Allu Arjun-Shah Rukh Khan: వైరల్ అవుతున్న అల్లు అర్జున్-షారూఖ్ ఖాన్ ఎక్స్(ట్విట్టర్) సంభాషణ

ఇద్దరు పెద్ద యాక్టర్లు మాట్లాడుకుంటే భలే ఇంట్రస్టింగ్ గా ఉంటుంది. అల్లు అర్జున్, షారూఖ్ ఖాన్ మధ్య జరిగిన చిట్ చాట్ గురించి సరిగ్గా ఇలాగే అనుకుంటున్నారు నెటిజన్లు. మీ సినిమా అదిరిపోయింది అని ఒకరంటే...మీ దగ్గర నుంచి ఎంతో నేర్చుకున్నాని మరొకరు అంటున్నారు.

New Update
Allu Arjun-Shah Rukh Khan: వైరల్ అవుతున్న అల్లు అర్జున్-షారూఖ్ ఖాన్ ఎక్స్(ట్విట్టర్) సంభాషణ

Allu Arjun and Shah Rukh Khan on Twitter: షారూఖ్ ఖాన్...బాలీవుడ్ కీ బాద్షా. ఇతనిని ఢీకొట్టే మరో హీరో లేడు అక్కడ ఇంతవరకు. అలాగే అల్లు అర్జున్...తాజాగా వచ్చిన నేషనల్ అవార్డ్ తో తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు. పాన్ ఇండియా హీరోగా ఎదిగి...వరల్డ్ వైడ్ గా కూడా స్టార్ డమ్ సంపాదించుకుంటున్నాడు. అలాంటి వీరిద్దరూ మాట్లాడుకుంటే ఎలా ఉంటుంది. అది కూడా మీ సినిమా బావుందని ఒకరు అంటే అయ్యో మిమ్మల్ని చూసి ఎంతో నేర్చుకున్నాని మరొకరు చెప్పుకుంటూ ఉంటే మజా వస్తుంది కదూ. సరిగ్గా అదే జరిగింది. తాజాగా రిలీజ్ అయిన షారూఖ్ ఖాన్ సినిమా మీద అల్లు అర్జున్ ప్రశంసల వర్షం కురిపించాడు. మొత్తం సినిమా యూనిట్ ను అభినందిస్తూ ట్వీట్ చేశాడు బన్నీ. అందులో బాద్షా గురించి ప్రత్యేకంగా చెబుతూ...మీ కెరీర్ లోనే అత్యుత్తమ సినిమా...మీ స్టైల్ తో మొత్తం ఇండియానే షేక్ చేశారు. మిమ్మల్ని ఇలా చూడ్డం ఆనందంగా ఉంది అంటూ రాసుకొచ్చాడు. అలాగే విజయ్ సేతుపతి , దీపిక, నయనతార ల గురించి కూడా మెన్షన్ చేశాడు.

అల్లు అర్జున్ ట్వీట్ లకు బాలీవుడ్ బాద్షా షారూఖ్ కూడా రీట్వీట్ పెట్టారు. బన్నీ మాటలకు చెప్పలేనంత ఆనందంగా ఉందని అన్నారు షారూఖ్. మీ ట్వీట్ తో జవాన్ విజయాన్ని మళ్ళీ ఆస్వాదిస్తున్నాని అన్నారు. అంతేకాదు మీ పుష్ప సినిమాను మూడు సార్లు చూశానని, మీ నుంచి ఎంతో నేర్చుకున్నాని రాసుకొచ్చారు కింగ్ ఖాన్. త్వరలోనే మిమ్మల్ని కలిసి నా ప్రేమను తెలియజేస్తాను అన్నారు.

