Kerala: లిప్‌స్టిక్‌లు, ఫేస్ క్రీమ్‌ల‌తో జాగ్ర‌త్త‌.. అంటూ వార్నింగ్‌ ఇచ్చిన ఆరోగ్య శాఖ!

లిప్‌స్టిక్‌, ఫేస్ క్రీముల్లో మోతాదుకు మించి మెర్క్యూరీ లెవ‌ల్స్ ఉన్న‌ట్లు గుర్తించినట్లు కేరళ మంత్రి వీణా జార్ట్‌ తెలిపారు. కాస్మ‌టిక్ ఉత్ప‌త్తులను లైసెన్స్ కంపెనీలు అమ్ముతున్నాయా లేదా అన్న విష‌యాన్ని చెక్ చేసుకోవాల‌ని మంత్రి అన్నారు.

New Update
lipstick

lipstick

కేర‌ళ ఆరోగ్య‌శాఖ మంత్రి వీణా జార్జ్ ఇటీవ‌ల ఓ హెచ్చ‌రిక జారీ చేశారు. కాస్మిటిక్ ఉత్ప‌త్తుల్లో అధిక స్థాయిలో మెర్క్యూరీ ఉన్న‌ట్లు ఆమె వివరించారు. మెర్క్యూరీ స్థాయి ఎక్కువ‌గా ఉన్న ఉత్ప‌త్తుల్ని కేర‌ళ‌లో అమ్ముతున్న‌ట్లు ఆమె పేర్కొన్నారు. కాస్మ‌టిక్ ఉత్ప‌త్తులను లైసెన్స్ కంపెనీలు అమ్ముతున్నాయా లేదా అన్న విష‌యాన్ని చెక్ చేసుకోవాల‌ని ఆమె త‌న ఫేస్‌బుక్ పోస్టులో తెలిపారు. ప్రోడ‌క్ట్‌ను కొనేముందు ఉత్ప‌త్తిదారుడి అడ్ర‌స్‌ను తెలుసుకోవాల‌న్నారు.

Also Read: Ap : ఏపీలో ఇక నుంచి అర్థరాత్రి 12 వరకు హోటల్స్‌...మంత్రి కీలక ప్రకటన!

కేర‌ళ రాష్ట్ర‌వ్యాప్తంగా ఆప‌రేష‌న్ సౌంద‌ర్య‌ను స్టార్ట్‌ చేశారు. కాస్మ‌టిక్ ఉత్ప‌త్తుల్లో ప్ర‌మాక‌ర కెమిక‌ల్స్ కోసం అన్వేషిస్తున్నారు. ఫేక్ ఉత్ప‌త్తుల్ని సీజ్ చేస్తున్నారు. 2023లో తొలిసారి ఈ ఆప‌రేష‌న్ మొదలు పెట్టారు. రెండు ద‌శ‌ల్లో దీన్ని చేప‌ట్టారు. ఆ టైంలో ఏడు ల‌క్ష‌ల ఖ‌రీదైన న‌కిలీ కాస్మ‌టిక్ ఉత్ప‌త్తుల్ని అధికారులు సీజ్ చేశారు. 33 మంది ఉత్ప‌త్తిదారుల‌పై వివిధ కేసుల్ని న‌మోదు చేశారు.

Also Read: Maha Kumbh Mela: వీవీఐపీల పాస్‌ లు రద్దు..వాహనాలకు కూడా నో ఎంట్రీ..కుంభమేళాలో మార్పులు!

లిప్‌స్టిక్‌, ఫేస్ క్రీముల్లో మోతాదుకు మించి మెర్క్యూరీ లెవ‌ల్స్ ఉన్న‌ట్లు ల్యాబ్ ప‌రీక్ష‌ల్లో తెలింది. కొన్ని శ్యాంపిళ్ల‌లో మెర్క్కూరీ లెవ్స్ సుమారు 12000 రెట్లు అధికంగా ఉన్న‌ట్లు అధికారులు గుర్తించారు. ఇలాంటి ప్ర‌మాక‌ర ర‌సాయ‌నాల వ‌ల్ల ఆరోగ్య స‌మ‌స్య‌లు వస్తాయి. కొన్ని సంద‌ర్భాల్లో అవ‌య‌వాలు కూడా డ్యామేజ్ అయ్యే ప్ర‌మాదం ఉందని అధికారులు పేర్కొన్నారు.

మెర్క్యూరీ అధిక మోతాదులో ఉన్న ఉత్ప‌త్తుల్ని వాడ‌డం వ‌ల్ల‌.. చ‌ర్మం రంగు మారే అవకాశాలు కనపడుతున్నాయి. చ‌ర్మంపై ఎరుపు దద్దర్లు ఏర్పడతాయి. ఉద‌ర‌, నాడీ, ఇమ్యూన్ వ్య‌వ‌స్థ దెబ్బ‌తినే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కొన్ని సంద‌ర్భాల్లో డిప్రెష‌న్ కూడా వ‌స్తుంద‌ని యూఎన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ రిపోర్టు ద్వారా తెలుస్తోంది. ఉత్ప‌త్తుల‌పై మెర్క్యూరియ‌స్ క్లోరైడ్‌, మెర్క్యూరీ, మెర్క్యూరిక్‌, మెర్క్యూరియో, క‌లోమెల్ అని రాసి ఉంటుంది. 

