National Herald case: సోనియా, రాహుల్ గాంధీకి ఈడీ బిగ్ షాక్..

నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి ఈడీ షాకిచ్చింది. ఈ కేసు దర్యాప్తులో జప్తు చేసిన రూ.661 కోట్ల స్థిరాస్తులను స్వాధీనం చేసుకునేందుకు తాజాగా నోటీసులు జారీ చేసింది.

New Update
Rahul gandhi and Sonia Gandhi

Rahul gandhi and Sonia Gandhi

నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించి మనీలాండరింగ్ కేసులో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. కాంగ్రెస్‌ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ED) షాకిచ్చింది. ఈ కేసు దర్యాప్తులో జప్తు చేసిన రూ.661 కోట్ల స్థిరాస్తులను స్వాధీనం చేసుకునేందుకు తాజాగా నోటీసులు జారీ చేసినట్లు పేర్కొంది.  ఢిల్లీ, ముంబయి, లక్నోలోని ఆస్తులపై ఈ మేరకు నోటీసులు అతికించినట్లు ఓ ప్రకటనలో చెప్పింది. 

Also Read: ఇవేం బల్లులురా మావా...ఒక్కటి అమ్మితే చాలు లైఫ్ సెటిలైనట్లే..

సంబధిత ఆస్తులను ఖాళీ చేయాలని.. లేదా వాటికి వచ్చే అద్దెలను బదిలీ చేయాలని చెప్పింది. PMLA చట్టం కింద ఈ మేరకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంది. అయితే నేషనల్ హెరాల్ట్‌ పత్రికకు అసోసియేటెడ్ జర్నర్స్ (AJL) ప్రచూరణకర్తగా ఉంది. దీనికి ‘యంగ్‌ ఇండియన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’ యాజమాన్య సంస్థ.  సోనియా, రాగుల్ గాంధీలతో పాటు మరికొందరు పార్టీ నేతలు ఇందులో ప్రమోటర్లుగా ఉన్నారు.  కాంగ్రెస్‌కు ఏజేఎల్‌ బకాయి పడ్డ రూ.90.21 కోట్లను వసూలు చేసుకునే అంశంలో యంగ్‌ ఇండియన్‌లో ఆర్థిక అవకతవకలు జరిగాయనే ఆరోపణలున్నాయి. దీనిపైనే ఈడీ దర్యాప్తు చేస్తోంది.   

Also read: భారీ భూకంపం.. ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని ప్రజలు పరుగే పరుగు- ఎక్కడంటే?

అయితే 2023 నవంబర్‌లో సంబంధిత స్థిరాస్తులతో పాటు ఏజేఎల్‌లో ఈక్విటీ షేర్ల రూపంలో ఉన్న యంగ్‌ ఇండియన్‌కు చెందిన రూ.90.21 కోట్లు జప్తు చేసింది. ఈ కేసులో సోనియా, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, సీనియర్ నేత పవన్ కుమార్‌ బన్సల్‌ను ఇప్పటికే ఈడీ విచారణ చేసింది. వాళ్ల స్టేట్‌మెంట్లు కూడా రికార్డ్ చేసింది. తాజాగా దానికి సంబంధించిన స్థిరాస్తులు స్వాధీనం చేసుకునేందుకు నోటీసులు పంపించింది.    

Also Read: సూట్ కేసులో లవర్‌ను దాచి.. హాస్టల్ రూమ్‌లోకి తీసుకెళ్లేందుకు స్కెచ్.. భలే దొరకాడుగా!

telugu-news | rtv-news | enforcement-directorate | national-news

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

భార్యతోపాటు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భారత్ పర్యటన.. షెడ్యూల్ ఇదే

అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్, భార్యతోపాటు భారత్‌ను సందర్శించనున్నారు. ఉషా వాన్స్‌ భారతీయ సంతతికి చెందిన వారు. జేడీ వాన్స్ ఫ్యామిలీతో కలిసి ఏప్రిల్ 18 నుంచి 24 వరకు ఇటలీ, ఇండియాలో పర్యటించనున్నారు. ఇండియాలో ప్రధాని మోదీతో సమావేశం అవ్వనున్నారు.

New Update
JD vance

JD vance

అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్, ఆయన భార్య ఉషా వాన్స్ భారత్‌ను సందర్శించనున్నారు. ఉషా వాన్స్‌ భారతీయ సంతతికి చెందిన వారు. వచ్చే వారం భారతదేశాన్ని సందర్శించనున్నట్లు ఆయన కార్యాలయం బుధవారం ప్రకటించింది. జేడీ వాన్స్ ఫ్యామిలీతో కలిసి ఏప్రిల్ 18 నుంచి 24 వరకు ఇటలీ, ఇండియా పర్యటన ఫిక్స్ అయ్యింది. ఆయా దేశాల ఆర్థిక, భౌగోళిక రాజకీయ ప్రాధాన్యతల గురించి చర్చిస్తారని వైస్ ప్రెసిడెంట్ ఆఫీస్ నుంచి ఓ ప్రకటన విడుదల అయ్యింది.

Also read: bihar fire accident: ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి నలుగురు పిల్లలు మృతి

ఇండియాలో ఆయన ప్రధాని మోదీని కలపనున్నారు. అమెరికా పర్యటనలో మోదీ జెడి వాన్స్‌ ఫ్యామిలీని కలిశారు. అప్పుడే ఆయన్ని ఇండియాకు ఆహ్వానించారు మోదీ. న్యూఢిల్లీ, జైపూర్, ఆగ్రాలను వారు సందర్శించనున్నారు. అలాగే రోమ్‌లో ఇటలీ ప్రధాన మంత్రి జార్జియా మెలోని, వాటికన్ విదేశాంగ కార్యదర్శి కార్డినల్ పియట్రో పరోలిన్‌తో కూడా సమావేశమవుతారు.

Also read: Donald Trump: ట్రంప్ టార్గెట్ హార్వర్డ్.. యూనివర్సిటీపై తన స్టైల్లో జోకులు

Advertisment
Advertisment
Advertisment