Russian Scientist: ఆకాశానికి నిచ్చెన వేస్తున్న రష్యా.. లిఫ్ట్‌లో అంతరిక్షంలోకి!

రాకెట్ సహాయం లేకుండా అంతరిక్షానికి ప్రయానిద్దామని రష్యా శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తున్నారు. భూమిపై 36 వేల కిలోమీటర్ల ఎత్తులో భూస్థిర కక్ష్యలో ఉండే ఓ ఉపగ్రహం భారీ కేబుల్‌ను స్థిరంగా పట్టుకొని ఉంచుతుంది. దాంతో ఎక్సలేటర్ ఏర్పాటు చేద్దామని అనుకుంటున్నారు.

New Update
Russian scientists sky ladder

Russian scientists sky ladder Photograph: (Russian scientists sky ladder)

రష్యా దేశం ఓ గొప్ప ప్రయోగం చేస్తోంది. ఆకాశానికి నిచ్చెన వేసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. ఈ దిశగా రష్యన్ ఖగోళ శాస్త్రవేత్తలు (Russian Scientists) ప్రయోగాలు చేస్తున్నారు. స్పేస్‌ ఎలివేటర్‌ ఆలోచన ఇప్పటిది కాదు. 1895లో రష్యన్‌ శాస్త్రవేత్త కొన్‌స్టెంటిన్‌ సియోల్కోవ్క్సీ ఆకాశానికి నిచ్చెన వేయాని ఆలోచించారు. భూమిపై నుంచి 36 వేల కిలోమీటర్ల ఎత్తులో భూ స్థిర కక్ష్యలో ఉండే ఓ ఉపగ్రహం అతి భారీ కేబుల్‌ను స్థిరంగా పట్టుకొని ఉంచుతుంది. ఇది ఎల్లప్పుడూ ఒకే ప్రదేశంలో, అంటే భూమధ్య రేఖ వద్ద తిరుగుతుంది. అంతరిక్షం నుంచి ఒక కేబుల్‌ భూమికి వేలాడుతూ ఉంటుంది. గురుత్వాకర్షణ శక్తి, సెంట్రిఫ్యూయల్‌ ఫోర్స్‌ దీన్ని పడిపోకుండా స్థిరంగా ఉంచుతాయి. సముద్రంలో నౌక లంగరు వేసినట్టే.. ఈ కేబుల్‌ భూమిపై పర్వతం లేదా టవర్‌ లేదా సముద్రంలో మొబైల్‌ టవర్‌కు లంగర్‌ వేసి ఉంటుంది. విద్యుత్తు సాయంతో ఎలివేటర్‌ లేదా లిఫ్ట్‌లో వెళ్లినట్టు వ్యోమగాములు ఆ కేబుల్‌ను అధిరోహిస్తారు. ఉపగ్రహాలు, ఇతర సామగ్రి, మానవులను కూడా అంతరిక్షంలోకి తీసుకెళ్తారు. 

Also read: International Space Station : అక్కడ 24గంటల్లో 16 సార్లు సూర్యోదయం, 16 సార్లు సూర్యాస్తమయం

Also Read :  షాకింగ్ న్యూస్.. మలయాళ మెగాస్టార్‌ మమ్ముట్టికి క్యాన్సర్?

Russian Scientist Experment

రాకెట్‌ అవసర లేకుండా, అతి తక్కువ ఖర్చుతో ఎలాంటి కాలుష్యం లేకుండా ఇది పని చేస్తుంది. అలా వెళ్లాలంటే ఆ కేబుల్‌ కచ్చితంగా స్టీల్‌ కంటే 50 రెట్లు దృఢంగా ఉండాలి. అందుకు కార్బన్‌ నానోట్యూబ్స్‌ లేదా గ్రాఫీన్‌ లాంటి పదార్థాలు అవసరం. కేబుల్‌ నిర్మాణం పడిపోతుందని భయపడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే, కేబుల్‌ ద్రవ్యరాశిలో 1 శాతం బరువున్న పేలోడ్లను ఎలాంటి ఇబ్బంది లేకుండా పైకి చేర్చవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ స్పేస్‌ ఎలివేటర్‌ కల గనుక ఆచరణలోకి వస్తే అంతరిక్ష యాత్రలు సర్వసాధారణం అయిపోతాయి. అంతరిక్ష పరిశోధనల్లో పురోగతి, రోజురోజుకు వస్తున్న టెక్నాలజీ దృష్ట్యా రాబోయే దశాబ్దాల్లో ఇది సాకారం కావొచ్చని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఎంచెక్కా కేబుళ్ల సాయంతో ఎలివేటరో, లిఫ్టో ఎక్కి చందమామను దగ్గర్నుంచి వీక్షించే గడియలు రాబోయే దశాబ్దాల్లో మనం చూసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. సైన్స్‌ ఫిక్షన్‌ సినిమాల్లో మాత్రమే జరిగే ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేయడం కష్టమేమీ కాదని శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు.

