Waqf land: దేశ భూభాగంలో 5% భూమి వక్ఫ్ బోర్డులదే.. 12వ శతాబ్దంలో మొదలై ఇప్పుడు 39లక్షల ఎకరాలు

వక్ఫ్ విరాళాలు 12 శతాబ్ధంలో ముహమ్మద్ ఘోరీతో మొదలై ఇప్పటి వరకు ఇండియాలో 39 లక్షల ఎకరాలకు చేరింది. భారత్‌లో మొత్తం 32 వక్ఫ్ బోర్డుల దగ్గర 39 లక్షల ఎకరాలు భూమి ఉందని అది దేశవిస్తీర్ణంలో 5శాతమని కేంద్ర హోమంత్రి అమిత్ షా లోక్‌సభలో తెలిపారు.

New Update
waqf board land in india

waqf board land in india Photograph: (waqf board land in india)

కేంద్ర హోం మంత్రి అమిత్ షా వక్ఫ్ బోర్డు ఆస్తుల గురించి సంచలన విషయాలు వెల్లడించారు. భారతదేశంలోని వక్ఫ్ బోర్డులు సమిష్టిగా 39 లక్షల ఎకరాలను కలిగి ఉన్నాయని చెప్పారు. ఇది దేశం మొత్తం భూభాగంలో దాదాపు 5 శాతమని ఆయన అన్నారు. ఇండియాలో అత్యధికంగా వక్ఫ్ బోర్డులకే భూములు ఉన్నాయని, వాటి హక్కులను కొందరు మాత్రమే అనుభవిస్తున్నారని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. రక్షణ దళాలకు 17 లక్షల ఎకరాలు ఉండగా.. 12 లక్షల ఎకరాలు రైల్వే భూములు ఉన్నాయని హోం మంత్రి బుధవారం పార్లమెంట్‌లో వెల్లడించారు. వక్ఫ్ బోర్డుల క్రింద మాత్రం 39 లక్షల ఎకరాలు ఉన్నాయని లెక్కలు చెప్పారు. ఇస్లామిక్ చట్టం ప్రకారం మతపరమైన లేదా దాతృత్వ ప్రయోజనాల కోసం విరాళంగా ఇచ్చిన ఆస్తులను వక్ఫ్ అంటారు.

Also read: Congress MLA CPR: కాంగ్రెస్ కార్యకర్తకు సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన ఎమ్మెల్యే (VIDEO)

ఒకసారి దానం చేసిన తర్వాత, ఆస్తి యాజమాన్యాన్ని అల్లాహ్ బదిలీ చేసి, తన ఆధీనంలోకి తీసుకుంటాడు. ఆస్తులు లేదా భూమిని అమ్మలేము. భారతదేశంలో వక్ఫ్ చరిత్ర 12వ శతాబ్దంలో నుంచి ప్రారంభమైంది. ముహమ్మద్ ఘోరీ భారత్‌పై దండయాత్ర అనంతరం ముల్తాన్‌లో 2 గ్రామాలను అల్లాహా( వక్ఫ్)కు బహుమతిగా ఇచ్చాడు. ఈ చట్టానికి సవరణ చేస్తూ వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు 2025 పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. ఇది లోక్, రాజ్య సభల్లో అమోదం కూడా పొందింది. వక్ఫ్ బోర్డుల ఆస్తుల యాజమాన్యంలో పారదర్శకత, సమర్థవంతమైన నిర్వహణ లక్ష్యంగా దీన్ని కేంద్ర తయారు చేసింది. ఆస్తులు వక్ఫ్ ఆస్తులుగా మార్చడంపై కూడా ఈ బిల్లు కొన్ని నియంత్రణలను విధిస్తుంది.

Also read: Drugs: లేడీ కానిస్టేబుల్ కారులో డ్రగ్స్.. తర్వాత ఏం జరిగిందంటే?

