Floods: భారీ వరదలు.. 16 మంది మృతి
ఇండోనేషియాలోని ఉత్తర సులవేసి ప్రావిన్సులో కుండపోత వర్షాల వల్ల ఆకస్మిక వరదలు సంభవించాయి. ఈ ఘటనలో 16 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. వరదల ప్రభావానికి సోమవారం తెల్లవారుజామున నదులు ఉప్పొంగాయి.
ఇండోనేషియాలోని ఉత్తర సులవేసి ప్రావిన్సులో కుండపోత వర్షాల వల్ల ఆకస్మిక వరదలు సంభవించాయి. ఈ ఘటనలో 16 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. వరదల ప్రభావానికి సోమవారం తెల్లవారుజామున నదులు ఉప్పొంగాయి.
అమెరికా సైనిక చర్యల తర్వాత వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్య సోమవారం న్యూయార్క్లోని ఫెడరల్ కోర్టులో హాజరయ్యారు. మదురో తరఫున ప్రముఖ అమెరికన్ న్యాయవాది బారీ జె.పొల్లాక్ మదురో తరఫున కోర్టుకు వచ్చారు.
వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను, ఆయన భార్యను అమెరికా నిర్బంధించి తీసుకెళ్లడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ మదురోకు ఇలాంటి పరిస్థితి రావడం వెనుక చాలా కారణాలు ఉన్నాయి. వెనెజువెలా నమ్ముకున్న దేశాలే అత్యవసర పరిస్థిల్లో సాయం చేయలేకపోయాయి
వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా సైన్యం బంధించి అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఆ దేశ తాత్కాలిక అధ్యక్షురాలిగా ప్రస్తుత ఉపాధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్స్ నియమితులయ్యారు.
వెనెజువెలాపై అమెరికా మెరుపుదాడులు చేసి ప్రపంచ దేశాలను అవాక్కయ్యేలా చేసింది. ఈ దాడుల వల్ల అక్కడి ప్రజల్లో భయాందోళన నెలకొంది. ఈ వైమానిక దాడుల్లో మౌలిక సదుపాయాలు, విద్యుత్ గ్రిడ్లు దెబ్బతిన్నాయి. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
గత కొన్నేళ్ల నుంచి చైనా హైస్పీడ్ రైళ్ల నెట్వర్క్పై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే తాజాగా అత్యంత వేగంగా దూసుకెళ్లే మ్యాగ్లెవ్ రైలను పరీక్షించింది. ఈ టెస్టులో రైలు కేవలం 2 సెకన్లలోనే 0 నుంచి 700 కిలోమీటర్ల గరిష్ఠ వేగంతో దూసుకెళ్లింది.
సిరియాలో మరో దారుణం జరిగింది. ఓ మసీదులో బాంబు పేలి 8 మంది అక్కడిక్కడే మృతి చెందారు. మరో 21 మంది తీవ్రంగా గాయపడ్డారు. శుక్రవారం మధ్యాహ్నం ఇమామ్ అలీ బిన్ అబీ తలీబ్ మసీద్లో ప్రార్థనలు జరుగుతున్న సమయంలో ఈ బాంబు పేలుడు చోటుచేసుకున్నట్లు అధికారులు తెలిపారు.
బంగ్లాదేశ్లో మరో దారుణం చోటుచేసుకుంది. దీపు చంద్రదాస్ హత్య ఘటన మరువకముందే మరో హిందూ యువకుడిని గ్రామస్థులు కొట్టి చంపడం కలకలం రేపుతోంది. బుధవారం రాత్రి ఈ ఘటన జరిగినట్లు అక్కడి స్థానిక మీడియాలో వార్తలు వచ్చాయి
బంగ్లాదేశ్లో గతేడాది ఆగస్టులో జరిగిన విద్యార్థుల ఉద్యమంతో షేక్ హసీనా ప్రభుత్వం కుప్పకూలిన సంగతి తెలిసందే. ఆ తర్వాత బంగ్లాదేశ్లో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు అక్కడ జరిగిన మలుపుల గురించి ఈ ఆర్టికల్లో తెలుసుకుందాం.