RR VS GT: టాస్ గెలిచిన బౌలింగ్ ఎంచుకున్న రాజస్థాన్ రాయల్స్‌

ఐపీఎల్‌ 2025లో భాగంగా గుజరాత్‌ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడుతున్నాయి. టాస్‌ రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌కు ఆర్‌ఆర్‌ స్టార్ బౌలర్ వనిందు హసరంగ వ్యక్తిగత కారణాల వల్ల దూరమయ్యాడు.

author-image
By B Aravind
New Update
RR vs GT

RR vs GT

ఐపీఎల్‌ 2025లో భాగంగా గుజరాత్‌ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడుతున్నాయి. టాస్‌ రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌కు ఆర్‌ఆర్‌ స్టార్ బౌలర్ వనిందు హసరంగ వ్యక్తిగత కారణాల వల్ల దూరమయ్యాడు. అతడి స్థానంలో ఫజల్‌హక్ ఫారూకీ తుది జట్టులోకి వచ్చాడు. ఇక గుజరాత్ టీమ్‌ ఎలాంటి మార్పులు చేయకుండానే బరిలోకి దిగింది. 

ఈ సీజన్‌లో గుజరాత్‌ మొదటి మ్యాచ్‌లో ఓడిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మూడుసార్లు వరుసగా గెలిచి పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరింది. రాజస్థాన్ రాయల్స్‌ టీమ్‌ మొదటి రెండు మ్యాచుల్లో ఓడి.. ఆ తర్వాత వరుసగా రెండుసార్లు గెలిచింది. పాయింట్ల పట్టికలో ఈ టీమ్ ఏడో స్థానంలో ఉంది. 

Also Read: బీహార్ లో దారుణం కేంద్రమంత్రి మనమరాలి దారుణ హత్య

రాజస్థాన్‌ రాయల్స్‌ టీమ్

యశస్వి జైస్వాల్, సంజు శాంసన్ (కెప్టెన్‌ & వికెట్‌కీపర్‌), నితీష్ రాణా, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, షిమ్రాన్ హెట్మెయర్, ఫజల్‌ హక్‌ ఫారూకీ, జోఫ్రా ఆర్చర్, మహేశ్ తీక్షణ, యుధ్వీర్ సింగ్ చరక్, సందీప్ శర్మ, తుషార్ దేశ్‌పాండే

Also Read: విమానంలో పక్క ప్యాసింజర్‌పై మూత్రం పోసిన వ్యక్తి

గుజరాత్‌ టీమ్ 

సాయి సుదర్శన్, శుభమన్ గిల్ (కెప్టెన్‌), జోస్ బట్లర్ (వికెట్‌కీపర్‌), షెర్ఫాన్‌ రూథర్‌ఫోర్డ్, షారుక్ ఖాన్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, సాయి కిషోర్, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఇషాంత్ శర్మ

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

LSG VS DC: లక్నో పై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం

ఐపీఎల్ లో ఈరోజు లక్నో సూర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో...ఢిల్లీ 8 వికెట్ల తేడాతో నెగ్గింది. లక్నో ఇచ్చిన 159 టార్గెట్ ను క్యాపిటల్స్ 17.5 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది.  

New Update
ipl 2025

DC VS LSG

లక్నో సూపర్ జెయింట్స్ మళ్ళీ మ్యాచ్ ఓడిపోయింది. ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో 8వికెట్ల తేడాతో మ్యాచ్ ను కోల్పోయింది. లక్నో ఇచ్చిన 159 టార్గెట్ ను ఢిల్లీ 17.5 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది.  అభిషేక్‌ పోరెల్‌  36 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్స్‌లతో 51 పరుగులు, కేఎల్‌ రాహుల్‌  42 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 57 పరుగులు, అక్షర్‌ పటేల్‌  24 బంతుల్లో 1 ఫోర్లు, 4 సిక్స్‌లు 34 పరుగులు చేశారు. దీంతో మ్యాచ్ ను సునాయాసంగా గెలిచేశారు. ఢల్లీ బ్యాటర్లను సూపర్ జెయింట్స్ బౌలర్లు ఏ మాత్రం కట్టడి చేయలేకపోయారు.  లక్నో బౌలర్లలో మార్‌క్రమ్‌ రెండు వికెట్లు తీశాడు.

రాణించిన మార్ క్రమ్, మిచెల్ మార్ష్..

లక్నో వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ తో జరుగుతోన్న మ్యాచ్ లో టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లక్నో బ్యాటింగ్ 6 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. ఓపెనర్లు ఐదెన్ మార్‌క్రమ్ (52), మిచెల్ మార్ష్ (45) రాణించారు. నికోలస్ పూరన్ (9), అబ్దుల్ సమద్ (2) విఫలమయ్యారు. డేవిడ్ మిల్లర్ (14) పరుగులు చేశాడు.ఆయుష్ బదోని (36) దూకుడుగా ఆడాడు. 9.5 ఓవర్లకు 87/0తో పటిష్టస్థితిలో లక్నో .. ఆ తర్వాత వరుసగా వికెట్లు కోల్పోయి ఊహించిన దానికన్నా తక్కువ స్కోరుకే పరిమితమైంది. ఢిల్లీ బౌలర్లలో ముకేశ్‌ కుమార్ 4, మిచెల్ స్టార్క్, దుష్మాంత చమీర ఒక్కో వికెట్ పడగొట్టారు.

today-latest-news-in-telugu | IPL 2025 | lsg | dc | match 

Also Read:  BIG BREAKING: వైసీపీ నుంచి దువ్వాడ ఔట్.. జగన్ సంచలన ప్రకటన!

Advertisment
Advertisment
Advertisment