Also Read: పాకిస్థాన్‌లో ఎయిర్‌పోర్టులో దాడులు.. మరో ఉగ్రవాది హతం !

Also Read :  భర్త షాపుకు వెళ్లగానే ప్రియుడితో రాసలీలలు.. పెట్రోల్ పోసి తగలబెట్టిన యజమాని!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

China: స్నేహం కావాలి..అమెరికా దెబ్బకు చైనాకు భారత్ గుర్తొచ్చింది..

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధిస్తున్న సుంకాలతో చైనాకు ఊపిరి ఆడడం లేదు. చైనా కూడా ఈ యుద్ధంలో తగ్గడం లేదు కానీ.. మిగతా దేశాల సపోర్ట్ కావాలని మాత్రం అనుకుంటోంది. భారత్‌ సహా పొరుగు దేశాలతో సంబంధాలను బలోపేతం చేసుకుంటామని అధ్యక్షుడు జిన్‌పింగ్‌ అన్నారు. 

New Update
11

చైనాకు భారత్ పొరుగు దేశం. ఒకే సరిహద్దును పంచుకుంటున్న ఆసియా దేశాలు. కానీ ఆ దేశం ఎప్పుడు ఇండియా మీద కాలుదువ్వుతూనే ఉంటుంది. మన దేశంలో ప్రదేశాలను ఆక్రమించుకోడానిక, దాడి చేయడానికి అదను చూస్తూనే ఉటుది. ఎవరు ఎంత చెప్పినా వినలేదు. కానీ ఇప్పుడు మాత్రం భారత్ తో సమా పొరుగు దేశాతో వ్యాహాత్మక సంబంధలను పెంపొందించుకొంటామని అంటున్నారు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్. దీనికి కారణం అమెరికా కొట్టిన సుంకాల దెబ్బ. మిగతా ఏ దేశాలకు లేని విధంగా అత్యధిక టారీఫ్ లను చైనాపై విధించారు ట్రంప్. ఏకంగా 125 శాతం టారీఫ్ లతో విరుచుకుపడ్డారు. చైనా కూడా అమెరికా ధీటుగా జవాబిస్తోంది కానీ ఎక్కువ కాలం నిలబడలేకపోవచ్చును. ఇప్పుడు ఆ దేశానికి మిగతా దేశాల సపోర్ట్ చాలా అవసరం. అందులో భాగ్గానే జిన్ పింగ్ స్నేహం కావాలి అంటూ చిలక పలుకులు పలుకుతున్నారు. 

ఉమ్మడి లక్ష్యం కోసం కలిసి పని చేస్తాం..

తమ మధ్య అభిప్రాయ భేదాలు తగ్గించుకుని సరఫరా వ్యవస్థలను మరింత పెంపొందించుకునేదుకు ప్రయత్నిస్తామని చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ చెబుతున్నారు. పొరుగు దేశాలు ముఖ్యంగా భారత్ తో కలిసి పని చేస్తామని.. ఒక మంచి ఉమ్మడి సమాజాన్ని నిర్మిస్తామని అంటున్నారు. బీజింగ్‌లో మంగళ, బుధవారాల్లో రెండు రోజులపాటు జరిగిన ఉన్నతస్థాయి కేంద్ర కమిటీ సమావేశంలో జిన్‌పింగ్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. చైనా ప్రధాని లీ కియాంగ్ కూడా దీనికి వత్తాసు పలికారు. అధ్యక్షుడు చెప్పినట్టుగా పొరుగు దేశాలతో వ్యవహారం అమలులో పెట్టాలని అన్నారు.  ఇందులో భాగంగా జిన్‌పింగ్‌ త్వరలో కీలక పొరుగు దేశాలైన వియత్నాం, మలేసియా, కాంబోడియాలలో సందర్శించే అవకాశముంది.

today-latest-news-in-telugu | china | india | usa | trump tariffs 

Also Read: Mary Kom: విడాకులు తీసుకోబోతున్న మేరీకోమ్?

 

Advertisment
Advertisment
Advertisment