మరోవైపు బన్నీ ట్వీట్ కు మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ కూడా రీట్వీట్ చేశాడు. దానికి అల్లు అర్జున్ సరదాగా థాంక్స్ చెబితే సరిపోతు...న నా సినిమాకు మంచి పాటలు ఇవ్వాలంటూ రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం ఎక్స్ లో వీరి చిట్ చాట్ అంతా ట్రెండింగ్ లో ఉంది. ఇద్దరు పెద్ద హీరోలు ఇంత హంబుల్ గా మాట్లాడుకోవడం వైరల్ అవుతోంది.

Also Read: గుంటూరు కారం.. మరో డిసప్పాయింట్ మెంట్

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Pahalgam Terror Attack: ఉగ్రదాడిలో 28 మంది మృతి.. తనికెళ్ల భరణి కన్నీటి కవిత

పహల్గాం టెర్రరిస్టు అటాక్‌పై సినీ నటుడు తనికెళ్ల భరణి స్పందించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా ఒక కన్నీటి కవితను షేర్ చేసారు. కాశ్మీరంలోనే కుంకం పువ్వెందుకు పూస్తుందో నా కర్ధమైపోయింది! అంటూ ఆ కవిత సాగుతుంది. ప్రస్తుతం అది నెట్టింట వైరల్‌గా మారింది.

New Update
Pahalgam Terror Attack

Pahalgam Terror Attack

జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. అందమైన ప్రదేశాలను చూసేందుకు వచ్చిన టూరిస్టులపై కాల్పులు జరిపారు. ఈ దాడిలో దాదాపు 28 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ముస్లిమేతరులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడులకు పాల్పడినట్లు సాక్ష్యులు చెబుతున్నారు. 

ఇది కూడా చూడండి: PM Modi: సౌదీ పర్యటన మధ్యలోనే ముగించుకుని వెనక్కు వచ్చేసిన ప్రధాని మోదీ

అమాయక ప్రజల మృతిపై ఇప్పటికే సినీ సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు, వ్యాపార వేత్తలు సంతాపం తెలిపారు. ఈ చర్యలకు పాల్పడిన వారిని అస్సలు వదలకూడదని.. కఠినంగా శిక్షించాలంటూ భారతీయులు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ సీనియర్ యాక్టర్ తనికెళ్ల భరణి స్పందించారు. ఈ మేరకు ఒక కవితతో ఉన్న పోస్టర్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 

ఇది కూడా చూడండి: Pahalgam: పహల్గామ్ లో నంబర్ ప్లేట్ లేని బైక్..ఉగ్రవాదులదేమోనని అనుమానం

కన్నీటి కవిత

కాశ్మీరంలోనే కుంకం పువ్వెందుకు పూస్తుందో నా కర్ధమైపోయింది!
అక్కడ ఉన్నట్టుండి పాకే పాకే పసిబిడ్డ నెత్తురు ముద్దై పోతుంది. 

సామగానం చేసే కాశ్మీరీ పండితుల కంఠాల్లోంచి వేదం ఆగి- రుధిరం బైటికొస్తుంది.

అక్కడ రేపు పల్లకీ లెక్కి ఊరేగాల్సిన పెళ్ళికొడుకులు ఇవాళే పాడెక్కుతారు...

ఆ లోయలో హిమాలయాలు సైతం మూర్తీభవించిన వైధవ్యాల్లా ఉంటాయ్

భరతమాత కిరీటం వొరుసుకునీ నిరంతరం అక్కడ నెత్తురోడుతూ ఉంటుంది !

బుద్ధుడు కూడా కళ్ళూ నోరూ మూసుకుని మళ్ళీ అంతర్ముఖుడౌతాడు !!

ఎప్పుడో 40 ఏళ్ళ క్రితం రాసిన కవిత, ఇంకా తడిగానే ఉంది!! అంటూ తనికెళ్ల భరణి ఒక కవితను పంచుకున్నారు. ఇప్పుడది నెట్టింట వైరల్‌గా మారింది. 

 

pahalgam | Pahalgam attack | pahalgam breaking news | tanikella-bharani | latest-telugu-news | telugu-news

Advertisment
Advertisment
Advertisment