Ap:ఏపీలో వీరికి ఆదివారం.. రంజాన్ సెలవులు లేవు..
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. ఈ నెల 30,31న ఆదివారం, సోమవారం మున్సిపాలిటీల్లో రంజాన్ సెలవులు లేవు. మున్సిపాలిటీల్లో ఆస్తి పన్ను చెల్లింపులు కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది.
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. ఈ నెల 30,31న ఆదివారం, సోమవారం మున్సిపాలిటీల్లో రంజాన్ సెలవులు లేవు. మున్సిపాలిటీల్లో ఆస్తి పన్ను చెల్లింపులు కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది.
గంజాయి బ్యాచ్కు కోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. 2023 గుంతకల్లులో గంజాయితో పట్టుబడిన ఒడిశాకి చెందిన భగభాన్ పోలేకు అనంతరపురం కోర్టు పదేళ్ల జైలు శిక్ష, లక్ష రూపాయల జరిమానా విధించింది. సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయస్థానం నిందితుడికి శిక్ష ఖరారు చేసింది.
బాలకృష్ణ కంటే కూడా తనతోనే ఎక్కువమంది ఫొటోలు దిగుతారని తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కామెంట్ చేశారు. ఆయన రోజుకు ఒకరికి కొడతారట అని అన్నారు. ఈ రోజు మీడియా చిట్ చాట్ లో పలు అంశాలపై కోమటిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
స్వర్ణాంధ్ర విజన్-2047కి సంబంధించి పిఠాపురం, మంగళగిరి, ఉరవకొండ నియోజకవర్గాలను పైలెట్ ప్రాజెక్టుగా ఎంచుకున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. స్వర్ణాంధ్ర విజన్ - 2047 సాధనలో భాగంగా నియోజకవర్గ స్థాయిలో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చ ఎప్పారు.
సత్యసాయి జిల్లా హిందూపురానికి వెళ్తున్న ఆర్టీసీ బస్సులో 15 కిలోమీటర్ల వరకు టైర్ మీద పడుకుని ప్రయాణించాడు ఓ వ్యక్తి. మందు మత్తులో తన ప్రాణాలను రిస్కులో పెట్టేసుకున్నాడు. బైక్పై వెళ్లేవారు గమనించకపోతే పెద్ద ప్రమాదమే జరిగి ఉండేదంటున్నారు ప్రయాణికులు.
హోళీ సందర్భంగా ఏపీలో ఓ ప్రిన్సిపల్ విద్యార్థినిలతో అసభ్యంగా ప్రవర్తించాడు. కదిరి అమృతవల్లి డిగ్రీ కాలేజీ అమ్మాయిలను ఎత్తుకుని బురదలో పడేశాడు వెంకటపతి. కొందరిని బ్యాడ్ టచ్ చేశాడు. వీడియో వైరల్ అవుతుండగా అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు.
ఆస్తి కోసం అన్న... అన్న కొడుకును హత్య చేసేందుకు సుఫారి కుదుర్చుకున్నాడు. హత్య చేసేందుకు 23 లక్షలకు మారుతి రెడ్డి అనే వ్యక్తితో ఒప్పందం చేసుకున్నాడు. మూడు లక్షలు అడ్వాన్స్ గా ఇచ్చి మర్డర్ చేయడానికి వెళుతుండగా పోలీసులకు చిక్కడంతో హత్యకుట్ర భగ్నమైంది.
ఏపీ అనంతపురం తిలక్నగర్కు చెందిన భారతి పరువు హత్యకేసును పోలీసులు ఛేదించారు. తండ్రి రామాంజనేయులే ఆమెను ఉరేసుకుని చనిపోవాలని బెదిరించినట్లు వెల్లడించారు. మృతదేహాన్ని పెట్రోల్ పోసి కాల్చేసిన తండ్రి, అతని పెద్ద అల్లుడు మారుతిని కూడా అరెస్ట్ చేశారు.
శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం మండలంలో విషాదం చోటుచేసుకుంది. కొడిపి గ్రామానికి చెందిన తిమ్మారెడ్డి అనే రైతు గుండెపోటుతో మృతి చెందాడు. ఈ విషయం తెలిసిన భార్య తన భర్త మరణాన్ని తట్టుకోలేక చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.