Varma Vs Nagababu: పవన్ ఫొటోతో నాగబాబుకు వర్మ కౌంటర్.. సంచలన పోస్ట్!

పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తన X ఖాతాలో చేసిన పోస్టు ఆసక్తికరంగా మారింది. చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్, నారా లోకేష్, మోదీ ఫొటోలతో ఆయన పోస్ట్ చేశారు. ప్రజలే నా బలం అంటూ ఆ పోస్టుకు క్యాప్షన్ పెట్టారు. 

New Update
Varma Vs Nagababu

Varma Vs Nagababu

పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తన X ఖాతాలో చేసిన పోస్టు ఆసక్తికరంగా మారింది. చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్, నారా లోకేష్, మోదీ ఫొటోలతో ఆయన పోస్ట్ చేశారు. ప్రజలే నా బలం అంటూ ఆ పోస్టుకు క్యాప్షన్ పెట్టారు. ఇటీవల పిఠాపురంలో నిర్వహించిన జనసేన మీటింగ్ లో నాగబాబు వర్మను టార్గెట్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయిన విషయం తెలిసిందే. ఇక్కడ పవన్ ను ఎమ్మెల్యేగా గెలిపించింది.. పవన్ ఇమేజ్, అభిమానులు, ప్రజలు మాత్రమేనని నాగబాబు వ్యాఖ్యానించారు.

ఇది కూడా చదవండి: AP News: ఏపీకి మరో మూడు సార్లు అతనే సీఎం.. పవన్ సంచలన వ్యాఖ్యలు!

అంతే కానీ ఎవరైనా తమ కారణంగానే పవన్ గెలిచాడని భావిస్తే అది వారి కర్మ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వర్మను టార్గెట్ చేసే నాగబాబు ఈ వ్యాఖ్యలు చేశారన్న చర్చ ఆ సమయంలో తీవ్రంగా సాగింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రజలే నా బలం అంటూ వర్మ తన అధికారిక X ఖాతాలో చేసిన పోస్ట్ తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ ట్వీట్ ద్వారా వర్మ నాగబాబుకు కౌంటర్ ఇచ్చారన్న చర్చ సాగుతోంది.

ఇది కూడా చదవండి: AP News: SC వర్గీకరణ బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఏకగ్రీవ ఆమోదం!

Also Read :  కర్ణాటకలో హనీట్రాప్‌ దుమారం.. స్పందించిన సీఎం సిద్ధరామయ్య

టీడీపీ కేడర్ కు రక్షగా..

గతంలో ఇండిపెండెంట్ గా గెలిచిన చరిత్ర వర్మకు ఉంది. గత ఎన్నికల్లో ఇక్కడ పొత్తుల్లో భాగంగా కూటమి నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ విజయం సాధించినా.. టీడీపీ క్యాడర్ మాత్రం చెక్కు చెదర కుండా వర్మ పని చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రజలే నా బలం అంటూ ఆయన పోస్ట్ పెట్టినట్లు తెలుస్తోంది. 

Also Read :  హైకోర్టు జడ్జి వ్యాఖ్యలు బాధాకరం.. మైనర్ బాలిక ఇష్యూపై కేంద్రమంత్రి అసహనం!

 

telugu breaking news | latest-telugu-news | nagababu | today-news-in-telugu | andhra-pradesh-politics | cm-ramesh

#cm-ramesh #nagababu #varma #latest-telugu-news #andhra-pradesh-politics #telugu breaking news #today-news-in-telugu
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు
తదుపరి కథనాన్ని చదవండి

AP News: అమరావతి అభివృద్ధికి మోదీ సర్కార్ అండగా ఉం...

AP News: అమరావతి అభివృద్ధికి మోదీ సర్కార్ అండగా ఉంది.. పురంధేశ్వరి కీలక వ్యాఖ్యలు!

అమరావతి రాజధానికి మోదీ సర్కార్ సంపూర్ణ సహకారం అందిస్తుందని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి చెప్పారు. ఇందులో భాగంగానే రూ. 2500కోట్లు మౌలిక వసతుల కల్పనకు కేటాయించిందని తెలిపారు. ఏపీకి కేంద్ర సహాయంపై ఓ వీడియో రిలీజ్ చేశారు.

New Update
AP News: జగన్ ఆ గాయాలపై ఆత్మపరిశీలన చేసుకో.. పురందేశ్వరి సంచలన కామెంట్స్!

Purandeshwari

AP News: అమరావతి రాజధానికి మోడీ సర్కార్ సహకారం అందిస్తుందని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి చెప్పారు. ఇందులో భాగంగానే రూ. 2500కోట్లు కేంద్రం అమరావతిలో మౌలిక వసతుల కల్పనకు కేటాయించిందని తెలిపారు. అవుటర్ రింగ్ రోడ్ నిర్మాణానికి 20వేల కోట్లు కేంద్రం మంజూరు చేసినట్లు వెల్లడించా. 2024 లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో డబుల్ ఇంజన్ సర్కార్ కు ప్రజలు పట్టం కట్టారు. కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్డీఏ కూటమిని ప్రజలు ఆశీర్వదించారు. అమరావతి నిర్మాణానికి, అభివృద్దికి సంపూర్ణ సహకారం అందిస్తామని మోడీ చెప్పినట్లు గుర్తు చేస్తూ వీడియో రిలీజ్ చేశారు.  

Also Read: తెలంగాణ మందుబాబులకు అదిరిపోయే వార్త.. 604 కొత్త బ్రాండ్లు!

రాష్ట్ర ప్రభుత్వంతో కీలక ఒప్పందం..

వరల్డ్ బ్యాంకు ద్వారా 15వేల కోట్లు, హడ్కో కింద 11వేల కోట్లు ఏపీకి అందించడానికి నిర్ణయం చేశారు. హడ్కో కింద 11వేల కోట్ల రూపాయలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో నేడు ఒప్పందం చేసుకున్నారు. 15వేల కోట్లు ప్రపంచ బ్యాంకు, ఏషియన్ డెవలప్ మెంట్ బ్యాంకు కలిపి 13వేల 600కోట్లు ఇస్తుండగా కేంద్ర ప్రభుత్వం తన వాటాగా 1400కోట్లు  అందిస్తుంది. ఈ 15వేల కోట్లు మొబలైజేషన్ లో 25శాతం గ్రాంట్ కింద ఇస్తామని కేంద్రం చెప్పిన విధంగా ఇటీవల 4వేల 285 కోట్లు  కేంద్రం అందించింది. కేంద్రం నుంచి వచ్చే సహకారాన్ని అందిపుచ్చుకుంటూ అమరావతిని అద్భుతంగా అభివృద్ది చేయాలని కోరుతున్నాను అని పురంధేశ్వరి వివరించారు. 

Also Read: రికార్డ్ సృష్టించిన ఇండియా.. రూ.2 లక్షల కోట్ల విలువైన స్మార్ట్‌ఫోన్స్ ఎగుమతి

bjp-purandeswari | amaravathi | telugu-news | today telugu news

Advertisment
Advertisment
Advertisment