CM Nitish Kumar : పదోసారి సీఎంగా నితీష్ కుమార్ ప్రమాణస్వీకారం
బిహార్ సీఎంగా జేడీయూ అధినేత నితీష్ కుమార్ ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ ఆయన చేత సీఎంగా ప్రమాణం చేయించారు. పాట్నాలోని గాంధీ మైదానంలో జరిగిన ఈ వేడుకకు కేంద్ర హోంశాఖ మంత్రులు హాజరయ్యారు.
బిహార్ సీఎంగా జేడీయూ అధినేత నితీష్ కుమార్ ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ ఆయన చేత సీఎంగా ప్రమాణం చేయించారు. పాట్నాలోని గాంధీ మైదానంలో జరిగిన ఈ వేడుకకు కేంద్ర హోంశాఖ మంత్రులు హాజరయ్యారు.
భారత్, అమెరికాల మధ్య కీలకమైన రక్షణ ఒప్పందం కుదిరింది. 93 మిలియన్ల డాలర్ల విలువైన ఆయుధాలను భారత్ కు అమ్మేందుకు యూఎస్ ఆమోదించింది. ఇందులో అధునాతన జావెలిన్ క్షిపణి కూడా ఉంది.
రాష్ట్రపతి, గవర్నర్లకు బిల్లుల ఆమోదం విషయంలో కోర్టులు గడువు నిర్దేశించలేవని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఆ బిల్లులను ఆమోదించడంలో దీర్ఘకాలిక జాప్యం జరిగితే మాత్రం న్యాయ సమీక్షకు అవకాశం ఉంటుంది అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
ఢిల్లీ ఎర్రకోట బ్లాస్ లో మరో ఇద్దరిని యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అదుపులోకి తీసుకున్నారు.ఉమర్ నబీతో నేరుగా సంబంధం ఉన్న రాయ్ పూర్ గ్రామ్ మసీదు మూలానా తయ్యబ్ హుస్సేప్, ఉర్దూ ఉపాధ్యాయుడు రషీద్ లను అరెస్ట్ చేశారు.
ఢిల్లీ మెట్రో స్టేషన్ నుంచి దూకి ఓ పదవ తరగతి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. తాను చదువుతున్న స్కూలు ప్రిన్సిపల్, ముగ్గురు టీచర్లు మానసికంగా వేధించడం వల్లనే బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడని తండ్రి ఆరోపిస్తున్నారు.
బీహార్ ముఖ్యమంత్రిగా జేడీయూ అధినేత నీతీశ్ కుమార్ ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రికార్డు స్థాయిలో ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయడం ఇది పదోసారి. బుధవారం జరిగిన ఎన్డీయే ఎమ్మెల్యేల సమావేశంలో శాసనసభాపక్ష నేతగా ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
జస్టిస్ రాజేశ్ బిందల్, జస్టిస్ మన్మోహన్లతో కూడిన ధర్మాసనం ఈ కేసులో తమ తీర్పును రిజర్వ్ చేసింది. అంటే, విచారణ పూర్తయింది, కానీ తీర్పును ప్రకటించడాన్ని వాయిదా వేశారు. ఏ క్షణమైనా తీర్పు వెలువడే అవకాశం ఉంది.
శబరిమల భక్తులకు అలెర్ట్.. శబరిమలకు భారీ సంఖ్యలో భక్తులు తరలి వస్తున్న నేపథ్యంలో ట్రావెన్ కోర్ దేవస్వం బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. స్పాట్ బుకింగ్స్ ను 20 వేల నుంచి 5 వేలకు తగ్గించింది.
కోర్టు ధిక్కార కేసులో స్పీకర్ను అరెస్ట్ చేసే అధికారం సుప్రీంకోర్టుకు ఉందాని చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ ఫిరాయింపు MLAల అనర్హత పిటిషన్ల విచారణలో జాప్యంపై స్పీకర్కు సుప్రీంకోర్టు కోర్టు ధిక్కార నోటీసులు జారీ చేసిన క్రమంలో ఈ ప్రశ్న తలెత్తింది.