Municipal Elections : మున్సిపల్ ఎన్నికలు.. జనసేన మద్దతుపై బీజేపీ డైలమా!
బీజేపీ అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తారని ప్రకటించినప్పటికీ, ఈ విషయంలో బీజేపీ నాయకత్వం పునరాలోచనలో పడ్డట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
బీజేపీ అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తారని ప్రకటించినప్పటికీ, ఈ విషయంలో బీజేపీ నాయకత్వం పునరాలోచనలో పడ్డట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
తెలంగాణ ప్రభుత్వం వేతనాల జారీలో మరింత పారదర్శకత, వేగం పెంచేలా సరికొత్త నిర్ణయాన్ని వెలువరించింది. రాష్ట్రంలోని ప్రభుత్వ, కార్పొరేషన్ ఉద్యోగులందరికీ ఏప్రిల్ నెల నుండి IFMIS ద్వారానే జీతాలు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
రాజకీయాల్లో విమర్శలు సహజమని, కానీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి వాడే వికృత పదజాలం రాష్ట్ర ప్రతిష్టను దిగజార్చుతోందని హరీశ్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి చరిత్రలో బూతుల సీఎంగా మిగిలిపోతారని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు.
తెలంగాణ రాజకీయాల్లో అత్యంత సంచలనంగా మారిన ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల వ్యవహారం రేపు సుప్రీంకోర్టు ముందుకు రానుంది. ఈ కేసును జస్టిస్ అగస్టీన్ జార్జ్ , జస్టిస్ సంజయ్ కరోల్ సభ్యులుగా ఉన్న ధర్మాసనం విచారించనుంది. దీంతో తీర్పుపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణలో పురపాలక ఎన్నికల సందడి నెలకొంది. ఎన్నికల్లో టికెట్లు ఆశించి భంగపడిన పలువురు రెబల్ అభ్యర్థులుగా రంగంలో నిలిచారు. దీంతో ప్రధాన పార్టీలకు అసమ్మతి సెగలు తప్పడం లేదు. ఆయా పార్టీల బుజ్జగింపులు ఫలించకపోవడంతో పలువురు రెబల్స్ గా బరిలో నిలిచారు.
జగిత్యాల జిల్లాలో నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు టికెట్లు దక్కలేదన్నమాజీమంత్రి జీవన్ రెడ్డి అసంతృప్తులతో ఇండిపెండెంట్లుగా నామినేషన్ వేయించారని ప్రచారం సాగుతుంది. అంతేకాక వారి తరుపున జీవన్ రెడ్డి ఎన్నికల ప్రచారం చేయడం సంచలనంగా మారింది.
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల సందడి మొదలైంది. ఈ నెల 11న జరగనున్న ఏడు నగర పాలక సంస్థలు, 116 పురపాలక సంఘాల ఎన్నికల్లో మొత్తం 12,944 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. పోటీదారుల్లో 6,508 మంది (50.27శాతం) మహిళలు ఉండగా, 6,436 (49.73 శాతం) మంది పురుషులున్నారు.
నూతన విద్యుత్ కనెక్షన్ల విషయంలో తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి ఈఆర్సీ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. కనెక్షన్ తీసుకునే వినియోగదారుల అంచనాలు తయారు చేసే నిబంధనలను ఈఆర్సీ పూర్తిగా రద్దు చేసింది.
జగిత్యాల జిల్లాలో రాయికల్ పట్టణంలో అత్యంత వైభవంగా జరిగిన భీమన్న జాతరలో జంతు బలులు జరిగాయి. ఓ వ్యక్తి జంతువును పట్టుకుని.. అతని పంటితో కొరుకుతూ గావు పట్టారు. మూగజీవాన్ని ఇలా నోటితో కోరుకుతూ హింసించడంతో జంతు ప్రేమికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.