TDP MLA: చేతికి సెలైన్ తోనే ప్రజాదర్బార్.. టీడీపీ ఎమ్మెల్యే వీడియో వైరల్!

మార్కాపురం టీడీపీ ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి చేతికి సైలైన్ తోనే ప్రజాదర్బార్ నిర్వహించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆఖరి నిమిషంలో కార్యక్రమాన్ని వాయిదా వేస్తే ప్రజలు ఇబ్బంది పడుతారని అనారోగ్యంతోనే ఎమ్మెల్యే ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు.

New Update
Kandula Narayana Reddy

Kandula Narayana Reddy

ప్రకాశం జిల్లా మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి ఈ రోజు తన కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. తీవ్ర అనారోగ్యానికి గురవడంతో ఆయన ఓ చేతికి సైలైన్ పెట్టుకుని.. మరో చేస్తో ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. అక్కడి నుంచే అధికారులకు వినతుల్లో పేర్కొన్న సమస్యలను పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు.

ఎమ్మెల్యేపై ప్రశంసలు..

శనివారం రోజు ప్రజాదర్బార్ ఉంటుందని మూడు రోజుల క్రితమే ఎమ్మెల్యే కార్యాలయం నుంచి ప్రకటన విడుదలైంది. అనారోగ్యం కారణంగా ఈ కార్యక్రమాన్ని వాయిదా వేస్తే ప్రజలు ఇబ్బంది పడుతారని భావించిన ఎమ్మెల్యే అలానే కొనసాగించాలని తన కార్యాలయ సిబ్బందిని ఆదేశించారు. దీంతో ఆ కార్యక్రమం కొనసాగింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఎమ్మెల్యేపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

 

(viral-video | telugu-news | latest-telugu-news)

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Anakapalli: ఏపీలో షాకింగ్ తీర్పు.. 7ఏళ్ల చిన్నారి గొంతు కోసి హత్య- మరణ శిక్ష విధించిన కోర్టు

7ఏళ్ల బాలికను హత్య చేసిన కేసులో చోడవరం కోర్టు నిందితుడికి మరణశిక్ష విధించింది. 2015లో శేఖర్ అనే యువకుడు 7ఏళ్ల బాలికను బీరు సీసాతో గొంతుకోసి చంపేశాడు. ఈ కేసులో 10 ఏళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత నిందితుడిని దోషిగా తేల్చి మరణశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.

New Update
Anakapalli Vepadu Divya Murder Case

Anakapalli Vepadu Divya Murder Case

అది 2015వ సంవత్సరం. అనకాపల్లి జిల్లా దేవరాపల్లికి చెందిన 31 ఏళ్ల యువకుడు శేఖర్‌.. 7ఏళ్ల బాలిక వేపాడు దివ్యకు మాయ మాటలు చెప్పి ఎవరూ లేని ప్రాంతంలోకి తీసుకెళ్లాడు. ఆపై బీరు సీసాతో ఆ బాలిక గొంతు కోసి అతి కిరాతకంగా చంపేశాడు. అప్పట్లో ఈ ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఇప్పుడు ఆ కేసుపై కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో దోషిగా తేలిన యువకుడు శేఖర్‌కు చోడవరం కోర్టు మరణశిక్ష విధిస్తూ తీర్పును ఇచ్చింది. 

ఇది కూడా చూడండి: ఈ రాశివారు నేడు వివాదాలకు దూరంగా ఉంటే బెటర్‌!

ఈ మేరకు చోడవరం 9వ అదనపు జిల్లా జడ్జి కె.రత్నకుమార్ ఈ తీర్పును వెల్లడించారు. దాదాపు 10 ఏళ్ల పాటు సాగిన సుదీర్ఘ విచారణ అనంతరం శేఖర్‌పై మోపిన నేరం రుజువు కావడంతో జడ్జి అతడికి మరణ శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చారు. అయితే చోడవరం కోర్టు చరిత్రలోనే తొలిసారి మరణశిక్ష విధిస్తూ తీర్పునివ్వడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

ఇది కూడా చూడండి: ఏపీకి వాతావరణశాఖ చల్లని కబురు.. ఈ జిల్లాల్లో వానలు..!

ఏం జరిగింది?

అనకాపల్లి జిల్లా దేవరాపల్లికి చెందిన శేఖర్‌కు 7ఏళ్ల బాలిక వేపాడు దివ్య కుటుంబంతో గొడవలు ఉండేవి. వాటిని మనసులో పెట్టుకున్న నిందితుడు శేఖర్.. దారుణానికి ఒడిగట్టాడు. బాలిక వేపాడు దివ్య స్కూల్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా.. మార్గ మధ్యలో చిన్నారిని ఆపి ఆమెకు మాయమాటలు చెప్పి బిళ్లలమెట్ల రిజర్వాయర్‌ వద్దకు తీసుకెళ్లాడు. అనంతరం ఆ బాలికను మాటల్లో పెట్టి బీర్‌ బాటిల్‌తో ఆమె గొంతు కోసి హత్య చేశాడు. 

ఇది కూడా చూడండి: డెత్ ఓవర్ల స్పెషలిస్ట్‌..  రూ. 30లక్షలకు ముచ్చెమటలు పట్టించాడు!

ఈ ఘటన అప్పట్లో ఏపీలో సంచలనంగా మారింది. అనంతరం బాలిక దివ్య పేరెంట్స్ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ దారుణానికి పాల్పడింది శేఖర్ అని నిర్ధారించుకుని అతడిని అరెస్టు చేశారు. ఇలా ఈ కేసుపై 10ఏళ్ల పాటు విచారణ జరిగిన అనంతరం కోర్టు అతడికి మరణశిక్ష విధించింది. 

ఇది కూడా చూడండి: బోణీ కొట్టిన ముంబై..ఐపీఎల్ లో మరో రికార్డ్

(crime news | chodavaram | latest-telugu-news | telugu-news)

Advertisment
Advertisment
Advertisment