Bank Employees Strike: వినియోగదారులకు అలర్ట్....నాలుగు రోజులు బ్యాంక్ లు బంద్

బ్యాంకు ఉద్యోగుల సమ్మె సరైన్‌ మోగింది. ఈనెల 24, 25 తేదీల్లో బ్యాంకు ఉద్యోగులు సమ్మెకు దిగనున్నారు. రెండు రోజుల పాటు దేశవ్యాప్తంగా సమ్మె నిర్వహించనున్నట్లు బ్యాంక్‌ యూనియన్ల ఐక్య వేదిక యునైటెడ్‌ ఫోరమ్‌ ఆఫ్‌ బ్యాంక్‌ యూనియన్స్‌ యూఎఫ్​బీయూ తెలిపింది.

New Update
Bank Employees Strike

Bank Employees Strike

Bank Employees Strike : బ్యాంకు ఉద్యోగుల సమ్మె సరైన్‌ మోగింది. ఈనెల 24, 25 తేదీల్లో బ్యాంకు ఉద్యోగులు సమ్మెకు దిగనున్నారు. అయితే ఈ రెండు రోజుల పాటు దేశవ్యాప్తంగా సమ్మె నిర్వహించనున్నట్లు బ్యాంక్‌ యూనియన్ల ఐక్య వేదిక యునైటెడ్‌ ఫోరమ్‌ ఆఫ్‌ బ్యాంక్‌ యూనియన్స్‌-యూఎఫ్​బీయూ తెలిపింది. ఉద్యోగుల సంస్థ కీలక డిమాండ్లపై ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబిఎ)తో జరిగిన చర్చల్లో ఎటువంటి సానుకూల ఫలితం రాలేదని యుఎఫ్‌బియు తెలిపింది. దీంతో సమ్మె తప్పదంటుంది. బ్యాంకుకు సంబంధించిన ఏదైనా పని పూర్తి చేయాల్సి వస్తే, శుక్రవారం అంటే మార్చి 21 నాటికి దాన్ని పూర్తి చేసుకోండి. దీని తర్వాత మార్చి 22 నుండి మార్చి 25 వరకు బ్యాంకులు మూసి ఉండనున్నాయి. మార్చి 26న బ్యాంకులు తెరుచుకుంటాయి. శనివారం 22, ఆదివారం 23 తేదీలలో బ్యాంకులు మూసి ఉంటాయి. దీని తర్వాత సోమవారం, మంగళవారం బ్యాంకు ఉద్యోగులు సమ్మె నిర్వహించనున్నారు. 

ఇది కూడా చూడండి: HYD: ఎల్బీ నగర్ లో దారుణం..బైక్ ను ఢీకొట్టి కిలోమీటర్ ఈడ్చుకెళ్ళిన కారు

మంగళవారం న్యూఢిల్లీలో బ్యాంకులతో ప్రభుత్వం జరిపిన చర్చలు అసంపూర్తిగా ముగిసిన తర్వాత మార్చి 23, 24 తేదీలలో దేశవ్యాప్త సమ్మెను ప్రకటించారు. బ్యాంకుల్లో తగినంత నియామకాలు, అన్ని శాఖలలో సెక్యూరిటీ గార్డులను నియమించడం, ఐదు రోజుల బ్యాంకింగ్ పనిదినాలు, పాత పెన్షన్ పునరుద్ధరణ, అలాగే ప్రవేట్ వ్యక్తులకు వివిధ పనులను అప్పగించడం వంటి వాటికి వ్యతిరేకంగా బ్యాంకు ఉద్యోగులు నిరసన తెలుపుతున్నారు. దీనితో పాటు, కాంట్రాక్ట్ కార్మికులను క్రమబద్ధీకరించాలనే డిమాండ్లపై బ్యాంకు ఉద్యోగులు పనిచేయరు.

