🔴Live Breakings: ఐశ్వర్యరాయ్‌ కారుకు ప్రమాదం..వెనుకనుంచి ఢీ కొట్టిన బస్సు...

author-image
By Manoj Varma
New Update
BREAKING NEWS

breaking news

  • Mar 26, 2025 21:50 IST

    Aishwarya Rai Bachchan: ఐశ్వర్యరాయ్‌ కారుకు ప్రమాదం..వెనుకనుంచి ఢీ కొట్టిన బస్సు...

    బాలీవుడ్ అగ్ర నటి, బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ కోడలు ఐశ్వర్యరాయ్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైందన్న వార్తలతో భారతీయ చిత్ర పరిశ్రమ ఉలిక్కిపడింది. ముంబైలోని ఐష్ ప్రయాణిస్తున్న కారును ఓ బస్సు ఢీకొట్టినట్లుగా కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

    Aishwarya Rai Bachchan
    Aishwarya Rai Bachchan

     



  • Mar 26, 2025 21:49 IST

    NATO: మా జోలికొస్తే వినాశనమే.. తప్పించుకోలేవ్: పుతిన్‌కు నాటో వార్నింగ్!

    రష్యాకు NATO స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. కూటమిలోని పోలాండ్‌ లేదా ఏ దేశం జోలికొచ్చినా వినాశకర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని నాటో సెక్రటరీ జనరల్‌ మార్క్‌ రుట్టే హెచ్చరించారు. పుతిన్‌ లేదా మరెవరైనా తమపై ఆధిపత్యం సాధించాలనుకుంటే అది పొరపాటే అన్నారు.

    nato
    nato Photograph: (nato)

     



  • Mar 26, 2025 21:48 IST

    BIG BREAKING: బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి జగన్ శుభవార్త.. కీలక పదవి!

    బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి వైసీపీ అధినేత జగన్ శుభవార్త చెప్పారు. వైయస్ఆర్ సీపీ రాష్ట్ర యువజన విభాగ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని నియమించినట్లు అధికారికంగా ప్రకటించారు. 

    baireddy
    baireddy Photograph: (baireddy)

     



  • Mar 26, 2025 10:05 IST

    మాజీ మంత్రి కొడాలి నానికి గుండెపోటు.. సీరియస్?

    మాజీ మంత్రి, వైసీపీ నేత కొడాలి నాని తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన్ను కుటుంబ సభ్యులు వెంటనే హైదరాబాద్ లోని AIG హాస్పిటల్ లో చేర్పించారు. ఆయనకు గుండెపోటు వచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది.

    kodali-nani aig
    kodali-nani aig

     



  • Mar 26, 2025 07:55 IST

    రషీద్ ఖాన్ అరుదైన రికార్డు.. మలింగ, బుమ్రాలతో కలిసి



  • Mar 26, 2025 07:55 IST

    యాదగిరిగుట్టలో ఘోర ప్రమాదం.. 13 మంది స్పాట్

    తెలంగాణలోని యాదగిరి గుట్టలో ఘోర ప్రమాద ఘటన చోటుచేసుకుంది. హైవేపై వెళ్తున్న కంటైనర్‌ను వెనుక నుంచి రెండు బస్సులు ఢీకొన్నాయి. చౌటుప్పల్ మండలంలో ఈ ప్రమాదం జరగ్గా.. 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. దీనిపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

    BREAKING NEWS
    breaking news

     



  • Mar 26, 2025 07:54 IST

    కేటీఆర్ పై కేసు నమోదు!

    కేటీఆర్ పై కేసు నమోదైంది. నల్గొండ జిల్లా నకిరేకల్ పోలీస్ స్టేషన్ లో కేసు బుక్ అయింది.  పదో తరగతి పేపర్ లీకేజీ ఘటనలో తమపై తప్పుడు ఆరోపణలు చేశారంటూ మున్సిపల్ ఛైర్ పర్సన్ రజిత కేటీఆర్ పై ఫిర్యాదు చేశారు.



  • Mar 26, 2025 07:54 IST

    గుజరాత్ను ఓడించి..పంజాబ్ను గెలిపించిన రూ. 5 కోట్ల ఆటగాడు!



