JAGAN: ఇక నుంచి ప్రజల్లోనే ఉండాలి.. నేతలకు సీఎం జగన్ దిశానిర్దేవం

తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో పార్టీ రీజినల్‌ కో-ఆర్డినేటర్లు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జిలు, ఎమ్మెల్సీలతో సీఎం జగన్‌ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వచ్చే ఆరు నెలలు ప్రజల్లోనే ఉండాలని నేతలకు జగన్ దిశానిర్దేశం చేశారు.

New Update
JAGAN: ఇక నుంచి ప్రజల్లోనే ఉండాలి.. నేతలకు సీఎం జగన్ దిశానిర్దేవం

JAGAN:  వచ్చే ఆరు నెలలు ప్రజల్లోనే ఉండాలని నేతలకు సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు. టిక్కెట్ విషయంలో అందరూ తన నిర్ణయాన్ని పెద్ద మనసుతో గౌరవించాలని, టిక్కెట్ రాని వారికి మరో పదవి ఇస్తానని భరోసా ఇచ్చారు. టిక్కెట్ ఇవ్వనంత మాత్రాన తన మనిషి కాకుండా పోరని తెలిపారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో పార్టీ రీజినల్‌ కో-ఆర్డినేటర్లు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జిలు, ఎమ్మెల్సీలతో  నిర్వహించిన సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

175 సీట్లకు 175 సాధ్యమే..

ఇక మనం గేర్ మార్చాల్సి అవసరం వచ్చిందని పేర్కొన్నారు. ఇప్పటివరకూ ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు ఒక ఎత్తు.. ఇకపై చేసే కార్యక్రమాలు మరొక ఎత్తు అన్నారు. 175 సీట్లకు 175 సీట్లు గెలవడం అసాధ్యమేమీ కాదని వ్యాఖ్యానించారు. క్షేత్రస్థాయిలో సానుకూల పరిస్థితులున్నాయి కాబట్టే ప్రతిపక్షాలు పొత్తులకు వెళ్తున్నాయన్నారు. వచ్చే రెండు నెలల్లో జగనన్న సురక్ష, ఏపీ నీడ్ వైసీపీ కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు.

విభేదాలు ఉంటే పరిష్కరించుకోవాలి..

గడపగడపకూ ప్రభుత్వం కార్యక్రమంలో పార్టీ పట్ల, ప్రభుత్వం పట్ల సానుకూల స్పందన వచ్చిందన్నారు. ఇదే ఆత్మవిశ్వాసం, ఇదే ధైర్మం, ఇదే ముందస్తు ప్రణాళికతో అందరూ అడుగులు ముందుకేయాలని తెలిపారు. ప్రజలతో నిరంతరం సంబంధాలు నెరుపుతూ ఉండడం ముఖ్యమైన విషయం కాగా ఆర్గనైజేషన్‌, ప్లానింగ్‌, వ్యూహాలు మరొక ముఖ్యమైన విషయమన్నారు. అలాగే నియోజకవర్గాల్లో నేతల మధ్య విభేదాలు లేకుండా చూసుకోవాలని.. ఏమైనా ఉంటే వెంటనే పరిష్కరించుకోవాలని వివరించారు. ఎంత ఎక్కువ ప్రజల్లో ఉంటే.. అంత మంచి ఫలితాలు వస్తాయన్నారు.

ఐదు దశల్లో ఆరోగ్య సురక్ష కార్యక్రమం..

గతంలో చేసిన జగనన్న సురక్ష కార్యక్రమం వల్ల చాలా పాజిటివ్‌ వచ్చిందని.. దాదాపు 98 లక్ష సర్టిఫికెట్లు ఇచ్చామన్నారు. అలాగే ఆరోగ్య సురక్ష కార్యక్రమం చేపడుతున్నామని చెప్పారు. ఆరోగ్యపరంగా ప్రతి ఇంటినీ జల్లెడపట్టి.. ఉచితంగా మందులు, పరీక్షలు చేస్తామని తెలిపారు. అనారోగ్యం ఉన్న వారికి చేయూతనిచ్చి మెరుగైన చికిత్సలు అందిస్తామన్నారు. వ్యాధి నయం అయ్యేంతవరకూ విలేజ్‌ క్లినిక్‌, ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌తో వారికి చేయూతనిస్తామని పేర్కొన్నారు. ఇందులో ప్రజా ప్రతినిధులను, పార్టీ శ్రేణులను మమేకం చేస్తామని జగన్ వెల్లడించారు. మొత్తం 5 దశల్లో జగనన్న సురక్షకార్యక్రమం జరుగుతుందన్నారు.

