Cyber crime: ఒక్కసారి క్లిక్ చేశారో.. సెకన్లలో మీ అకౌంట్ ఖాళీ
తెలంగాణలో హీరేహాళ్ అనే వ్యక్తి అకౌంట్ నుంచి కేటుగాళ్లు రూ.9 లక్షలు కాజేశారు. అతని అకౌంట్లో డబ్బులు ఉన్నట్లు గుర్తించిన కేటుగాళ్లు వాట్సాప్లో ఓ మెసేజ్ను పంపారు. దాన్ని క్లిక్ చేయడంతో సెకన్ల సమయంలోనే మొత్తం డబ్బు కాజేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
సైబర్ స్కామర్ల వలలో హైదరాబాద్ డాక్టర్.. రూ.11 కోట్లకు టోకరా..!
సైబర్ స్కామర్ల వలలో మరో వ్యక్తి చిక్కుకున్నాడు. హైదరాబాద్లోని బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీకి చెందిన 50 ఏళ్ల డాక్టర్ నుంచి రూ.11.11 కోట్లు కాజేశారు. ఫారెక్స్ ట్రేడింగ్ పేరుతో సైబర్ నేరగాళ్లు ఆగస్టు నుంచి నవంబర్ వరకు ఈ డబ్బును 34 విడతలుగా దోచేశారు.
రూ.8.14 కోట్ల సైబర్ మోసం.. నిందితులను పట్టుకున్న హైదరాబాద్ పోలీసులు
హైదరాబాద్లోని బంజారాహిల్స్కు చెందిన ఓ వ్యక్తి నుంచి రూ.8.14 కోట్లు కొట్టేసిన కేసులో ఇద్దరు నిందితులను తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని రాజస్థాన్లోని ఉదయ్పుర్ జిల్లాకి చెందిన వ్యక్తులుగా గుర్తించారు.
సైబర్ నేరాలపై ప్రధాని మోదీ కీలక సూచనలు..
సైబర్ నేరాలు, ఏఐతో జరుగుతున్న అక్రమాలు, డీప్ఫేక్ వంటి వాటిపై ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. వీటివల్ల సామాజిక, కుటుంబ సంబంధాలు దెబ్బతింటున్నాయని అన్నారు. కానిస్టేబుళ్ల స్థాయిలోనే టెక్నాలజీని వినియోగించి వీటిని కట్టడి చేయాలని పోలీసులకు సూచించారు.
15 రోజుల పాటు వృద్ధుడు డిజిటల్ అరెస్ట్.. కోటికి పైగా కొట్టేశారుగా!
సైబర్ స్కామర్లు మరోసారి రెచ్చిపోయారు. 90ఏళ్ల వృద్ధుడి నుంచి రూ.కోటికి పైగా కొట్టేశారు. ముంబై నుంచి చైనాకు సీనియర్ సిటిజన్ పేరుతో కొరియర్ లో పార్శిల్ పంపారని.. అందులో 400 గ్రాముల డ్రగ్స్ లభించినట్లు ఆ వృద్ధుడిని బెదిరించారు. ఈ ఘటన గుజరాత్ లో జరిగింది.
విజయవాడలో యువతి డిజిటల్ అరెస్ట్.. రూ.1.25 కోట్లు కొట్టేసిన మోసగాళ్లు
సైబర్ నేరగాళ్లు డిజిటల్ అరెస్ట్ పేరుతో విజయవాడకు చెందిన ఓ యువతి వద్ద నుంచి రూ. 1.25 కోట్లు కాజేశారు. నకిలీ ఫోన్లకు మోసపోవద్దని పోలీసులు చెబుతున్నప్పటికీ అమాయకులు మోసపోతూనే ఉన్నారు.
Cyber Trap: ప్రభుత్వ ఉద్యోగికి సైబర్ కేటుగాళ్ల ఉచ్చు.. రూ.46 లక్షలు గోవిందా!
సైబర్ నేరగాళ్లు మరో ఘరానా మోసానికి పాల్పడ్డారు. ఏపీలోని ఏలూరు జిల్లాకు చెందిన ప్రభుత్వ ఉద్యోగి శేషగిరిని మనీలాండరింగ్ కేసు పేరుతో బెదిరించి రూ.46 లక్షలు దోచేశారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
3,237 మంది డిజిటల్ అరెస్ట్.. రూ.237 కోట్లు లూటీ చేసిన కేటుగాళ్లు!
దేశవ్యాప్తంగా సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. డిజిటల్ అరెస్టుల పేరుతో అమాయకులను అడ్డంగా దోచేస్తున్నారు. ఈ 10 నెలల్లోనే డిజిటల్ అరెస్టుల పేరుతో 3,237 మందిని బెదిరించి రూ. 237 కోట్లు కొట్టేసినట్లు పోలీసులు గుర్తించారు. పలువురిని అరెస్ట్ చేశారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/cyber-crime-jpg.webp)
/rtv/media/media_files/BkJOSQHULvKw0m5oz0nE.jpg)
/rtv/media/media_files/2024/12/11/oKIWYqYxBacEQSVw6tVD.jpg)
/rtv/media/media_files/2024/12/02/hvBS8QRaMHdP74O9e7hQ.jpg)
/rtv/media/media_files/2024/12/02/ZznegJ1wjXtrysebk75J.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/cyber-terrorist-with-masked-identity-hacking-serve-2022-11-29-00-15-49-utc-scaled.webp)
/rtv/media/media_files/2024/10/27/O9uhGLkSG34T8NdiZp6S.jpg)