బస్సు బోల్తా.. 20 మందికి తీవ్ర గాయాలు

హైదరాబాద్ నుంచి చెన్నై ప్రయాణిస్తున్న ప్రైవేట్ బస్సు ప్రమాదానికి గురైంది. మర్రిపాడ బైపాస్ దగ్గర వంతెన నిర్మాణ పనులు జరుగుతుండటంతో బారికేడ్లను తప్పించబోయి బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో దాదాపుగా 20 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి.

New Update
Road Accident rangareddy

నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్తున్న ప్రైవేట్ బస్సు ప్రమాదానికి గురైంది. హైదరాబాద్‌ రోడ్డు చంద్రగిరి విల్లాస్ కాలనీకి దగ్గర అర్ధరాత్రి పూట బస్సు ఒక్కసారిగా బోల్తా పడింది. ఈ ప్రమాదంలో సుమారు 20 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వెంటనే స్థానికులు గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.

ఇది కూడా చూడండి: 'OG' కథ బాబాయ్ కన్నా ముందు నేనే విన్నా.. సినిమా మీ ఊహకే అందదు: వరుణ్ తేజ్

తప్పించబోయి బోల్తా..

ఈ ప్రమాదానికి గురైన బస్సు ఆరెంజ్ ట్రావెల్స్‌కి చెందినదని సమాచారం. మర్రిపాడ బైపాస్ దగ్గర వంతెన నిర్మాణ పనులు జరుగుతున్నాయి. రోడ్డుపై అడ్డంగా ఉన్న బారికేడ్లను తప్పించుకునే క్రమంలో బస్సు బొల్తా పడింది. సుమారుగా 35 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ఈ ప్రమాదానికి గురైంది. అయితే విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. 

ఇది కూడా చూడండి: Cinema: కొరియోగ్రాఫర్ జానీ నేషనల్ అవార్డు రద్దు

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

ఎంత దారుణంగా చంపారంటే.. బయటకు వచ్చిన ఉగ్రదాడి ఫస్ట్ వీడియో!

జమ్మూ కాశ్మీర్‌లోని ఉగ్రవాదులు పర్యాటకులపై కాల్పులు జరుగుతున్న వీడియో బయటకు వచ్చింది. కేవలం పర్యాటకులను మాత్రమే టార్గెట్ చేసుకుని కాల్పులు జరిపారు. అందులో కూడా మతం, పేర్లు అడిగి మరి కాల్పులు జరిపిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

New Update

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో 28 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే పహల్గామ్‌లో ఉగ్రవాదులు పర్యాటకులపై కాల్పులు జరుగుతున్న వీడియో బయటకు వచ్చింది. కేవలం పర్యాటకులను మాత్రమే టార్గెట్ చేసుకుని కాల్పులు జరిపారు. అందులో కూడా మతం, పేర్లు అడిగి మరి కాల్పులు జరిపిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

ఇది కూడా చూడండి: TG Crime: కోడలిపై మోజుతో కొడుకును లేపేసిన తండ్రి.. రోకలి బండతో కొట్టి చంపి!

ఇది కూడా చూడండి: Betting Apps Pramotion Case : ప్రభుత్వం సంచలన నిర్ణయం..సెలబ్రిటీ బెట్టింగ్ యాప్స్ కేసు సీఐడీకి బదిలీ

మొత్తం 28 మంది..

ఇదిలా ఉండగా మినీ స్విట్జర్లాండ్‌గా పేరుపొందిన పహల్గాంలోని బైసారన్‌ ప్రాంతంలో మంగళవారం మధ్యాహ్నం ఉగ్రదాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో 28 మంది టూరిస్టులు మృతి చెందగా.. మరో 20 మందికి పైగా గాయాలపాలయ్యారు. మృతుల్లో ఇద్దరు విదేశీయులు కూడా ఉన్నారు. వాళ్లలో ఒకరు నేపాలీ కాగా మరొకరు యూఏఈ. మిగతావారు భారత్‌లోని మహారాష్ట్ర, గుజరాత్, యూపీ, హర్యానా, బీహార్, కర్ణాటక రాష్ట్రాలకు చెందినవారు ఉన్నారు.  

ఇది కూడా చూడండి: Indus River Agreement: 64 ఏళ్ళ ఒప్పందానికి స్వస్తి..ఎడారిగా మారనున్న పాకిస్తాన

ఇది కూడా చూడండి: Sunstroke: వడదెబ్బకు ఏడుగురు మృతి.. మరో రెండ్రోజులు వడగాల్పులు

Advertisment
Advertisment
Advertisment