ఖమ్మం: తగ్గిన వరద.. ఆ రూట్లో రాకపోకలకు పోలీసుల అనుమతి
ఖమ్మం జిల్లాలో తీగల బంజారా వాగు వరద ఉధృతి తగ్గింది. దీంతో పల్లిపాడు నుంచి ఏన్కూరు రహదారి పై ట్రాఫిక్ ను అనుమతిస్తున్నారు. ఈ మేరకు ఖమ్మం సీపీ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.
ఖమ్మం జిల్లాలో తీగల బంజారా వాగు వరద ఉధృతి తగ్గింది. దీంతో పల్లిపాడు నుంచి ఏన్కూరు రహదారి పై ట్రాఫిక్ ను అనుమతిస్తున్నారు. ఈ మేరకు ఖమ్మం సీపీ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.
జూనియర్ ఎన్టీఆర్ ముంబైలో అడుగుపెట్టాడు. ఆయన నటించిన 'దేవర' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను ముంబై లో నిర్వహించనున్నన్నారు. ఈ క్రమంలోనే ప్రమోషన్స్ కోసం ఎన్టీఆర్ ముంబైలో ల్యాండ్ అయ్యాడు. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రముఖ తెలంగాణ కవి కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఆయన చిత్రపటానికి పూల మాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. నిన్న ప్రశ్నించే గొంతుకగా… నేడు ప్రజా పాలకుడిగా.. తనకు స్ఫూర్తి కాళోజీ అని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి అన్నారు.
పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడడం ఖాయమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు జోస్యం చెప్పారు. ఆయా ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రావడం ఖాయన్నారు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆయన స్వాగతించారు.
క్రిమినల్స్ పై ఉక్కుపాదం మోపుతామని హైదరాబాద్ కొత్త సీపీ సీవీ ఆనంద్ అన్నారు. డ్రగ్స్, గంజాయి నిర్మూలన ప్రధాన లక్ష్యమన్నారు. కొద్ది సేపటి క్రితం ఆయన సీపీగా బాధ్యతలు స్వీకరించారు. తనకు అవకాశం ఇచ్చిన సీఎం రేవంత్ కు కృతజ్ఞతలు తెలిపారు.
కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు తెలంగాణ హైకోర్టు బిగ్షాక్ ఇచ్చింది. ఎమ్మెల్యేల అనర్హత అంశంపై కీలక ఆదేశాలు జారీ చేసింది. అనర్హత పిటిషన్లు స్పీకర్ ముందు ఉంచాలని అసెంబ్లీ సెక్రటరీని హైకోర్టు ఆదేశించింది.
కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'ఎమెర్జెన్సీ' సినిమా విడుదలకు సెన్సార్ యూనిట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ఎగ్జామినింగ్ కమిటీ సినిమాకు 'UA' సర్టిఫికేషన్ ఇస్తూ పలు సన్నివేశాల విషయంలో అభ్యంతరం వ్యక్తం చేసింది.
'ఇండియన్2' మూవీలోని కొన్ని డైలాగ్స్ పెట్ లవర్స్ను కించపరిచేలా ఉన్నాయంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై రేణు దేశాయ్ స్పందిస్తూ, సంచలన పోస్ట్ పెట్టింది. సినిమా ఫ్లాప్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటి డైలాగ్స్ ను ఈ ఇడియట్ రైటర్స్ ఎలా రాస్తున్నారని ఫైర్ అయింది.
నందమూరి మోక్షజ్ఞ తన డెబ్యూ మూవీ కోసం భారీగా కష్టపడ్డారట. గతంలో చాలా లావుగా ఉండే మోక్షజ్ఞ, హీరో కటౌట్ కోసం 18 కేజీలు తగ్గాడు. అదికూడా కేవలం 5 నెలల్లోనే. దీంతో మోక్షు డెడికేషన్ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ప్రశాంత్ వర్మ మోక్షజ్ఞ డెబ్యూ మూవీని తెరకెక్కించనున్నారు.