Group 1: గ్రూప్-1 అవకతవకలపై పోరాటం చేస్తాం.. TGPSCపై కేసు వేస్తా: రాకేశ్ రెడ్డి

గ్రూప్-1 అవకతవకలను ఆధారాలతో బయటపెట్టామని బీఆర్‌ఎస్‌ నేత రాకేశ్‌ రెడ్డి అన్నారు. టాప్‌ 500లో ఒక్క తెలుగు మీడియం అభ్యర్థి ఎందుకు లేరన్నారు. ఇందులో జరిగిన అవకతవకలపై పోరాటం కొనసాగిస్తామని పేర్కొన్నారు. అలాగే టీజీపీఎస్సీపై పరువు నష్టం దావా వేస్తానని తెలిపారు.

New Update
BRS Leader Rakesh Reddy

BRS Leader Rakesh Reddy

బీఆర్‌ఎస్‌ నేత రాకేశ్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము పూర్తి ఆధారాలతో గ్రూప్-1 అవకతవకలను బయటపెట్టామని తెలిపారు. టీజీపీఎస్సీకి క్షమాపణ చెప్పే ప్రసక్తిలేదన్నారు. అవకతవకలపై ప్రశ్నలకు టీజీపీఎస్సీ ఎందుకు సమాధానాలివ్వట్లేదని ప్రశ్నించారు. నోటీసులు జారీ చేయడంపై ఉన్న శ్రద్ధ అభ్యర్థులకు జవాబు ఇవ్వడంలో ఉండాలన్నారు.  

Also Read: గర్ల్‌ఫ్రెండ్‌ను సూట్‌కేసులో తీసుకెళ్లిన ఘటనలో బిగ్ ట్విస్ట్.. స్పందించిన యూనివర్సిటీ

'' గ్రూప్‌ -1 ఫలితాల్లో టాప్‌ 500లో ఒక్క తెలుగు మీడియం అభ్యర్థి లేదు. ఇలా ఎందుకు జరిగింది ?. ప్రిలిమ్స్, మెయిన్స్‌కు వేరువేరు హాల్‌టికెట్లు ఎందుకు ఇచ్చారు. మహిళలు, పురుషులకు వేరువేరు కేంద్రాలు ఎందుకు ఏర్పాటు చేశారు ?. మొత్తం 46 సెంటర్లు ఉంటే 2,3 సెంటర్ల నుంచే టాపర్స్‌ ఎందుకు వచ్చారు ?. 

Also Read: జలియన్ వాలాబాగ్‌ మారణకాండకు నేటికి 106 ఏళ్లు.. బ్రిటిష్‌ వాళ్ల ఊచకోతకు కారణం ఏంటి ?

రిటైర్డ్, కాంట్రాక్టు లెక్చరర్లతో గ్రూప్‌-1 పేపర్లు ఎందుకు దిద్దించారు. మేము ఇందులో జరిగిన అవకతవకలపై పోరాటం కొనసాగిస్తాం. దీనిపై న్యాయ విచారణ జరపాలి. ఇలా చేస్తే మేము ఆధారాలు చూపిస్తాం. నేను టీజీపీఎస్సీపై పరువు నష్టం దావా వేస్తానని'' రాకేశ్ రెడ్డి అన్నారు. ఇదిలాఉండగా గ్రూప్ -1 ఫలితాలు వచ్చాక తెలుగు మీడియం విద్యార్థులకు అన్యాయం జరిగిందని అభ్యర్థులు ఆరోపించిన సంగతి తెలిసిందే. దీనిపై వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. 

Also Read: హెచ్ 1బీ వీసా, గ్రీన్ కార్డ్..నిత్యం ఉంచుకోవాల్సిందే..వలసదారులకు స్ట్రిక్ట్ రూల్స్

group-1 | telugu-news | brs | congress 

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Hyderabad: హైదరాబాద్‌లో పాకిస్తానీయులు.. పోలీసులు సంచలన నిర్ణయం

