Blood Sugar Level: వయస్సు 50 ఏళ్లు దాటిందా..? రక్తంలో చక్కెర స్థాయి ఎంత ఉండాలో తెలుసా..?

50 ఏళ్ల వయస్సు ఉంటే రక్తంలో చక్కెర స్థాయిలు డెసిలీటర్‌కు 90, 130 మిల్లీగ్రాముల (mg/dL) మధ్య ఉండాలి. మధ్యాహ్నం భోజనం తర్వాత 140 mg/dL, రాత్రి భోజనం తర్వాత రక్తంలో చక్కెర స్థాయి 150 mg/dL అయితే సాధారణమైనది. చక్కెర స్థాయి 300 దాటితే సమస్యగా మారవచ్చు.

New Update

Blood sugar level: ప్రపంచవ్యాప్తంగా లెక్క లేనన్ని మంది డయాబెటిస్ వంటి ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్నారు. డయాబెటిస్ అనేది జీవితాంతం మీతోనే ఉండే వ్యాధి. దీనిని నయం చేయలేని వ్యాధి అని కూడా పిలుస్తారు. అయితే ఆహారం, జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకుంటే మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవడం కష్టం కాదు. డయాబెటిస్ లక్షణాలను గుర్తించడంలో, నిర్వహించడంలో రక్తంలో చక్కెర స్థాయిలు ఒక ముఖ్యమైన అంశం. నిజానికి శరీరానికి శక్తిని అందించడానికి రక్తంలో చక్కెర అవసరం. అయితే రక్తంలో చక్కెర స్థాయిలు చాలా ఎక్కువగా ఉంటే లేదా చాలా తక్కువగా ఉంటే అది తీవ్రమైన ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. 

రక్తంలో చక్కెరను నియంత్రణలో...

45 నుండి 50 సంవత్సరాల వయస్సు గల వ్యక్తుల రక్తంలో చక్కెర స్థాయిలు డెసిలీటర్‌కు 90, 130 మిల్లీగ్రాముల (mg/dL) మధ్య ఉండాలి. అదే సమయంలో భోజనం తర్వాత చక్కెర స్థాయి 140 mg/dL కంటే తక్కువగా ఉండాలి. రాత్రి భోజనం తర్వాత రక్తంలో చక్కెర స్థాయి 150 mg/dL అయితే అది సాధారణమైనదిగా పరిగణించబడుతుంది. చక్కెర స్థాయి 300 దాటితే అది సమస్యగా మారవచ్చు. అటువంటి పరిస్థితిలో వెంటనే వైద్యుడిని సంప్రదించి సలహా తీసుకోవడం మంచిది. రక్తంలో చక్కెరను నియంత్రణలో ఉంచడానికి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడం చాలా ముఖ్యం. 

ఇది కూడా చదవండి: శ్రీరామ నవమి రోజు ఈ తప్పులు చేయకండి

క్రమం తప్పకుండా శారీరక శ్రమలు చేయాలి. రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడానికి లేదా తగ్గడానికి కారణమేమిటో తెలుసుకోవడానికి రక్తంలో చక్కెర స్థాయిలను గమనిస్తూ ఉండాలి. క్రమం తప్పకుండా ఏదైనా తింటుండాలి, కేలరీలు, సంతృప్త కొవ్వు, చక్కెర, ఉప్పు తక్కువగా ఉన్న ఆహారాన్ని ఎంచుకోండి. జ్యూస్ లేదా సోడాకు బదులుగా నీరు తాగాలి. మద్యపానాన్ని పరిమితం చేయండి లేదా నివారించండి. ఆహారంలో కార్బోహైడ్రేట్లు రక్తంలో చక్కెర స్థాయిలను ప్రభావితం చేస్తాయి. డయాబెటిస్ ఉంటే కార్బోహైడ్రేట్లను తినవచ్చు. ఎంత కార్బోహైడ్రేట్లు తినవచ్చనేది వయస్సు, బరువు, ఇతర అంశాలపై ఆధారపడి ఉంటుంది.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: ముల్తానీ మిట్టి vs శనగ పిండి..చర్మానికి ఏది బెటర్‌?

( regulates-blood-sugar-level | best-leaves-to-reduce-blood-sugar-levels | health-tips | health tips in telugu | best-health-tips | latest-news)

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

ఇంట్లోనే ఎండు ద్రాక్షను తయారు చేసుకోవడం ఎలాగంటే?

ఒక పాత్రలో నీళ్లు తీసుకుని మరిగించాలి. ఇందులో కేజీ ద్రాక్ష పండ్లను వేసి ఉబ్బినంత వరకు ఉడికించాలి. ఆ తర్వాత వడబోసి కాటన్ క్లాత్‌లో వేసి ఎండలో ఆరబెట్టాలి. ఇలా నాలుగు రోజుల పాటు ఆరబెడితే హోమ్ మేడ్ కిస్‌మిస్ రెడీ.

New Update
raisins making

raisins making Photograph: (raisins making)

కిస్‌మిస్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలోని పోషకాలు ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా కాపాడతాయి. అయితే వీటిని స్వీట్లు, తీపి పదార్థాలు ఇలా ప్రతీ దాంట్లో కూడా వేస్తారు. మరికొందరు వీటిని నానబెట్టి పరగడుపున తింటారు. అయితే మార్కెట్‌లో దొరికే కిస్‌మిస్‌లో కల్తీ ఉంటుంది. వీటివల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ఎలాంటి కల్తీ లేకుండా సహజంగా ఇంట్లోనే కిస్‌మిస్‌ను ఈజీగా తయారు చేసుకోవచ్చు. అదెలాగో ఈ స్టోరీలో చూద్దాం.

ఇది కూడా చూడండి: BRS: బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పోలీసుల అనుమతి మంజూరు..!

ద్రాక్ష పండ్లు మునిగేంత వరకు..

కిస్‌మిస్‌ను తయారు చేయడానికి కేజీ ద్రాక్ష, నీరు ఉంటే సరిపోతుంది. ఒక వెడల్పు ఉన్న గిన్నెలో ద్రాక్ష పండ్లు వేసి, మునిగేంత వరకు నీళ్లు, ఉప్పు వేసి ఒక 15 నిమిషాల పాటు అలా వదిలేయాలి. ఆ తర్వాత వాటిని శుభ్రం చేసి స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి సగానికి పైగా నీళ్లు వేయాలి. నీరు మరుగుతున్నప్పుడు శుభ్రం చేసుకున్న ద్రాక్ష వేసుకుని ఓ 5 నిమిషాల పాటు ఉడికించాలి. 

ఇది కూడా చూడండి: SRH VS PBKS: వాట్ ఏ కమ్ బ్యాక్..ఎస్ఆర్హెచ్ దుమ్ము దులిపేసింది మామా..

అవి కాస్త ఉబ్బిన వెంటనే స్టవ్​ ఆఫ్​ చేసి వెంటనే వడకట్టాలి. వీటిని కాటన్ క్లాత్‌లో వేసుకుని ఎండలో ఉంచాలి. రెండు లేదా ఆరు రోజుల వరకు ఎండలో ఉంచితే అవి ఎండుతాయి. వీటిపై ఎలాంటి దుమ్ము, ధూళీ పడకుండా ఉండటానికి పల్చటి క్లాత్ కప్పాలి. ​అంతే ఇక కిస్‌మిస్ రెడీ అయినట్లే.

ఇది కూడా చూడండి: TS: భూభారతిపై అవగాహనా సదస్సులు..సీఎం రేవంత్ రెడ్డి

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
Advertisment
Advertisment