  • Mar 26, 2025 07:54 IST

    బయటపడిన భార్య అక్రమ సంబంధం.. సజీవంగా పాతిపెట్టిన భర్త

    హర్యానాలో ఓ భార్య ఇంట్లో అద్దెకు ఉంటున్న వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఈ విషయం బయపడటంతో భర్త ఆ వ్యక్తిని సజీవంగా పాతిపెట్టాడు. పోలీసులకు మిస్సింగ్ కేసు రావడంతో దర్యాప్తు చేపట్టారు. దీంతో విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసుల అదుపులో నిందితుడు ఉన్నాడు.

    Haryana Crime
    Haryana Crime Photograph: (Haryana Crime)

     



  • Mar 26, 2025 07:53 IST

    1+1..వైన్ షాప్స్ బంపరాఫర్.. ఎగబడ్డ మందుబాబులు!

    ఉత్తర్ ప్రదేశ్ లో మద్యం దుకాణాల వద్ద నిన్న భారీ క్యూలైన్లు కనిపించాయి. 2025 మార్చి 31తో ఆయా షాపుల లైసెన్స్ గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో తమ వద్ద ఉన్న స్టాకు గడువులోగా విక్రయించేందుకు వ్యాపారులు బంపరాఫర్లు ప్రకటించారు



  • Mar 26, 2025 07:53 IST

    ఇక ఏటీఎం నుంచి పీఎఫ్‌ నగదు తీసుకోవచ్చు...



Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Ramadan Festival: దుబాయ్ లో 30న, ఇండియాలో 31 ఈద్..

సౌదీ అరేబియాలో చంద్రుడు ఈరోజే దర్శనమిచ్చాడు. దీంతో అక్కడ రేపే ఈద్ ఉత్ ఫితర్ జరుపుకోనున్నారు. ఆ లెక్క ప్రకారం ఇండియాలో మార్చి 31న అంటే సోమవారం రంజాన్ పండుగ సెలబ్రేట్ చేసుకోనున్నారు. 

New Update
dubai

Ramadan

రంజాన్ ఎప్పుడు జరుపుకోవాలనే సంశయం తీరి పోయింది. సౌదీ అరేబియాలో చంద్రుడు కనిపించిన దాని బట్టి అక్కడ ఈద్ ను ఎప్పుడు జరుపుకోవాలో నిర్ణయిస్తారు. ఆ లెక్క ప్రకారం సౌదీలో ఈరోజు చంద్రుడు కనిపించారు. అంటే అక్కడ మార్చి 30న అంటే రేపే ఈద్ ఉల్ ఫితర్ జరుపుకోనున్నారు. ఉదయం 6.30 గంటలకు సౌదీ మసీద్ అల్ హరామ్ లో ఈద్ ప్రార్ధనలు జరుగుతాయి. ఆ తర్వాతి రోజు అంటే మార్చి 31న ఇండియాలో రంజాన్ పండుగ సెలబ్రేట్ చేసుకోనున్నారు. 

సాగత్ ఈ మోదీ..

రంజాన్ పండుగ సందర్భంగా బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది. 'సాగత్ ఈ మోదీ' పేరుతో దేశవ్యాప్తంగా 32 లక్షల మంది పేద ముస్లింలకు పండగ కిట్లు అందించనుంది. అర్హులైన వారికి వీటిని రంజాన్ రోజున ఈ కిట్లు చేరేందుకు 32 వేల మంది బీజేపీ మోర్చా కార్యకర్తలు మసీదులతో సమన్వయం కానున్నారు. వీళ్లందరూ పేద ముస్లింలకు కిట్లు చేరవేసే బాధ్యత తీసుకోనున్నారు. బుధవారం ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కిట్ల పంపిణీని ప్రారంభించనున్నారు. 
ఈ కిట్‌లో స్త్రీ, పురుషులకు వస్త్రాలు ఉంటాయి. అలాగే సేమియా, ఖర్జూర, ఎండు ఫలాలు, చక్కెర ఇతర వస్తువులు కూడా ఉంటాయి. మార్చి 31న రంజాన్‌ పండగ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మోదీ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. బీజేపీ మైనార్టీ వింగ్‌ నాయకత్వంతో దేశవ్యాప్తంగా ఈ కీట్లు పంపిణీ చేసే కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా బీజేపీ మైనార్డీ వింగ్ జాతీయ అధ్యక్షుడు జమల్ సిద్దిఖీ మాట్లాడారు.  

today-latest-news-in-telugu | ramadan | festival 

Also Read: MI VS GT: మళ్ళీ హిట్ మ్యాన్ సింగిల్ డిజిట్ కే అవుట్

Advertisment
Advertisment
Advertisment