Telangana: నేడు ఈ జిల్లాల్లో వర్షాలు
తెలంగాణ లో వర్షాల గురించి హైదరాబాద్ వాతావరణ కేంద్ర అధికారులు ఓ కీలక అప్డేట్ ఇచ్చారు.బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ద్రోణి తరహా వాతావరణం ఉందని దాని ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు.
తెలంగాణ లో వర్షాల గురించి హైదరాబాద్ వాతావరణ కేంద్ర అధికారులు ఓ కీలక అప్డేట్ ఇచ్చారు.బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ద్రోణి తరహా వాతావరణం ఉందని దాని ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు.
మంత్రి ఉత్తమ్ తండ్రి పురుషోత్తం రెడ్డి ఈ రోజు మరణించారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ఉత్తమ్ నివాసానికి వెళ్లి ఆయనను పరామర్శించారు. పురుషోత్తం రెడ్డి భౌతికకాయానికి నివాళులర్పించారు.
తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తండ్రి పురుషోత్తంరెడ్డి ఈ రోజు అనారోగ్యంతో చనిపోయారు. సాయంత్రం హైదరాబాద్ లోని మహాప్రస్థానం శ్మశాన వాటికలో ఆయన అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
తెలంగాణలో రాగల ఒకటి రెండు రోజులు వర్షాలు పడే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడుతాయని చెప్పింది.
విజయవాడ - హైదరాబాద్ జాతీయ రహదారి పై శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఖమ్మం నుంచి మియాపూర్ వైపు వెళుతున్న బస్సును లారీ ఢీకొట్టడంతో ఇద్దరు ప్రయాణికులు మృతి చెందారు.
నల్గొండలో దారుణం చోటుచేసుకుంది. పుట్టలగడ్డ తండాకు చెందిన నాగు నాయక్ ప్రేమ పేరుతో యువతిని నమ్మించి గ్యాంగ్ రేప్ చేసి హత్య చేశాడు. యువతి పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేయడంతో హత్యకు స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది.
అధికార అహంకారంతో ఉమ్మడి నల్గొండ జిల్లా మంత్రులు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. వారి అరాచకాలను ప్రజా క్షేత్రంలో ఎండగడతామన్నారు. ఈ రోజు నల్గొండ ముఖ్య నేతలతో కేటీఆర్ భేటీ అయ్యారు.
ప్రియుడి మోజులో భర్తను కొడుకు కళ్లముందే కడతేర్చింది ఓ భార్య. సూర్యాపేట జిల్లా హనుమతండాకు చెందిన కౌసల్య మద్యం మత్తులో ఉన్న భర్త సైదాను గొడ్డలితో నరికి చంపింది. కొన్నాళ్లకు కొడుకు నిజం బయటపెట్టడంతో కౌసల్యను పోలీసులు అరెస్ట్ చేశారు.