ఇది కూడా చదవండి: ఏపీలో జగన్‌ పాలనపై అసదుద్దీన్‌ ఏమన్నాడంటే.!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Pawan Kalyan : విద్యార్థులు పరీక్ష అందుకోలేకపోయిన పరిస్థితిపై విచారణ

పెందుర్తి ప్రాంతంలో జె.ఈ.ఈ. పరీక్షకు కొందరు విద్యార్థులు అందుకోలేకపోవడానికి ఉప ముఖ్యమంత్రి కాన్వాయి కారణమని వచ్చిన వార్తా కథనాలను పరిగణనలోకి తీసుకొని వాస్తవ కారణాలను అన్వేషించి విచారణ కు పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఈ మేరకు పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు.

New Update
pawan kalyan

pawan kalyan Photograph: (pawan kalyan)

Pawan Kalyan :పెందుర్తి ప్రాంతంలో జె.ఈ.ఈ. పరీక్షకు కొందరు విద్యార్థులు అందుకోలేకపోవడానికి ఉప ముఖ్యమంత్రి కాన్వాయి కారణమని వచ్చిన వార్తా కథనాలను పరిగణనలోకి తీసుకొని వాస్తవ కారణాలను అన్వేషించి విచారణ కు  పవన్ కళ్యాణ్  ఆదేశించారు. కాన్వాయి కోసం ఎంతసేపు ట్రాఫిక్ ను నిలుపుదల చేశారు.  పరీక్ష కేంద్రం దగ్గరకు విద్యార్థులు చేరుకోవలసిన మార్గాల్లో ఆ సమయంలో ఉన్న ట్రాఫిక్ పరిస్థితి ఏమిటి అనే దానిపై విచారణ చేయాలని ఆదేశించారు.  సర్వీసు రోడ్లలో ఉన్న ట్రాఫిక్ ను ఏమైనా నియంత్రించారా విషయాలను కూడా తెలుసుకోవాలన్నారు.తదితర అంశాలపై విచారించాల్సిందిగా విశాఖపట్నం పోలీసులకు పవర్‌ కళ్యాణ్‌  ఆదేశాలు జారీ చేశారు.

Also read: Rameswaram: డీఎంకే ప్రభుత్వంపై మోదీ ఫైర్.. వాళ్లు తమిళంలో సంతకం చేయాలన్న ప్రధాని

 తన పర్యటనల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా చూడాలని ఇప్పటికే పవన్ సూచించారు.కూటమి ప్రభుత్వంలో ముఖ్యుల పర్యటనల సందర్భంలో స్వల్ప వ్యవధి మాత్రమే ట్రాఫిక్ రెగ్యులేషన్ చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. అదే విధంగా పోలీసులు ట్రాఫిక్ రెగ్యులేషన్ ,హెలికాప్టర్ లో వెళ్ళినా రోడ్డుపై ట్రాఫిక్ నిలవడం, చెట్లు కొట్టడం లాంటివి చేయడం ఆపడం లేదని తెలిపారు.పార్టీ శ్రేణులు, నాయకులకు సైతం క్రేన్ దండలు కార్యక్రమాలు, ట్రాఫిక్ అవాంతరాలు కలిగించే చర్యలు చేపట్టరాదని కేంద్ర కార్యాలయం నుంచి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.

Also read :  Ram Navami 2025: అయోధ్యలో అద్భుతం. రామ్‌ లల్లాకు సూర్య తిలకం


కాగా ఉప ముఖ్య మంత్రి పవన్ కళ్యాణ్ కాన్వాయ్ కారణంగా పరీక్ష కి ఆలస్యం అయిందని కొంతమంది విద్యార్థులు ఆరోపించారు. కన్వాయి వల్ల - పెందుర్తి అయాన్ డిజిటల్  JE అడ్వాన్స్ విద్యార్థులు ఆలస్యంగా పరీక్షా కేంద్రానికి వెళ్ళాల్సి వచ్చిందని వాపోయారు. 30 మంది విద్యార్థులు పరీక్షా కేంద్రానికి వెళ్లి పరీక్ష   రాయకుండా వెనిదిరగాల్సి వచ్చింది. దీనివల్ల - పిల్లల భవిష్యత్తు అగమ్య అవుతుందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు.

Also read: Ramnavami: రామాలయంలో అపశృతి.. టెంట్లు కూలీ భక్తుల తలలు పలిగాయి

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు