ఇండియన్ రైల్వేస్ మరో అద్భుతం.. 1200 హార్స్ పవర్‌తో హైడ్రోజన్ రైలు..!

హైడ్రోజన్ రైలు స్టేటస్‌పై మంగళవారం ఎంపీ అజిత్‌ కుమార్‌ భూయాన్‌ అడిగిన ప్రశ్నకు ఆయన రైల్వే మంత్రి సమాధానం ఇచ్చారు. ఆ రైలు ప్రత్యేకతలు, ఫీచర్స్‌ను కేంద్ర రైల్వేశాఖ మంత్రి వివరించారు. హైడ్రోజన్‌ రైలును చెన్నైలోని ఇంటిగ్రల్‌ కోచ్‌ ఫ్యాక్టరీలో తయారవుతుంది.

author-image
By K Mohan
New Update
hydrogen train

hydrogen train Photograph: (hydrogen train)

ఇండియన్ రైల్వేస్ కొత్త టెక్నాలజీని అందిపుచ్చకుంటోంది. ఇటీవల వందే భారత్ రైళ్లు ప్రవేశపెట్టిన భారత్.. తాజాగా మరో కొత్త టెక్నాలజీతో భారతీయ రైల్వే సంస్థ ముందుకు వస్తోంది. సరికొత్తగా హైడ్రోజన్‌ రైళ్లపై దృష్టి సారించింది. ఇండియా త్వరలోనే తొలిసారిగా హైడ్రోజన్‌ రైలును అందుబాటులోకి తీసుకురానుంది. హైడ్రోజన్ రైలు స్టేటస్‌పై మంగళవారం ఎంపీ అజిత్‌ కుమార్‌ భూయాన్‌ అడిగిన ప్రశ్నకు ఆయన రైల్వే మంత్రి సమాధానం ఇచ్చారు. ఆ రైలు ప్రత్యేకతలు, ఫీచర్స్‌ను కేంద్ర రైల్వేశాఖ మంత్రి వివరించారు.

ప్రస్తుతం హైడ్రోజన్‌ రైలును చెన్నైలోని ఇంటిగ్రల్‌ కోచ్‌ ఫ్యాక్టరీలో తయారవుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హైడ్రోజన్‌ రైళ్ల ఇంజిన్లు 600 హార్స్‌పవర్‌ వరకే ఉత్పత్తి చేస్తుండగా.. భారత తయారు చేసే హైడ్రోజన్‌ రైలు మాత్రం 1200 హార్స్‌పవర్‌ వరకు శక్తిని ఉత్పత్తి చేయగల సామర్థ్యం ఉందని ఆయన చెప్పారు. ప్రపంచంలోనే ఈ రైలు అత్యంత పొడవుగా ఉంటుందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ రాజ్యసభలో ప్రకటించారు. అంతేకాదు ట్రైన్ తయారీలో డెవలప్‌డ్ టెక్నాలజీ వాడుతున్నట్లు తెలిపారు. భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ రైలును జింద్, సోనెపట్ సెక్షన్‌లోని 89 కిలోమీటర్ల మార్గంలో ట్రయల్‌ రన్‌ నిర్వహిస్తారు.

Also Read: నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త.. టెన్త్ అర్హతతో 21413 పోస్టల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్!

ఇప్పటివరకు కేవలం నాలుగు దేశాలు మాత్రమే హైడ్రోజన్‌ రైళ్లను ప్రారంభించాయి. ఈ ట్రైన్ భారత్‌లో పరుగులు పెడితే.. హైడ్రోజన్‌ రైలును అభివృద్ధి చేసిన 5వ దేశంగా ఇండియా నిలువనుంది. డీజిల్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ హైడ్రోజన్ ఇంధన కణాల రెట్రోఫిట్మెంట్ ద్వారా ఈ రైలును తయారు చేస్తోంది. రైల్వే రీసెర్చ్ డిజైన్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ ఈ రైలు ప్రత్యేకతలను సిద్ధం చేసింది. రైలుతో పాటు హైడ్రోజన్‌ను తిరిగి నింపేందుకు ఇంటిగ్రేటెడ్‌ హైడ్రోజన్‌ ఉత్పత్తి, నిల్వ, పంపిణీ సౌకర్యాన్ని రూపొందించినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు అవసరమైన ఆమోదం కోసం పెట్రోలియం, పేలుడు పదార్థాల భద్రతా సంస్థను అభ్యర్థించినట్లు తెలిపారు. ప్రత్యామ్నాయ ఇంధన వనరులైన క్లీన్‌ ఎనర్జీ, గ్రీన్‌ ఎనర్జీ వినియోగాన్ని ప్రోత్సహించేందుకు భారతీయ రైల్వే తీసుకున్న చొరవని అశ్విన్ వైష్ణవ్ అన్నారు.

Also Read: పారిస్ ఏఐ సమ్మిట్‌.. అలాంటి వారికే ఉద్యోగవకాశాలు ఉంటాయన్న ప్రధాని మోదీ

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన మహిళా యూట్యూబర్‌.. మృతదేహాన్ని కాల్వలో పడేసి..

హర్యానాలో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ మహిళా యూట్యూబర్‌ తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది. అనంతరం నిందితులు మృతదేహాన్ని కాల్వలో పడేశారు. చివరికీ పోలీసుల మహిళా యూట్యూబర్‌ను అదుపులోకి తీసుకున్నారు.ఆమె ప్రియుడి కోసం గాలిస్తున్నారు.

New Update
Haryana YouTuber Strangles Husband with Lover

Haryana YouTuber Strangles Husband with Lover

ఈ మధ్య భార్యాభర్తల మధ్య హత్యలు ఎక్కువగా జరగడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా ప్రియుడితో కలిసి భర్తను హతమార్చడం లేదా ప్రియురాలి కోసం భార్యను చంపేయడం లాంటి ఘటనలు తరచుగా చోటుచేసుకుంటున్నాయి. తాజాగా అలాంటిదే మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ మహిళా యూట్యూబర్‌ తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. ఇక వివరాల్లోకి వెళ్తే.. హర్యానాలోని భివానీలో యూట్యూబర్ రవీనా, ప్రవీణ్ దంపతులు ఉంటున్నారు. 

Also Read: మరో భయంకరమైన భార్య మర్డర్.. ఛార్జర్ వైర్‌తో గొంతు కోసి, పిల్లలను గదిలో బంధించి!

2017లో వీళ్లకు పెళ్లయ్యింది. ఈ దంపతులకు ఆరేళ్ల కొడుకు కూడా ఉన్నాడు. అయితే రెండేళ్ల క్రితం రవీనాకు ఇన్‌స్టా్గ్రామ్‌లో ప్రేమ్‌నగర్‌కు చెందిన మరో యూట్యూబర్‌ సురేశ్‌తో పరిచయం ఏర్పడింది. చివరికి అది వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ క్రమంలోనే మార్చి 25 వాళ్లిద్దరిని అభ్యంతరకర పరిస్థితిలో ఉన్నప్పుడు ప్రవీణ్‌ చూశాడు. దీంతో అతడు నిలదీయగా.. వాళ్ల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ క్రమంలోనే రవీనా, సురేశ్‌.. ప్రవీణ్‌ గొంతుకోసి హత్య చేశారు. ఆ తర్వాత అర్ధరాత్రి 2.30 గంటలకు వారు ఆ మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లి కాలువలో పడేశారు. ప్రవీణ్‌ ఎక్కడున్నాడని అతడి కుటంబ సభ్యులు అడిగినా కూడా రవీనా తనకేమి తెలియదని చెప్పింది.  

Also Read: వాహనదారులకు కేంద్రం గుడ్‌న్యూస్.. టోల్ చెల్లింపుల్లో భారీ మార్పులు

చివరికి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 3 రోజుల తర్వాత వాళ్లకి కాల్వలో ప్రవీణ్ మృతదేహం దొరికింది. దీంతో ఆ ఏరియాలో ఉన్న సీసీటీవీ పుటేజ్‌ను పరిశీలించగా.. రవీనా బండారం బయటపడింది. అధికారులు తమదైన శైలిలో విచారించగా.. నేరం చేసినట్లు రవీనా ఒప్పుకుంది. దీంతో పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. అలాగే యూట్యూబర్ సురేశ్ కోసం గాలిస్తున్నారు. కుటుంబ సభ్యుల నుంచి అభ్యంతరం ఉన్నాకూడా రవీనా సోషల్ మీడియాలో వీడియోలు చేసేదని విచారణలో తేలింది. అంతేకాదు భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవని తేలింది. 

 

Advertisment
Advertisment
Advertisment