ఇలా రాసి ఉండకపోతే ఆ ఉత్ప‌త్తుల‌తో స‌మ‌స్య ఏర్ప‌డే అవ‌కాశం ఉన్న‌ది. ఇంగ్లీష్ భాష‌లో లేదా స్థానిక భాష‌లో ఉత్ప‌త్తిపై రాసి లేకుంటే దాన్ని కొనకూడదు. మెర్క్యూరీ పాయిజ‌నింగ్ వ‌ల్ల వ‌ణుకు, డిప్రెష‌న్‌, వినికిడి లోపం, దృష్టి స‌మ‌స్య‌లు వ‌చ్చే అవ‌కాశాలు ఫుల్లుగా ఉన్నాయి.

Also Read: China: ఆ కంపెనీ ఉద్యోగులకు అదిరిపోయే ఆఫర్‌...ఎంత డబ్బు లెక్కపెడితే అంతా మీకే..కానీ కేవలం..!

Also Read: Himachal Pradesh: పెళ్లి కోసం ఆరాటంగా వెళ్లిన వరుడు..తీరా అక్కడ ట్విస్ట్‌ మామూలుగా లేదుగా!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

India: పాకిస్తానీయులకు ముగిసిన డెడ్ లైన్..537 మంది వెనక్కు..

టెంపరరీ వీసాలతో భారత్ కు వచ్చిన పాక్ పౌరులకు భారత ప్రభుత్వం ఇచ్చిన గడువు ఈ రోజు తో ముగిసింది. దీంతో ఇప్పటి వరకు 537 మంది అట్టారీ-వాఘా సరిహద్దు మార్గంలో పాకిస్థాన్‌కు వెళ్ళారని తెలుస్తోంది. వీరిలో తొమ్మది మంది దౌత్య వేత్తలు, అధికారులు ఉన్నారు.

New Update
pak

Pakistan People

పాకిస్తానీయులు ఇండియాలో ఉండటంపై భారత ప్రభుత్వం సీరియస్ గా ఉంది. పహల్గామ్ లో దాడి జరిగిన తర్వాత పాక్ పౌరులు తమ దేశం నుంచి వెళ్ళిపోవాలని ఆదేశాలను జారీ చేసింది. ఏప్రిల్ 24న ఈ ఉత్తర్వులను ఇచ్చింది. దీంతో పాకిస్తానీయులు దేశం విడిచి వెళ్ళడం ప్రారంభించారు. ఇప్పటివరకు నాలుగు రోజుల్లో 537 మంది అట్టారీ-వాఘా సరిహద్దు మార్గంలో పాకిస్థాన్‌కు  వెళ్లిపోయినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఒక్క ఆదివారం రోజునే 287 మంది వెళ్ళారని సమాచారం . ఇందులో తొమ్మిది మంది దౌత్యవేత్తలు, అధికారులు ఉన్నట్లు చెప్పారు. కొంతమంది ఫ్లైట్స్ ద్వారా వెళ్ళారని..అయితే నేరుగా పాక్ కు విమాన సర్వీసులు లేవు కాబట్టి..ఇతర దేశాలకు వెళ్ళి అక్కడ నుంచి వెళ్ళిపోయి ఉండవచ్చని చెప్పారు. ఇదే సరిహద్దు ద్వారా 850 మంది భారతీయులు పాకిస్థాన్‌ నుంచి స్వదేశానికి తిరిగి వచ్చినట్లు చెప్పారు.

మూడు లక్ష జరిమానా..

పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్‌లో ఉంటున్న పాకిస్థానీయులను నిర్ణీత గడువులోగా వెళ్లిపోవాలని కేంద్రం ఆదేశించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ ఆదేశాలు ఉల్లంఘించి ఎవరైనా గడువు దాటినా కూడా ఇంకా భారత్‌లోనే ఉంటే చట్టం ప్రకారం వాళ్లని అరెస్టు చేయవచ్చు. దీనిపై దర్యాప్తు చేపట్టి.. మూడేళ్ల వరకు జైలు శిక్ష లేదా రూ.3 లక్షల జరిమానా, లేదా రెండు విధించే ఛాన్స్ కూడా ఉంటుంది.  సార్క్‌ వీసాల కింద ఇండియాలో ఉంటున్న పాకిస్థానీయులు ఏప్రిల్ 26లోగా దేశం విడిచి వెళ్లిపోవాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే మెడికల్ వీసాల కింద వచ్చినవాళ్లకు మాత్రం ఏప్రిల్ 29 వరకు గడువు ఇచ్చింది. స్టూడెంట్, బిజినెస్, విజిటర్ తదితర 12 విభాగాల్లో వీసాలు ఉన్నవాళ్లు మాత్రం ఏప్రిల్ 27 నాటికి వెళ్లిపోవాలని ఆదేశించింది. ఏప్రిల్ 4 నుంచి ఇమిగ్రేషన్ అండ్ ఫారినర్స్‌ యాక్ట్‌-2025 అమల్లోకి వచ్చింది. 

 today-latest-news-in-telugu | india | pakistan 


Also Read: Sitakka: నీ బిడ్డ కార్లలో తిరిగితే.. మా ఆడబిడ్డలు బస్సులో కూడా తిరగొద్దా?: కేసీఆర్ కు సీతక్క స్ట్రాంగ్ కౌంటర్!

Advertisment
Advertisment
Advertisment