Komatireddy-Balakrishna: బాలయ్య వేస్ట్.. ఆ విషయంలో నేనే బెస్ట్.. కోమటిరెడ్డి షాకింగ్ కామెంట్స్!

బాలకృష్ణ కంటే కూడా తనతోనే ఎక్కువమంది ఫొటోలు దిగుతారని తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కామెంట్ చేశారు. ఆయన రోజుకు ఒకరికి కొడతారట అని అన్నారు. ఈ రోజు మీడియా చిట్ చాట్ లో పలు అంశాలపై కోమటిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

New Update

బాలకృష్ణ రోజుకొకరినీ కొడతారంట అంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. ఈ రోజు మీడియా చిట్ చాట్ లో కోమటిరెడ్డి పలు అంశాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన సినిమాలు ఎవరు చూస్తారంటూ ప్రశ్నించారు. బాలకృష్ణ కంటే కూడా తనతోనే ఎక్కువమంది ఫొటోలు దిగుతారన్నారు. అయినా ఆయన సినిమాలకు కలెక్షన్స్ వస్తాయట.. అంటూ కామెంట్ చేశారు.  బీఆర్ఎస్ వాళ్లు హౌలా గాళ్లంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వాళ్లకు ధరణితో దోచుకుతినడం తప్పా ఏమి తెలియదన్నారు.
ఇది కూడా చదవండి: KCR: ఆ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఓ సన్నాసి.. కేసీఆర్ సంచలన కామెంట్స్

కేటీఆర్ తండ్రి చాటు కొడుకు..

కేటీఆర్ తండ్రి చాటు కొడుకు అని.. హరీష్ రావు మామ చాటు అల్లుడు అంటూ కామెంట్ చేశారు. వాళ్లు కనీసం డిప్యూటీ లీడర్లు కూడా కాదని ఎద్దేవా చేశారు. వాళ్లతో మేము ఏం మాట్లాడతాం అంటూ సెటైర్లు వేశారు. వేముల ప్రశాంత్ రెడ్డి బీఆర్ఎస్ హయాంలో డమ్మీ మంత్రిగా ఉన్నాడన్నారు. ఆయనను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కూడా గుర్తు పట్టడం లేదని ఎద్దేవా చేశారు.
ఇది కూడా చదవండి: Betting Apps: ఆన్‌లైన్‌ బెట్టింగ్‌‌‌తో లక్షల్లో అప్పులు.. కరీంనగర్ జిల్లా యువకుడు సూసైడ్!

ప్రశాంత్ రెడ్డి మెంటల్ పట్టినట్లు మాట్లాడుతున్నాడని ఫైర్ అయ్యారు. ఉప్పల్--నారపల్లి ఫ్లై ఓవర్ పనులను తాను గడ్గరీతో మాట్లాడి చేయిస్తున్నానన్నారు. బీఆర్ఎస్ వాళ్లకు మాటలతో బతకడం అలవాటైందని ధ్వజమెత్తారు. త్వరలో ఉస్మానియా హాస్పిటల్ కు టెండర్లు పిలుస్తామన్నారు. 

(komatireddy-venkat-reddy | balakrishna | telugu-news | telugu breaking news | latest-telugu-news)

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

SRH vs HCA : ఉప్పల్ స్టేడియంలో విజిలెన్స్ విచారణ..ఆయన డుమ్మా?

టికెట్ల విషయంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌కు హైదరాబాద్ సన్ రైజర్స్‌కు మధ్య వివాదం తలెత్తిన విషయం తెలిసిందే. ఆ వివాదం పై విజిలెన్స్ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ విచారణకు HCA ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు హాజరు కానట్టు తెలిసింది

New Update
 HCA vs SRH

HCA vs SRH

SRH vs HCA :  టికెట్ల విషయంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌కు హైదరాబాద్ సన్ రైజర్స్‌కు మధ్య వివాదం తలెత్తిన విషయం తెలిసిందే. ఆ వివాదం ముదిరి ముదిరి పాకాన పడింది. దీంతో ఈ  వ్యవహారంపై విజిలెన్స్ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఎస్ఆర్‌హెచ్‌పై తీవ్ర ఒత్తిడికి గురి చేయడమే కాకుండా.. ఎక్కువ టికెట్లు కేటాయించాలంటూ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌ వేధింపులకు గురి చేస్తుందని ఎస్ఆర్‌హెచ్ ఆరోపిస్తూ.. ప్రభుత్వానికి ఈ మెయిల్ చేసింది. అయితే విచారణ సందర్భంగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్, సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం మధ్య నెలకొన్న వివాదం తాత్కళికంగా సద్దుమణిగినట్లు తెలిసింది.