1913 నుంచి 2013 వరకు వక్ఫ్ బోర్డుకు మొత్తం18 లక్షల ఎకరాల భూమి ఉంది. 2013లో 1995 వక్ఫ్ చట్టాన్ని యుపిఎ II ప్రభుత్వం సవరించింది. 2013, 2025 మధ్యకాలంలో యుపిఎ ప్రభుత్వ హయాంలో వక్ఫ్ ఆస్తులు మరో 21 లక్షల ఎకరాలకు పెరిగాయని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. ప్రస్తుతం మొత్తం 39 లక్షల ఎకరాల ఆస్తులు మతం పేరు మీద వాటిని అనుభవిస్తున్నారని ఆరోపించారు. వక్ఫ్‌గా తాకట్టు పెట్టిన అన్ని ఆస్తులకు అల్లాహ్ అంతిమ యజమాని అయినప్పటికీ, వాటిని భౌతికంగా ఒక ముతవల్లి నిర్వహిస్తారు. రాష్ట్ర వక్ఫ్ బోర్డులు ప్రతి రాష్ట్రంలో వక్ఫ్ ఆస్తులను నిర్వహిస్తాయి. భారతదేశంలో 32 వక్ఫ్ బోర్డులు ఉన్నాయి. ఢిల్లీ, హైదరాబాద్, చెన్నై, బెంగుళూర్, కోల్‌కత్తా, ముంబై లాంటి మెట్రో నగరాల్లో కూడా వక్ఫ్ బోర్డులకు భారీగా భూములున్నాయి.  
ఢిల్లీలో 3లక్షల 60 వేల ఎకరాలు, హైదరాబాద్‌లో లక్షా 70 వేల ఎకరాలు, బెంగుళూర్‌లో 2 లక్షల 20 వేల ఎకరాలు భూమి వక్ఫ్ బోర్డుల పేరు మీద ఉంది.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Nainar Nagendran: తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా నైనార్ నాగేంద్రన్

బీజేపీ తమిళనాడు అధ్యక్షుడిగా పార్టీ నేత, తిరునల్వేలి ఎమ్మెల్యే నైనార్ నాగేంద్రన్ ఎన్నికయ్యారు. చెన్నైలో జరిగిన పార్టీ సమావేశంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్‌ ఛుగ్‌ ఈ విషయాన్ని ప్రకటించారు.

New Update
Nainar Nagendran declared BJP Tamil Nadu unit president

Nainar Nagendran declared BJP Tamil Nadu unit president

బీజేపీ తమిళనాడు అధ్యక్షుడిగా పార్టీ నేత, తిరునల్వేలి ఎమ్మెల్యే నైనార్ నాగేంద్రన్ ఎన్నికయ్యారు. చెన్నైలో జరిగిన పార్టీ సమావేశంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్‌ ఛుగ్‌ ఈ విషయాన్ని ప్రకటించారు. అయితే అధ్యక్ష పదవికి నాగేంద్రన్ ఒక్కరే నామినేషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఏకపక్షంగా పదవి ఆయనకే ఖరారైపోయింది. ఈ ఎన్నిక వెనుక అమిత్ షా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 2026లో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇటీవల బీజేపీ, అన్నాడీఎంకే పార్టీలు పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే.

Also Read: రేయ్ పాపం రా.. 13 కుక్కలను రేప్ చేసిన దుర్మార్గుడు- లైవ్ వీడియో వైరల్?

1960లో కన్యాకుమారి జిల్లా వడివీశ్వరంలో నాగేంద్రన్ జన్మించారు. 2001, 2011, 2021 ఎన్నికల్లో తిరునల్వేలి స్థానం నుంచి ఆయన మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2001- నుంచి 2006 సమయంలో ఏఐడీఎంకే పార్టీలో మంత్రిగా కూడా పనిచేశారు. ఇక 2017లో ఏఐడీఎంకేను వీడి బీజేపీలో చేరారు. 2020 జులై నుంచి పార్టీకి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉంటున్నారు. జయలలిత, పన్నీరుసెల్వం ప్రభుత్వాల్లో వివిధ శాఖలకు మంత్రిగా పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. 

Also Read: సోనియా, రాహుల్ గాంధీకి ఈడీ బిగ్ షాక్..

ప్రభుత్వ పాలనలో అనుభవం, ప్రజాధారణ, రాజకీయ వ్యూహాలపై పట్టుఉండటంతో అధిష్ఠానం ఆయన వైపే మొగ్గు చూపిందని విశ్లేషకులు చెబుతున్నారు. ఏఐడీఎంకే, బీజేపీలను సమన్వయం చేసుకోవడంలో ఆయన కీలకంగా వ్యవహరిస్తారని అంటున్నారు. అయితే ఇటీవల రామేశ్వరంలో పాంబన్ వంతెన ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో వేదికపై ప్రధాని మోదీతో పాటు నాగేంద్రన్ కనిపించారు. వాస్తవానికి బీజేపీలో రాష్ట్ర అధ్యక్షులు కావాలంటే పదేళ్ల పాటు ప్రాథమిక సభ్యత్వం ఉడాలి. కానీ పార్టీ అభివృద్ధికి నాగేంద్రన్ కృషి చేయడం వల్ల  ఆయనకు మినహాయింపు ఇచ్చినట్లు సమాచారం. 

telugu-news | rtv-news | national-news | bjp

Advertisment
Advertisment
Advertisment