Ap:ఏపీలో వీరికి ఆదివారం.. రంజాన్ సెలవులు లేవు..
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. ఈ నెల 30,31న ఆదివారం, సోమవారం మున్సిపాలిటీల్లో రంజాన్ సెలవులు లేవు. మున్సిపాలిటీల్లో ఆస్తి పన్ను చెల్లింపులు కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది.
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. ఈ నెల 30,31న ఆదివారం, సోమవారం మున్సిపాలిటీల్లో రంజాన్ సెలవులు లేవు. మున్సిపాలిటీల్లో ఆస్తి పన్ను చెల్లింపులు కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది.
ఏపీలో ఎండ, వడగాల్పుల తీవ్రత కొనసాగుతోంది. ప్రకాశం జిల్లాలో 42.4, నెల్లూరు జిల్లాలో 42.2, కడప జిల్లాలో 42.1 డిగీ్రల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.శుక్రవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం తో పాటు 89 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు వీస్తాయని అధికారులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ లో రోజురోజుకి ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. విద్యార్థుల ఆరోగ్యాన్ని రక్షించేందుకు ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ కొత్తగా ‘వాటర్ బెల్’ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది.
పేకాట రాయుళ్లపై విజయనగరం పోలీసులు చేపట్టిన సీక్రెట్ ఆపరేషన్ సక్సెస్ అయింది. పార్కింగ్ చేసిన లారీలో ఓ గ్యాంగ్ రహస్యంగా పేకాట ఆడుతుండగా డ్రోన్ సహాయంతో పట్టుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుండగా పోలీసులపై జనాలు ప్రశంసలు కురిపిస్తున్నారు.
భోగాపురం విమానాశ్రయం నిర్మాణ పనుల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. ఎయిర్పోర్టు లోపల రహదారుల నిర్మాణం చేపడుతుండగా బండరాళ్లు అడ్డు వచ్చాయి. వాటిని తొలగించేందుకు బ్లాస్టింగ్ చేశారు. ఈ ఘటనలో బోర కొత్తయ్య అనే వ్యక్తికి తీవ్ర గాయాలతో మృతి చెందాడు.
ఏపీలోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలను దాటేశాయి. పగటి ఉష్ణోగ్రతలు మెల్లిగా పెరుగుతున్నాయి. ఏపీలోని పలు జిల్లాల్లో ఏకంగా 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.నంద్యాల జిల్లాలో అయితే 43 డిగ్రీల వరకు నమోదయ్యాయి.
విజయనగరం జిల్లాలోని బొబ్బిలి మండలంలో ఉన్న ఓ స్కూల్ హెడ్ మాస్టర్ పిల్లలను దండిచలేదు. వాళ్లకి అర్థమయ్యేలా గుంజీలు తీసి సారీ చెప్పారు దీనికి సంబంధించన వీడియో వైరల్ కావడంతో నారా లోకేష్ ఈ ట్వీట్ను పోస్ట్ చేశారు.
విజయనగరం జిల్లా గుడివాడ గ్రామంలో రాత్రి జరిగిన జాతరలో కొంతమంది యువకులు వీరంగం సృష్టించారు. జాతరలో అసభ్య నృత్యాలను అడ్డుకున్నందుకు మహిళా ఎస్సై ని జుట్టు పట్టుకొని కొట్టి, అసభ్యకరంగా దుర్భాషలాడారు. ఎస్సై కి గాయాలు కావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు.
ఏపీలో వాతావరణం మారిపోయింది.. ఓ వైపు ఎండలు, మరో వైపు వేడిగాలులతో జనాలు ఇబ్బందిపడుతున్నారు. మార్చి నెలలోనే ఏకగా 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. శ్రీకాకుళంలో-18మండలాల్లో వేడి గాలులు తీవ్ర ప్రభావం చూపనున్నాయి.