Also Read: Sub Inspector: లీవ్ లెటర్ బయటపెట్టిన స్కామ్.. లేడీ SI ఊచలు లెక్కించింది

సామాన్య ప్రజలతో పాటు, చిన్న, పెద్ద వ్యాపారవేత్తలు కూడా సమస్యలను ఎదుర్కొంటున్నారు. బ్యాంకులు వరుసగా నాలుగు రోజులు మూసివేయడం వల్ల దేశం పెద్ద ఆర్థిక నష్టాన్ని చవిచూడటం ఖాయం. దీని కారణంగా ప్రభుత్వంతో పాటు సామాన్యుల పని కూడా ప్రభావితమవుతుంది. బ్యాంకుల నాలుగు రోజుల సమ్మె దేశంలో వ్యాపార కార్యకలాపాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ప్రతిరోజూ వ్యాపారులు, సేవా ప్రదాతలు, కార్పొరేట్ సంస్థలు, పరిశ్రమలు, చిన్న వ్యాపారాలు, ఇతర రంగాలు బ్యాంకింగ్ వ్యవస్థను ఉపయోగిస్తున్నాయి. ఇది వారి బ్యాంకింగ్ కార్యకలాపాలపై చెడు ప్రభావం చూపుతుంది. బ్యాంకులు మూసివేయడం వల్ల NEFT ద్వారా లావాదేవీలు నిలిచిపోతాయి. దీని కారణంగా భారీ నష్టాలు సంభవించే అవకాశం ఉంది. ఈ సమ్మె కారణంగా చెక్కుల క్లియరెన్స్, ఏటీఎం పనితీరుతో సహా అనేక ముఖ్యమైన సేవలు ప్రభావితమవుతాయి.

Also Read: USA: శాంతి ఒప్పందంపై జెల్స్ స్కీ కు ట్రంప్ కాల్..సుదీర్ఘ చర్చ

మీడియా నివేదికల ప్రకారం.. బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ అసోసియేషన్ యుపి ప్రావిన్షియల్ జనరల్ సెక్రటరీ అనంత్ మిశ్రా మాట్లాడుతూ.. అన్ని బ్యాంకుల ఉమ్మడి సంస్థ అయిన యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ అఖిల భారత సమ్మెకు పిలుపునిచ్చిందని అన్నారు. అయితే ఈ సమయంలో యుపిఐ, మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఏటీఎం సేవలు యథావిధిగా కొనసాగుతాయి.

Also Read: అరుణాచలంలో దారుణం.. విదేశీ మహిళపై గైడ్ అత్యాచారం

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Ind-Pak: భారత్-పాక్ యుద్ధమే జరిగితే గెలుపెవరిది? ఎవరి బలం ఎంతుంది?

కాశ్మీర్ ఉగ్రదాడి భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలకు దారి తీసింది.అపార నష్టంతో కుమిలిపోతున్న మనం రగిలిపోతుంటే..పాకిస్తాన్ మాత్రం పొగరుతో కాలు దువ్వుతోంది. యుద్ధం తప్పదనే సూచనలు కనిపిస్తున్నాయి. ఒకవేళ అదే కనుక జరిగితే గెలుపెవరిది?ఎవరి బలం ఎంతుంది?

New Update
Indian Army

Indian Army

ప్రస్తుతం భారత్, పాకిస్తాన్ లలో పరిస్థితి మారిపోయింది. ఒక్క ఉగ్రదాడితో రెండు దేశాలు అల్లకల్లోలం అయిపోయాయి. యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. 26మందిని పోగొట్టుకుని భారత ప్రజలు రగిలిపోతున్నారు. ప్రభుత్వం కూడా దీనిని సీరియస్ గా తీసుకుంది. పాకిస్తాన్ మీద కస్సుబుస్సుమంటోంది. ఆ దేశాన్ని అన్ని విధాలా దిగ్భంధనం చేస్తూ ఐదు కఠిన నిర్ణయాలను తీసుకుంది. పోనీ అటు నుంచి పాకిస్తాన్ ఏమైనా తగ్గిందా అంటే..అదీ లేదు. ఆ దేశం కూడా యద్ధానికి సిద్ధం అంటూ కయ్యానికి కాలు దువ్వుతోంది. అసలు ఇదంతా జరగడానికి తామే కారణం అయినా కూడా ఆ విషయాన్ని ఒప్పుకోకుండా పొగరుగా మాట్లాడుతోంది. ఇండియా ఒక్కటేనా నిర్ణయాలు తీసుకోగలదు అంటూ వాళ్ళు కూడా సేమ్ టూ సేమ్ కాపీ కొట్టేశారు. దీంతో యుద్ధం తప్పదనే సూచనలు చాలా గట్టిగానే కనిపిస్తున్నాయి. దీని కోసం రెండు దేశాలూ సిద్ధమైపోతున్నాయి కూడా. భారత ఆర్మీ ఛీప్ రేపు కాశ్మీర్ కూడా వెళుతున్నారు. అక్కడ బలగాలు పర్యవేక్షించడంతో పాటూ ఇతర ఏర్పాట్లను కూడా చూడనున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలో యుద్ధమే కనుక జరిగితే ఏ దేశం గెలుస్తుంది...ఎవరి బలం ఎంత అనే చర్చలు జరుగుతున్నాయి. 

