Cyber Crime: పెళ్లి కార్డుతో సైబర్ ఎటాక్.. క్షణాల్లోనే 75 వేల రూపాయలు మాయం!

రాజ్‌కోట్‌లో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయారు. PDF రూపంలో పెళ్లి కార్డు పంపించి లక్షల్లో డబ్బులు కొట్టేశారు. ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా పదిమందిని ఇలాగే ట్రాప్ చేసి డబ్బులు కొట్టేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

New Update
cyber crime

సైబర్ నేరగాళ్లు (Cyber Criminals) మితిమిరిపోయారు. రోజుకు కొత్తకొత్త టెక్నాలజీ, టెక్నిక్ లతో అమాయకపు ప్రజలను బురిడి కొట్టించి డబ్బులు కాజేస్తున్నారు. తాజాగా వెడ్డింగ్ కార్డు (Wedding Card) ను PDF రూపంలో పంపించి లక్షల్లో కాజేశారు. ఈ ఘటన గుజరాత్ లోని రాజ్‌కోట్‌లో జరిగింది. ఇలా ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 10 మంది ఫోన్లు హ్యాక్ చేసి డబ్బులు కొట్టేశారు.  

Also Read :  ఆత్మహత్యకు దారితీసిన క్షణికావేశం.. భర్త బయటకు తీసుకెళ్లలేదని.. భార్య ఏం చేసిందంటే?

2025 ఫిబ్రవరి 14వ తేదీన రాజ్‌కోట్‌లోని కోలితాడ్ గ్రామానికి చెందిన రియాజ్ భాయ్ కు అతని బంధువు ఇషాన్ భాయ్ నుంచి ఫోన్‌కు ఓ మేసేజ్  వచ్చింది. నా పెళ్లికి రండి అంటూ ఒక PDF ఫైల్ కూడా ఉంది. రియాజ్ భాయ్ సంతోషిస్తూ ఆ పెళ్లి కార్డు చూద్దామని  డౌన్‌లోడ్ చేసుకున్న వెంటనే, అతని ఫోన్ హ్యాకర్ల చేతుల్లోకి వెళ్ళింది. మొదట్లో  అతని బ్యాంకు ఖాతానుంచి కేవలం రూ.1 మాత్రమే కట్ అయింది.   తర్వాత నెమ్మదిగా మొత్తం రూ.75వేలు మాయం అయ్యాయి. అసలు ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే అతని డబ్బు మరోకరి జేబులోకి వెళ్లిపోయింది. 

Also Read :  కుంభమేళాలో డిజిటల్ స్నానం...కేవలం 1100 లే..అదిరిపోయింది కదా ఐడియా!

రియాజ్ భాయ్ ఒక్కడే కాదు. కోలితాడ్ గ్రామానికి చెందిన రైతు శైలేష్ భాయ్ సావ్ల్యా విషయంలో కూడా అదే జరిగింది. పొలంలో రోజంతా కష్టపడి పనిచేసే శైలేష్ భాయ్ కి కూడా ఇలాంటి వివాహ ఆహ్వానం అందింది. అతడు దానిని ఓపెన్ చేయగానే కొద్దిసేపటికే అతని ఖాతా నుండి రూ. 24 వేలు మాయం అయ్యాయి.  దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు.  

Also Read :  భగవద్గీతపై ప్రమాణం చేసిన ఎఫ్బీఐ డైరెక్టర్ కాష్ పటేల్

రూ.1.38 కోట్లు కాజేశారు

ఇక హైదరాబాద్ లో కూడా ఇలాంటి తరహా ఘటనే చోటుచేసుకుంది. డిజిటల్​అరెస్ట్ (Digital Arrest)​ పేరిట సైబర్ నేరగాళ్లు 82 ఏళ్ల వృద్ధుడి బ్యాంక్​ఖాతా నుంచి రూ.1.38 కోట్లు కాజేశారు. ఈ కేసులో సైబరాబాద్​సైబర్ క్రైమ్​పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ముంబై సైబర్​క్రైమ్​ అఫీసర్లమంటూ​మాట్లాడుతూ అతని బ్యాంక్​అకౌంట్ల నుంచి రూ.1.38 కోట్లు ట్రాన్స్​ఫర్​చేసుకున్నారు. 

Also Read :  దొంగిలించిన డబ్బుతో లవర్లతో కలిసి మహాకుంభమేళాకు..చివరకు బిగ్ ట్విస్ట్!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

కల్తీ కల్లు కలకలం.. 58 మందికి తీవ్ర అస్వస్థత

కామారెడ్డి జిల్లాలో కల్తీ కల్లు తాగి 58 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కల్తీ కల్లు తాగి మతిస్థిమితం కోల్పోవడంతో పాటు వింతగా ప్రవర్తించారు. దీంతో వెంటనే స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు. ఆ దుకాణాల లైసెన్స్‌లు రద్దు చేయాలని సబ్ కలెక్టర్ ఆదేశించారు.

New Update
Kamareddy issues

Kamareddy issues Photograph: (Kamareddy issues)

కామారెడ్డి జిల్లాలో కల్తీ కల్లు తాగి 58 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. నస్రుల్లాబాద్ మండలం అంకోల్, అంకోల్ తండా, దుర్కి, బీర్కూర్ దామరంచ గ్రామాల్లో కల్తీ కల్లు తాగిన వారంతా ఒక్కసారిగా అనారోగ్యానికి గురయ్యారు. ఈ కల్తీ కల్లు వల్ల ఒక్కసారిగా మతిస్థిమితం కోల్పోయారు. వింతగా ప్రవర్తించడంతో వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు.

ఇది కూడా చూడండి: Madhya Pradesh:క్షమించండి..దొంగతనం చేయాలనుకోలేదు..ఆరు నెలల్లో తిరిగి ఇచ్చేస్తాను..!

ఇది కూడా చూడండి: Today Gold Rate: కిక్కిచ్చిన బంగారం ధరలు.. ఇవాళ భారీగా తగ్గాయ్.. తులం ఎంతంటే?

కల్తీ కల్లు తాగిన వారి పరిస్థితి విషమం..

ఈ కల్తీ కల్లు తాగిన వారిలో కొందరి పరిస్థితి సీరియస్‌గా ఉందని వైద్యులు తెలిపారు. దీంతో వెంటనే ఎక్సైజ్ అధికారులు కల్లు దుకాణానికి వెళ్లి శాంపిల్స్ సేకరించారు. ఈ ఘటనపై విచారణ జరపాలని సబ్ కలెక్టర్ ఆదేశించారు. ఆ కల్లు దుకాణాల లైసెన్స్‌లు రద్దు చేయాలని అధికారులను సబ్ కలెక్టర్ వెల్లడించారు. ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారిని కల్లు దుకాణాలను మూసివేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కల్తీ కల్లు వల్ల ఇంకా ఎందరు ప్రాణాలు కోల్పోవాలని మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే వాటిని పూర్తిగా క్లోజ్ చేయాలని, ఇలాంటి వాటికి అసలు పర్మిషన్లు ఇవ్వకూడదని స్థానికులు అంటున్నారు.

ఇది కూడా చూడండి: Ap Aqua -Trump Effect: ఏపీ రైతులపై ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్.. చంద్రబాబు కీలక నిర్ణయాలు

Advertisment
Advertisment
Advertisment