ఇది కూడా చూడండి: ఏపీకి వాతావరణశాఖ చల్లని కబురు.. ఈ జిల్లాల్లో వానలు..!

 ఉప్పల్ స్టేడియంలో ఎస్ఆర్‌హెచ్‌ టికెట్ల విషయంలో వేధింపులపై విజిలెన్స్ అధికారులు విచారణ జరిపారు. అయితే  ఈ విచారణకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు హాజరు కానట్టు తెలిసింది. వ్యక్తిగత పనుల నిమిత్తం హైదరాబాద్‌కు దూరంగా ఉన్నానని ఆయన విజిలెన్స్ అధికారులుకు సమాచారం అందించారట. ఈ నేపథ్యంలో బుధవారం విచారణకు హాజరవుతానని హెచ్‌సీఏ ప్రెసిడెంట్ స్పష్టం చేశారు. ఇక హెచ్‌సీఏ సెక్రటరీ బస్వరాజు నుంచి విజిలెన్స్ అధికారులు వివరాలు సేకరించారు. అనంతరం బస్వరాజు స్టేడియం నుంచి వెళ్లిపోయారు. అలాగే విజిలెన్స్ అధికారులు స్టేడియంలోనే విచారణ కొనసాగించారు. మరోవైపు..ఇరు వర్గాలతో ప్రభుత్వం సమావేశం ఏర్పాటు చేసింది. ఆ క్రమంలో ఎస్ఆర్‌హెచ్ నుంచి వెళ్లిన టికెట్లు ఎన్ని.. కాంప్లిమెంటరీ టికెట్లు ఎన్ని.. వాటిని ఏదైనా బ్లాక్ మార్కెట్‌లో విక్రయిస్తున్నారా..వీటన్నింటిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి నివేదిక అందజేయాలని విజిలెన్స్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం విజిలెన్స్ అధికారులు ఉప్పల్ స్టేడియం చేరుకున్నారు.

Also Read: Adolescence: ప్రధాని మెచ్చిన 'Adolescence' వెబ్ సీరిస్.. అన్ని స్కూళ్లలో ప్రదర్శించాలని ఆదేశం.. దాని ప్రత్యేకత ఇదే!

 మంగళవారం SRH ప్రతినిధులతో HCA సెక్రటరీ దేవరాజ్‌ జరిపిన చర్చలు తాత్కాలికంగా సఫలం అయ్యాయి. SRH, HCA, బీసీసీఐ మధ్య జరిగిన త్రైపాక్షిక ఒప్పందాన్ని పాటించాలని SRH ప్రతిపాదించింది. పాత ఒప్పందం ప్రకార‌మే స్టేడియం సామ‌ర్థ్యంలోని 10 శాతం కాంప్లిమెంట‌రీ పాసులను హెచ్‌సీఏకు కేటాయించనున్నారు. ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్‌లను విజ‌య‌వంతంగా నిర్వహించేందుకు ఎస్ఆర్‌హెచ్‌కు పూర్తిగా స‌హ‌క‌రిస్తామ‌ని హెచ్‌సీఏ హామీ ఇచ్చింది. చర్చల అనంతరం వివాదాల‌న్నీ ముగిశాయని హెచ్‌సీఏ-ఎస్ఆర్‌హెచ్‌ ప్రక‌టించాయి.

ఇది కూడా చూడండి: డెత్ ఓవర్ల స్పెషలిస్ట్‌..  రూ. 30లక్షలకు ముచ్చెమటలు పట్టించాడు!
 

Advertisment
Advertisment
Advertisment