China: స్నేహం కావాలి..అమెరికా దెబ్బకు చైనాకు భారత్ గుర్తొచ్చింది..

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధిస్తున్న సుంకాలతో చైనాకు ఊపిరి ఆడడం లేదు. చైనా కూడా ఈ యుద్ధంలో తగ్గడం లేదు కానీ.. మిగతా దేశాల సపోర్ట్ కావాలని మాత్రం అనుకుంటోంది. భారత్‌ సహా పొరుగు దేశాలతో సంబంధాలను బలోపేతం చేసుకుంటామని అధ్యక్షుడు జిన్‌పింగ్‌ అన్నారు. 

New Update
11

China: చైనాకు భారత్ పొరుగు దేశం. ఒకే సరిహద్దును పంచుకుంటున్న ఆసియా దేశాలు. కానీ ఆ దేశం ఎప్పుడు ఇండియా మీద కాలుదువ్వుతూనే ఉంటుంది. మన దేశంలో ప్రదేశాలను ఆక్రమించుకోడానిక, దాడి చేయడానికి అదను చూస్తూనే ఉటుది. ఎవరు ఎంత చెప్పినా వినలేదు. కానీ ఇప్పుడు మాత్రం భారత్ తో సమా పొరుగు దేశాతో వ్యాహాత్మక సంబంధలను పెంపొందించుకొంటామని అంటున్నారు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్. దీనికి కారణం అమెరికా కొట్టిన సుంకాల దెబ్బ. మిగతా ఏ దేశాలకు లేని విధంగా అత్యధిక టారీఫ్ లను చైనాపై విధించారు ట్రంప్. ఏకంగా 125 శాతం టారీఫ్ లతో విరుచుకుపడ్డారు. చైనా కూడా అమెరికా ధీటుగా జవాబిస్తోంది కానీ ఎక్కువ కాలం నిలబడలేకపోవచ్చును. ఇప్పుడు ఆ దేశానికి మిగతా దేశాల సపోర్ట్ చాలా అవసరం. అందులో భాగ్గానే జిన్ పింగ్ స్నేహం కావాలి అంటూ చిలక పలుకులు పలుకుతున్నారు. 

Also Read: Ram Charan Peddi AI Video: ఏం క్రియేటివిటీ రా బాబు..! వైరల్ అవుతున్న రామ్ చరణ్ AI వీడియో

ఉమ్మడి లక్ష్యం కోసం కలిసి పని చేస్తాం..

తమ మధ్య అభిప్రాయ భేదాలు తగ్గించుకుని సరఫరా వ్యవస్థలను మరింత పెంపొందించుకునేదుకు ప్రయత్నిస్తామని చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ చెబుతున్నారు. పొరుగు దేశాలు ముఖ్యంగా భారత్ తో కలిసి పని చేస్తామని.. ఒక మంచి ఉమ్మడి సమాజాన్ని నిర్మిస్తామని అంటున్నారు. బీజింగ్‌లో మంగళ, బుధవారాల్లో రెండు రోజులపాటు జరిగిన ఉన్నతస్థాయి కేంద్ర కమిటీ సమావేశంలో జిన్‌పింగ్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. చైనా ప్రధాని లీ కియాంగ్ కూడా దీనికి వత్తాసు పలికారు. అధ్యక్షుడు చెప్పినట్టుగా పొరుగు దేశాలతో వ్యవహారం అమలులో పెట్టాలని అన్నారు.  ఇందులో భాగంగా జిన్‌పింగ్‌ త్వరలో కీలక పొరుగు దేశాలైన వియత్నాం, మలేసియా, కాంబోడియాలలో సందర్శించే అవకాశముంది.

Also Read: Allu Arjun - Pavan Kalyan Son: సింగపూర్‌కు అల్లు అర్జున్.. పవన్ కొడుకు కోసం పయణం!

today-latest-news-in-telugu | china | india | usa | trump tariffs 

Also Read: Mary Kom: విడాకులు తీసుకోబోతున్న మేరీకోమ్?

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

నౌకాశ్రయంలో భారీ పేలుడు.. 400 మందికి పైగా?

ఇరాన్ నౌకాశ్రయంలో భారీ పేలుడు సంభవించింది. బందర్‌ అబ్బాస్‌ సమీపంలోని రజేయీ నౌకాశ్రయంలో పేలుడు సంభవించగా.. 400 మందికి పైగా గాయపడినట్లు తెలుస్తోంది. అయితే ఈ పేలుడు ఎలా సంభవించిందని విషయం ఇంకా తెలియాల్సి ఉంది.

New Update
Iran Harbor

Iran Harbor

ఇరాన్ నౌకాశ్రయంలో భారీ పేలుడు సంభవించిన ఘటన చోటుచేసుకుంది. బందర్‌ అబ్బాస్‌ సమీపంలో రజేయీ నౌకాశ్రయంలో భారీ పేలుడు సంభవించగా.. 400 మందికి పైగా గాయపడినట్లు తెలుస్తోంది. అయితే ఈ భారీ పేలుడు ఎలా సంభవించిందని విషయం ఇంకా తెలియాల్సి ఉంది.

ఇది కూడా చూడండి: Pahalgam Terror Attack : పహల్గాం దాడిపై ఉగ్రవాద సంస్థ సంచలన ప్రకటన.. టీఆర్‌ఎఫ్‌ యూ టర్న్

ఇది కూడా చూడండి: SLBC Tunnel: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో రెస్క్యూ ఆపరేషన్‌కు మూడు నెలలు బ్రేక్‌!

చమురు, పెట్రోకెమికల్స్ కారణంగా..

నౌకాశ్రయంలోని కంటెయినర్ల నుంచి పేలుడు సంభవించిందని భావిస్తున్నారు. ఇక్కడ ఎగుమతి, దిగుమతి కార్యకలాపాలు ఎక్కువగా జరుగుతుంటాయి. అయితే ఈ కంటైయినర్లలో చమురు, పెట్రోకెమికల్స్ ఉన్నాయి. వీటి కారణంగా పేలుడు సంభవించి ఉంటుందని భావిస్తున్నారు.

ఇది కూడా చూడండి: BIG BREAKING: దాడిపై దర్యాప్తు సిద్ధమని కాళ్ల బేరానికి పాకిస్తాన్.. మాకు నీళ్లు కావాలి!

ఇది కూడా చూడండి:Hyderabad: హైదరాబాద్‌లో పాకిస్తానీయులు.. పోలీసులు సంచలన నిర్ణయం

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు