🔴Live Breakings: తెలంగాణలో టీవీ సీరియల్స్ బంద్...?..మంత్రి పొన్నం సంచలనం..!
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా వచ్చే ఏడాది తాను పాదయాత్ర చేయనున్నట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. సూర్యాపేటలో ఈ రోజు మీడియాతో కేటీఆర్ చిట్ చాట్ చేశారు. పాదయాత్ర కోసం ప్రస్తుతం కసరత్తులు ప్రారంభం అయ్యాయన్నారు.
మావోయిస్టులకు మరో ఊహించని షాక్ తలిగింది. ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో ఒకేరోజు రెండు ఎన్కౌంటర్లు జరిగాయి. ఉదయం బీజాపుర్లో 26 మంది మావోలు చనిపోగా తాజాగా కాంకెర్ జిల్లాలో మరో నలుగురు పోలీసుల కాల్పుల్లో మృతిచెందారు. దీంతో మృతుల సంఖ్య 30కి చేరింది.
ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్పై హోం మంత్రి అమిత్ షా ఆనందం వ్యక్తం చేశారు. ఈరోజు భారత సైనికులు 'నక్సల్ ముక్త్ భారత్ అభియాన్' దిశలో మరో పెద్ద విజయాన్ని సాధించారని పొగిడేశారు. వచ్చే ఏడాది మార్చి 31 నాటికి దేశం నక్సల్స్ రహితంగా మారబోతోందంటూ పోస్ట్ పెట్టారు.
మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఈ రోజు ప్రధాని మోదీని కుటుంబ సభ్యులతో కలిశారు. మనవడు, మనవరాళ్లు, కూతురు, అల్లుడితో కలిసి వెళ్లి మోదీని మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణలో బీజేపీకి కొత్త చీఫ్ రాబోతున్నారన్న వార్తల నేపథ్యంలో ఈ భేటీ చర్చనియాంశమైంది.
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్గేట్స్తో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా 40 నిమిషాలపాటు బిల్గేట్స్తో చర్చలు జరిపారు. ఏపీ అభివృద్ధి, సంక్షేమం కోసం గేట్స్ ఫౌండేషన్లు ఎలా సహకరించుకోవాలనే దానిపై చర్చంచినట్లు సీఎం తెలిపారు.
ఓటర్ ఐడీని ఆధార్తో అనుసంధానం చేసే ప్రక్రియను ప్రారంభించినట్లు కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం వెల్లడించింది. ఈ విషయమై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ మాట్లాడుతూ కాంగ్రెస్ లేవనెత్తిన అభ్యంతరాలకు ఎన్నికలసంఘం(ఈసీ) ప్రతిపాదన బలం చేకూరుస్తోందని అభిప్రాయపడ్డారు.
ఎస్సీ వర్గీకరణ పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన అమరుల కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు, రాజీవ్ యువ వికాసం పథకాల్లో ప్రాధాన్యం కల్పిస్తామని సీఎం రేవంత్ ప్రకటించారు. 2026 జనగణన పూర్తి కాగానే ఆ లెక్కల ప్రకారం ఎస్సీ రిజర్వేషన్లు పెంచుతామన్నారు.