాతం అయితే... నేను చేసిన లెక్కలో ఉన్నతకులాలు 15.28 శాతం మాత్రమేనని ముఖ్యమంత్రి నెక్కి చెప్పారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వకుండా మొగ్గలోనే తుంచేయాలనే కుట్ర జరుగుతోంది.. ఈ కుట్రలను బీసీ సమాజం తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ఆత్మగౌరవంలోనే కాదు.. త్యాగంలోనూ పద్మశాలీలు ముందుంటారని రేవంత్ రెడ్డి కొనియాడారు.  తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన పదవిని త్యాగం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీనే ఇందుకు నిదర్శనమని ఆయన చెప్పుకొచ్చారు. తెలంగాణ ఉద్యమం పురుడుపోసుకునేందుకు తన సొంత ఇంటినే వేదిక చేసిన వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ అని అన్నారు. అలాంటి వ్యక్తి మరణిస్తే గత ప్రభుత్వం నివాళులు అర్పించని సంఘటనను పద్మశాలి సమాజం మరిచిపోలేదని చెప్పారు.

Also read: నడిరోడ్డుపై జర్నలిస్ట్‌ను కాల్చి చంపిన దుండగులు

తెలంగాణ ఉద్యమంలో ముందున్న మరో వ్యక్తి టైగర్ ఆలే నరేంద్ర అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఆలే నరేంద్రను కాంగ్రెస్ పార్టీ కేంద్ర మంత్రిని చేస్తే.. ధృతరాష్ట్ర కౌగిలితో కెసీఆర్ ఆయన్ని ఖతం చేశాడని రేవంత్ ఆరోపించారు. కేంద్రంతో మాట్లాడి ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ఏర్పాటు చేయడమేకాదు... దానికి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టుకున్నామని తెలియజేశారు సీఎం. ఆసిఫాబాద్ మెడికల్ కాలేజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెడతామని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రకటించారు. మహిళా స్వయం సహాయక సంఘాలకు ఇచ్చే 600 కోట్ల విలువైన 1కోటి 30 లక్షల చీరల ఆర్డర్లు నేతన్నలకు ఇచ్చి చేనేతను ఆదుకుంటున్నామని ఆయన వివరించారు. కోటి రూపాయలతో షోలాపూర్‌లో పద్మశాలీ ఆత్మగౌరవాన్ని నిలిపేలా మార్కండేయ భవనం నిర్మించేందుకు సహకరిస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Warangal: వరంగల్ లో బయటపడ్డ దారుణం.. డబ్బుల కోసం లవర్ తో కలిసి.. మైనర్లకు గంజాయి ఇచ్చి వ్యభిచారం..!

వరంగల్ లో మైనర్ బాలికలను వ్యభిచార రొంపిలోకి దింపుతున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. మైనర్ లతో వ్యభిచారం చేయిస్తే ఎక్కువ డబ్బులు వస్తాయని మైనర్ సెక్స్ రాకెట్ ఏర్పాటుకు ఓ యువతితో ప్లాన్ వేసిన ముఠా. కీలక నిందితురాలు ముస్కు లతను అరెస్ట్ చేసిన పోలీసులు.

New Update
Atrocities uncovered

Atrocities uncovered

వరంగల్ నగరంలో మైనర్ బాలికలను వ్యభిచార రొంపి (Prostitution) లోకి దింపుతున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వ్యభిచార ముఠాను నిర్వహిస్తున్న కీలక నిందితురాలు ముస్కు లతను అదుపులోకి తీసుకున్నారు. మైనర్ లతో వ్యభిచారం చేయిస్తే ఎక్కువ డబ్బులు వస్తాయని మైనర్ సెక్స్ రాకెట్ ఏర్పాటు చేసేందుకు ఓ యువతితో ప్లాన్ వేసిన ముఠా. తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ (Instagram Account) సహాయంతో ఓ మైనర్ బాలికను ట్రాప్ చేసిన యువతి తన లవర్ తో కలిసి మైనర్ బాలికకు మద్యం, గంజాయికి అలవాటు చేసింది.  అంతే కాకుండా మైనర్ బాలికను నర్సంపేట తీసుకెళ్ళి  గంజాయి తాగించి అత్యాచారానికి కూడా పాల్పడ్డారు. మార్చి 11న జరిగిన ఈ పాశవిక ఘటనను సీరియస్ గా తీసుకున్న వరంగల్ పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేసి నిందితులను అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలిలా ఉన్నాయి.. మార్చి 11వ తేదీ వరంగల్ లోని మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక మైనర్ బాలిక మిస్సింగ్ కి సంబంధించి ఫిర్యాదు రాగా..  కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు. 

