CM Revanth Reddy: అది మోదీ మెడపై కత్తిలా మారుతుంది: సీఎం రేవంత్ రెడ్డి

బీసీ కలగణన మొగ్గ దశలోనే అడ్డుకోడానికి కుట్రలు జరుగుతున్నాయని అఖిలభారత పద్మశాలి మహాసభలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. కులగణనపై అసెంబ్లీలో తీర్మానం చేస్తే.. మోదీ మెడపై కత్తిలా వేలాడుతుందని బీఆర్ఎస్, బీజేపీ లెక్కలు తప్పని ఆరోపిస్తున్నాయని ఆయన అన్నారు.

New Update
Chief Minister Revanth Reddy

Chief Minister Revanth Reddy Photograph: (Chief Minister Revanth Reddy )

కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో కులగణన నిర్వహించి బలహీనవర్గాల లెక్క తేల్చామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. బీసీలకు న్యాయం జరగడం ఇష్టం లేని వారి లెక్కలు తప్పని మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. కులగణనపై అసెంబ్లీలో తీర్మానం చేస్తే.. మోదీ మెడపై కత్తిలా వేలాడుతుందని బీఆర్ఎస్, బీజేపీ కులగణన లెక్కలు తప్పని ఆరోపిస్తున్నాయని రేవంత్ రెడ్డి అన్నారు. అఖిలభారత పద్మశాలి మహాసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం మాట్లాడారు. బలహీన వర్గాల హక్కులను కాలరాసి వారి గొంతులను నులిమేసే కుట్ర జరుగుతోందని రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. 

Also read: Kumbh Mela: జైలు నుంచి బెయిల్‌పై బయటకొచ్చి.. కుంభమేళాలో జాక్‌పాట్ కొట్టిన రౌడీ‌షీటర్

కెసిఆర్ లెక్కలో ఉన్నత కులాలు 21 శాతం అయితే... నేను చేసిన లెక్కలో ఉన్నతకులాలు 15.28 శాతం మాత్రమేనని ముఖ్యమంత్రి నెక్కి చెప్పారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వకుండా మొగ్గలోనే తుంచేయాలనే కుట్ర జరుగుతోంది.. ఈ కుట్రలను బీసీ సమాజం తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ఆత్మగౌరవంలోనే కాదు.. త్యాగంలోనూ పద్మశాలీలు ముందుంటారని రేవంత్ రెడ్డి కొనియాడారు.  తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన పదవిని త్యాగం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీనే ఇందుకు నిదర్శనమని ఆయన చెప్పుకొచ్చారు. తెలంగాణ ఉద్యమం పురుడుపోసుకునేందుకు తన సొంత ఇంటినే వేదిక చేసిన వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ అని అన్నారు. అలాంటి వ్యక్తి మరణిస్తే గత ప్రభుత్వం నివాళులు అర్పించని సంఘటనను పద్మశాలి సమాజం మరిచిపోలేదని చెప్పారు.

Also read: నడిరోడ్డుపై జర్నలిస్ట్‌ను కాల్చి చంపిన దుండగులు

తెలంగాణ ఉద్యమంలో ముందున్న మరో వ్యక్తి టైగర్ ఆలే నరేంద్ర అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఆలే నరేంద్రను కాంగ్రెస్ పార్టీ కేంద్ర మంత్రిని చేస్తే.. ధృతరాష్ట్ర కౌగిలితో కెసీఆర్ ఆయన్ని ఖతం చేశాడని రేవంత్ ఆరోపించారు. కేంద్రంతో మాట్లాడి ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ఏర్పాటు చేయడమేకాదు... దానికి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టుకున్నామని తెలియజేశారు సీఎం. ఆసిఫాబాద్ మెడికల్ కాలేజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెడతామని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రకటించారు. మహిళా స్వయం సహాయక సంఘాలకు ఇచ్చే 600 కోట్ల విలువైన 1కోటి 30 లక్షల చీరల ఆర్డర్లు నేతన్నలకు ఇచ్చి చేనేతను ఆదుకుంటున్నామని ఆయన వివరించారు. కోటి రూపాయలతో షోలాపూర్‌లో పద్మశాలీ ఆత్మగౌరవాన్ని నిలిపేలా మార్కండేయ భవనం నిర్మించేందుకు సహకరిస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు