GT VS RR: గుజరాత్ ఖాతాలో వరుసగా నాలుగో విజయం
ఐపీఎల్ లో గుజరాత్ ఓటమి అన్నదే లేకుండా ముందుకు సాగిపోతోంది. ఈరోజు రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో గుజరాత్ 58 పరుగులతో ఘన విజయం సాధించింది. మరోవైపు హ్యాట్రిక్ పై కన్నేసిన రాజస్థాన్ కు నిరాశ ఎదురైంది.
ఐపీఎల్ లో గుజరాత్ ఓటమి అన్నదే లేకుండా ముందుకు సాగిపోతోంది. ఈరోజు రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో గుజరాత్ 58 పరుగులతో ఘన విజయం సాధించింది. మరోవైపు హ్యాట్రిక్ పై కన్నేసిన రాజస్థాన్ కు నిరాశ ఎదురైంది.
ఐపీఎల్ 2025 సీజన్లో ఇవాళ గుజరాత్ టైటాన్స్ vs రాజస్థాన్ రాయల్స్ మధ్య 23వ మ్యాచ్ జరుగుతోంది. మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టు నిర్దేశించిన 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 217 పరుగులు సాధించింది. రాజస్తాన్ ముందు 218 టార్గెట్ ఉంది.
రాజస్థాన్తో జరుగుతోన్న మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ జట్టు బ్యాటర్ సాయి సుదర్శన్ చెండాడేశాడు. ఈ మ్యాచ్లో సుదర్శన్ పరుగుల వరద పెట్టించాడు. 53 బాల్స్లో 82 పరుగులు సాధించాడు. ఈ మ్యాచ్లో గుజరాత్ జట్టులో అత్యధిక స్కోర్ సాధించిన ప్లేయర్గా నిలిచాడు.
ఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ గుజరాత్ టైటాన్స్ VS రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్ చేస్తున్న గుజరాత్ 1 వికెట్ నష్టానికి 50 పరుగులు పూర్తి చేసుకుంది. క్రీజ్లో సుదర్శన్, బట్లర్ నిలకడగా ఆడుతున్నారు.
ఐపీఎల్ 2025లో భాగంగా గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడుతున్నాయి. టాస్ రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్కు ఆర్ఆర్ స్టార్ బౌలర్ వనిందు హసరంగ వ్యక్తిగత కారణాల వల్ల దూరమయ్యాడు.
ఐపీఎల్ చరిత్రలో లక్నో జట్టు ఆల్రౌండర్ శార్ధూల్ ఠాకూర్ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. రీసెంట్గా కెకెఆర్తో జరిగిన మ్యాచ్లో ఒక్క ఓవర్లోనే 11బాల్స్ వేశాడు. దీంతో ఐపీఎల్ చరిత్రలో లాంగెస్ట్ ఓవర్ వేసిన బౌలర్గా చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.
ఒకే ఒక్క మ్యాచ్..రాత్రికి రాత్రే ఆ కుర్రాడిని హీరోగా మార్చేసింది. అంతర్జాతీయ అనుభవం లేదు..దేశవాళీలోనూ పాతిక మ్యాచ్ లు కూడా ఆడలేదు. కానీ ఐపీఎల్ లో నాలుగో మ్యాచ్ లోనే సెంచరీ బాదేసి..హాట్ టాపిక్ గా మారిపోయాడు ప్రియాంశ్ ఆర్య. ఎవరీ కుర్రాడు?
ఐపీఎల్ లో ఈరోజు పంజాబ్ కింగ్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో చెన్నై పంజాబ్ చేతిలో 18 పరుగుల తేడాతో ఓడిపోయింది. పంజాబ్ కిది వరుసగా మూడో విజయం కాగా..సీఎస్కేకు వరుసగా నాలుగో పరాజయం.
పంజాబ్ కింగ్స్, చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ రసవత్తరంగా నడుస్తోంది. ముల్లాన్పూర్ వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచిన పంజాబ్ బ్యాటింగ్ ఎంచుకుంది. మొదట దూకుడుగా ఆడిన పంజాబ్ వరుస వికెట్లు కోల్పోతోంది. 12 ఓవర్లలో 128/5 పరుగులు చేసింది.