హైదరాబాద్‌లో షార్ట్‌ టర్మ్ వీసా హోల్డర్స్‌ అయిన నలుగురు పాకిస్తానీయులను పోలీసులు గుర్తించారు. ఆ నలుగురికి నోటీసులు జారీ చేశారు. రేపటిలోగా హైదరాబాద్‌ విడిచి వెళ్లిపోవాలని ఆదేశించారు. లాంగ్‌టర్మ్‌ వీసాలు ఉన్నవాళ్లని మాత్రం కేంద్రం మినహాయించింది.

author-image
By B Aravind
New Update
Hyderabad Police Sent Notices to Pakistani nationals on short on visa

Hyderabad Police Sent Notices to Pakistani nationals on short on visa

పహల్గాం ఉగ్రదాడి ఘటనతో హై అలెర్ట్ నెలకొంది. భారత్‌లో ఉంటున్న పాకిస్తానీయులపై  పోలీసులు నిఘా పెడుతున్నారు. తాజాగా హైదరాబాద్‌లో ఉంటున్న నలుగురు పాకిస్తానీయులను పోలీసులు గుర్తించారు. వాళ్లని షార్ట్‌ టర్మ్ వీసా హోల్డర్స్‌గా గుర్తించారు. ఈ నేపథ్యంలో ఆ నలుగురికి నోటీసులు జారీ చేశారు. రేపటిలోగా హైదరాబాద్‌ విడిచి వెళ్లిపోవాలని ఆదేశించారు.    

Also Read: దాడిపై దర్యాప్తు సిద్ధమని కాళ్ల బేరానికి పాకిస్తాన్.. మాకు నీళ్లు కావాలి!

Hyderabad Police Sent Notices To Pakistani Nationals

మొత్తంగా చూసుకుంటే హైదరాబాద్‌లో 213 మంది పాకిస్తానీయులు ఉన్నారు. ఇందులో 209 మందికి లాంగ్‌టర్మ్ వీసాలు ఉన్నాయి. మిగతా నలుగురికి షార్ట్‌ టర్మ్‌ వీసాలు ఉన్నాయి. ఈ నలుగురి పైనే పోలీసులు నిఘా పెట్టారు. రేపటిలోగా వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే లాంగ్‌టర్మ్‌ వీసాలు ఉన్నవాళ్లని మాత్రం కేంద్రం మినహాయించింది.  

ఇదిలాఉండగా.. దేశ వ్యాప్తంగా ఉన్న పాకిస్థానీలు భారత్ వదిలి ఏప్రిల్ 29 లోగా వెళ్లిపోవాలని కేంద్రం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు కేంద్ర హోంశాఖ మంత్రి అమిషా సైతం అన్ని రాష్ట్రాల ముఖ్య మంత్రులకు ఫోన్‌లు చేసి తమ తమ రాష్ట్రాల్లో ఉన్న పాకిస్థానీయులను గుర్తించి తమ దేశాలకు పంపించేయాలని తెలిపారు.  దీంతో రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు అదే పనిలో పడ్డాయి. ఇందులో భాగంగానే తెలంగాణలో పోలీసులు రాష్ట్రం మొత్తం జల్లెడ పట్టారు. 

Also Read: గుజరాత్‌లో 550 మంది బంగ్లాదేశీయులు అరెస్టు!

మరోవైపు హైదరాబాద్ పోలీసులు గురువారం ఓ పాక్ యువకుడ్ని అదుపులోకి తీసుకున్నారు. మహమ్మద్ ఫయాజ్ అనే యువకుడు గతంలో హైదరాబాద్కి చెందిన ఓ యువతిని వివాహం చేసుకున్నాడు. ఇప్పుడు ఆ యువతిని కలిసేందుకు పాక్ నుంచి నేపాల్ మీదుగా హైదరాబాద్కు వచ్చాడు. దీంతో మహమ్మద్ ఫయాజ్ను గుర్తించిన పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. కాగా ఆ పాక్ యువకుడు దుబాయ్లో ఉద్యోగం చేస్తున్నట్లు తెలిసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.  

Also Read: అమర్నాథ్ యాత్రపై స్పెషల్ ఫోకస్.. కేంద్రం కీలక నిర్ణయం

Also Read :  పాకిస్తాన్‌తో యుద్ధం వద్దు.. సీఎం సిద్ధరామయ్య సంచలన కామెంట్స్

telugu-news | rtv-news | Pahalgam attack

Advertisment
Advertisment
Advertisment