ఇది కూడా చూడండి: Horoscope Today: నేడు ఈ రాశివారు నమ్మిన వారే మోసం చేసే అవకాశాలున్నాయి..జర జాగ్రత్త!

Also Read :  మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉండాలంటే వీటికి దూరంగా ఉండండి!

Atrocities Uncovered In Warangal

దర్యాప్తు చేసిన పోలీసులు కిడ్నాప్ కు గురైన మైనర్ బాలిక (Minor Girl) ని ములుగు క్రాస్ దగ్గర గుర్తించారు.తదుపరి బాలికని విచారించగా తనను కొంతమంది కిడ్నాప్ చేసి గంజాయి తాగించి ఆపైన అత్యాచారం చేసారని తెలిపింది. బాలిక ఇచ్చిన సమాచారం మేరకు ఈ కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు.. మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందుతుల కోసం గాలించారు.ఈ క్రమంలో దామెర మండలానికి  చెందిన పడుపు వృత్తి చేసే మస్కు లతను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. లతతో పాటు తన దగ్గర ఉన్న మరో మైనర్ నిందితురాలిని కూడా అదుపులోకి తీసుకున్నారు. 

Also Read: IPL 2025: రోహిత్ శర్మ కెప్టెన్సీపై పంజాబ్ కింగ్స్ బ్యాటర్ షాకింగ్ కామెంట్స్.. తన కోరిక అదేనంటూ!

మైనర్ నిందితురాలు సాయంతో లత బాలికను కిడ్నాప్ చేసినట్లు గుర్తించామని తెలిపారు పోలీసులు. బాధిత బాలికతో ఇంస్టాగ్రామ్ ద్వారా పరిచయం పెంచుకొని ఈ ఘాతుకానికి పాల్పడ్డట్టు పోలీసుల విచారణలో తెలిపింది. ఈ కిడ్నాప్ ప్లాన్ లో మైనర్ నిందితురాలి లవర్ హస్తం కూడా ఉందని గుర్తించారు పోలీసులు. మైనర్ నిందితురాలు లవర్ అబ్దుల్ అప్నాన్ సాయంతో మైనర్ బాలికకు మందు, గంజాయి అలవాటు చేసి తమ ట్రాప్ లో పడేలా చేశారని తెలిపారు పోలీసులు. ఆ తర్వాత స్నేహితులతో కలిసి అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. అత్యాచారం చేసే సమయంలో వీడియో రికార్డ్ చేసారని..ఈ ఘటన గురించి ఎవరికైనా చెప్తే.. వీడియోలు బయట పెడతామని బెదిరించినట్లు తెలిపింది బాలిక. బాలిక ఇచ్చిన సమాచారం మేరకు  ముఠాలో కీలక నిందితురాలు లత, నవ్యతో పాటు అబ్దుల్ అఫ్నాన్, శైలాని బాబా, మొహమ్మద్ అల్తాఫ్, మీర్జా ఫైజ్ బేగ్ లను అరెస్టు చేసిన పోలీసులు ప్రధాన నిందుతురాలు ముస్కు లత ఇంటి వద్ద 4300 కండోమ్ పాకెట్స్ తో పాటు రూ. 7వేల 500 నగదు స్వాధీనం చేసుకున్నారు. అంతే కాకుండా ఒక బ్రేజా కారు, 4 మొబైల్ ఫోన్ లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. 

Also Read :  పట్టుదలకు చిరునామా, యువతకు స్ఫూర్తి సునీతా విలియమ్స్

Advertisment
Advertisment
Advertisment