BIG BREAKING: పాకిస్థాన్‌లో మళ్లీ ఉగ్రదాడి.. 12 మంది మృతి

పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో మరోసారి ఉగ్రదాడి జరిగింది. బన్ను ప్రాంతంలోని ఫతే ఖేల్ దగ్గర ఉన్న ఓ పోలీస్ చెక్‌పోస్ట్‌ను టార్గెట్ చేసుకుని ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. ఈ దాడిలో 12 మంది పోలీసులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

New Update
Car bomb attack at checkpoint kills 15 in Pakistan

Car bomb attack at checkpoint kills 15 in Pakistan

పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో మరోసారి ఉగ్రదాడి జరిగింది. బన్ను ప్రాంతంలోని ఫతే ఖేల్ దగ్గర ఉన్న ఓ పోలీస్ చెక్‌పోస్ట్‌ను టార్గెట్ చేసుకుని ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. ఈ దాడిలో 12 మంది పోలీసులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో అయిదుగురు తీవ్రంగా గాయాలపాలయ్యారు. ఈ దాడికి ఇప్పటిదాకా ఏ ఉగ్ర సంస్థ బాధ్యత వహిస్తూ ప్రకటన చేయలేదు. ఓ ఉగ్రవాది పేలుడు పదార్థాలతో నిండిన కారుతో వేగంగా వచ్చి పోలీస్ చెక్‌పోస్టును ఢీకొన్నాడు. ఈ బాంబు పేలిన ధాటికి చెక్‌పోస్ట్ భవనం ధ్వంసమయ్యింది.

Also Read: విజయ్‌ మంత్రివర్గంలో ఒకే ఒక మహిళా మంత్రి...ఆమె బ్యాక్‌గ్రౌండ్‌ తెలిస్తే షాక్‌ ...

ఈ క్రమంలోనే ఉగ్రవాదులు ఆయుధాలతో లోపలికి చొరబడి విచక్షణారహితంగా కాల్పులుకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ఓ పోలీసు అధికారి ఆచూకీ కూడా తెలియకుండా పోయింది. ఈ దాడిలో ఉగ్రవాదులు ఆధునిక సాంకేతికతను కూడా వినియోగించారు. భద్రతా దళాల కదలికలు కనిపెట్టేందుకు, దాడిని సమర్థవంతంగా అలు చేసేందుకు క్వాడ్‌కాప్టర్లు, భారీ ఆయుధాలు వాడినట్లు పాక్ భద్రతా దళాలు గుర్తించాయి. 

Also Read: అమెరికాలో దారుణం.. రన్‌వేపై పాదాచారిని ఢీకొట్టిన విమానం

కాల్పుల తర్వాత ఉగ్రవాదులు కొందరు సిబ్బందిని కూడా తమ వెంట బందీలుగా తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే పాకిస్థాన్ సైన్యం అప్రమత్తమైంది. పోలీసులు ఆ ప్రాంతాన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడికి పాల్పడ్డ ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇదిలాఉండగా గతంలో కూడా  ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో ఉగ్రదాడులు జరిగాయి. తాజాగా మళ్లీ జరగడం కలకలం రేపుతోంది. ఈ ఉగ్రదాడి ఘటనపై లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు అక్కడి పోలీసులు వెల్లడించారు. 

Advertisment
తాజా కథనాలు