భారత్, పాక్ సైనిక బలాలు ఇవే..

ఇండియా, పాకిస్తాన్ ల మధ్య ఇదే మొదటిసారి కాదు. ఇలా దాడులు జరగడం...రెండు దేశాలు యుద్ధానికి రెడీ అవడం చాలాసార్లే జరిగింది. పాక్ చేసిన పనులకు భారత్ అన్ని సార్లూ గట్టిగానే జవాబు చెప్పింది. ఎప్పుడూ విజయం కూడా మనవైపే ఉంటుంది కూడా. అయితే ఈ సారి యుద్ధం జరిగితే పరిస్థితులు ఎలా ఉంటాయి. ఎవరికి గెలిచే ఛాన్స్ ఉందంటే..కచ్చితంగా భారత్ కే అని చెప్పాలి. ఎందుకంటే అన్ని రకాలుగా పాకిస్తాన్ కంటే భారత్ బలంగా ఉంది. 

భారత ఆర్మీ సైనికులు...పాక్ ఆర్మీ సైనికుల కంటే దాదాపు రెండింతలు ఉన్నారు.  భారత సైనికులు 14, 55, 550 మంది ఉంటే పాక్ సైనికులు 6, 54,00 మంది ఉన్నారు.  ఇండియా దగ్గర ఆరు వైమానిక ట్యాంకర్లు ఉంటే పాక్ దగ్గర నాలుగు ఉన్నాయి. ఇక అణు జలాంతర్గాముల విషయానికి వస్తే భారత్ దగ్గర 2893 ఉన్నాయి. పాక్ దగ్గర 121 మాత్రమే ఉన్నాయి. గగనతలం సంగతి చూస్తే..ఇండియా దగ్గర 2,229 ఎయిర్ క్రాఫ్ట్స్, 513 ఫైటర్ జెట్స్ ఉన్నాయి. అదే పాకిస్తాన్ దగ్గర 1, 399 ఎయిర్ క్రాఫ్ట్స్, 328 ఫైటర్ జెట్స్ ఉన్నాయి. వీటన్నిటితో పాటూ భారత్ దగ్గర 1.15 మిలియన్ రిజర్వ్, 25 లక్షల పారా మిలటరీ బలగాలు అదనంగా ఉన్నాయి. 

ఆర్థిక బలం..

ఇవన్నీ ఒక ఎత్తైతే ఆర్థికంగా పాకిస్తాన్ కంటే భారత్ చాలా ఉన్నతంగా ఉంది. ఇప్పటికప్పుడు యుద్ధం వచ్చినా దాన్ని ఇండియా తట్టుకోగలదు. దానికి కావాల్సిన ఏర్పాట్లను వెంటనే చేయగలదు. ప్రపంచ దేశాలు కూడా భారత్ కు సహాయం చేయడానికి ముందుకు వస్తాయి. ముఖ్యంగా పెద్దన్న అమెరికా అందరి కంటే ఈ విషయంలో ముందుంటుంది. కానీ మరి పాకిస్తాన్ సంగతేంటి. ఆ దేశం చాలా రోజులుగా ఆర్థికంగా ఇబ్బంది పడుతోంది. తినడానికి తిండి కూడా లేకుండా బాధలు పడుతోంది. ఇలాంటి సమయంలో ఆ దేశం ఫుల్ ఎఫెర్ట్ పెట్టి యుద్ధం చేయగలదా...ఒకవేళ చేసినా...యుద్ధం ముగిశాక వచ్చే పరిసనామాలను తట్టుకోగలదా అనే చాలా పెద్ద ప్రశ్నే. పైగా ప్రపంచ దేశాలు పాకిస్తాన్ కు ఏ విధంగానూ సహాయం చేయవు. ఆఖరుకి కాశ్మీర్ ఉగ్రదాడి తర్వాత తాలిబాన్లు కూడా భారత్ కు సపోర్టు చేశారు. పాక్ చేసింది తప్పు అంటూ మాట్లాడారు. ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ యుద్ధం అంటూ ఎగదోయడం సరైన విషయం కాదు. దీన్ని ఆ దేశం ఎంత త్వరగా తెలుసుకుంటే...దానికి అంత మంచిది. 

 today-latest-news-in-telugu | india | pakistan | war | army

Advertisment
Advertisment
Advertisment