BREAKING: తెలంగాణ నూతన డీజీపీగా సీవీ ఆనంద్కు బాధ్యతలు !
తెలంగాణ నూతన డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్ నియామకం అయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్ర డీజీపీగా ఉన్న శివధర్ రెడ్డి ఏప్రిల్ 30న పదవీ విరమణ చేయనున్నారు.
తెలంగాణ నూతన డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్ నియామకం అయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్ర డీజీపీగా ఉన్న శివధర్ రెడ్డి ఏప్రిల్ 30న పదవీ విరమణ చేయనున్నారు.
తెలంగాణకు త్వరలో కొత్త పోలీస్ బాస్ రానున్నారు. ప్రస్తుత డీజీపీ బి. శివధర్ రెడ్డి ఈ నెల 31న పదవీ విరమణ చేయనున్నారు. దీంతో ఆ స్థానంలో శాశ్వత ప్రాతిపదికన పూర్తిస్థాయి డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి సి.వి. ఆనంద్ బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఉన్నాయి.
తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు దేశంలోనే అతిపెద్ద సినిమా పైరసీ ముఠా ఆటకట్టించారు. ముఠాలో కీలకంగా ఉన్న ఆరుగురితో పాటు మరికొంతమందిని అరెస్ట్ చేశారు. వీరు తెలుగుతో పాటు పలు భాషల సినిమాలను పైరసీ చేసినట్లు పోలీసులు తెలిపారు.
డిజిటల్ ట్రేడింగ్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముఠాను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. బ్యాంకు మేనేజర్ సహా 52 మందిని అదుపులోకి తీసుకున్నట్లు సీవీ ఆనంద్ తెలిపారు. వారి నుంచి చెక్బుక్లు, సెల్ఫోన్లు, రబ్బర్ స్టాంపులు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.
సినీ సెలబ్రిటీల బౌన్సర్లు, ప్రైవేట్ బాడీగార్డ్స్కు సీపీ ఆనంద్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. చట్టానికి వ్యతిరేకంగా దాడులు, బెదిరింపులకు పాల్పడితే క్రిమినల్ కేసులుపెట్టి జైలులో ఊచలు లెక్కబెట్టిస్తామని హెచ్చరించారు. ఏజెన్సీలపై కూడా కఠినచర్యలు తీసుకుంటామన్నారు.
అల్లు అర్జున్ కేసు వివాదం వేళ సీపీ సీవీ. ఆనంద్ సెలవుపై అమెరికా పయణమవ్వడం చర్చనీయాంశమైంది. ఈ కేసులో కీలకంగా వ్యవహరిస్తున్న ఆనంద్ క్లిష్ట సమయంలో విదేశానికి ఎందుకు వెళ్తున్నారనేది ప్రశ్నార్థకమైంది. దీంతో సీఎం రేవంత్ ఏం చేయబోతున్నారనే ఉత్కంఠ నెలకొంది.
హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సిటీలో 144 సెక్షన్ విధించారు. ఒక నెల రోజుల పాటు అనగా నవంబర్ 28 వరకు నగరంలో ఎలాంటి సమావేశాలు, ర్యాలీలకు అనుమతి లేదని తెలిపారు. నలుగురు కంటే ఎక్కువమంది ర్యాలీ, సమావేశాలు నిర్వహించి అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
క్రిమినల్స్ పై ఉక్కుపాదం మోపుతామని హైదరాబాద్ కొత్త సీపీ సీవీ ఆనంద్ అన్నారు. డ్రగ్స్, గంజాయి నిర్మూలన ప్రధాన లక్ష్యమన్నారు. కొద్ది సేపటి క్రితం ఆయన సీపీగా బాధ్యతలు స్వీకరించారు. తనకు అవకాశం ఇచ్చిన సీఎం రేవంత్ కు కృతజ్ఞతలు తెలిపారు.
ఏసీబీ డైరెక్టర్ జనరల్గా ఐపీఎస్ విజయ్ కుమార్ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. సీవీ ఆనంద్ సమక్షంలో విజయ్ కుమార్ ఏసీబీ బాధ్యతలు తీసుకున్నారు. సీవీ ఆనంద్ పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా సీవీ ఆనంద్ నియమితులైన విషయం తెలిసిందే.