AP: గ్రూప్ -2 మెయిన్స్ ఫలితాల విడుదల
ఏపీపీఎస్సీ గ్రూప్-2 మెయిన్స్ ఫలితాలు కొద్దిసేపటి క్రితమే విడుదలయ్యాయి. ఫలితాలతో పాటు మెయిన్ పరీక్ష ఫైనల్ ‘కీ’ని కూడా అధికారులు వెబ్సైట్లో ఉంచారు.
ఏపీపీఎస్సీ గ్రూప్-2 మెయిన్స్ ఫలితాలు కొద్దిసేపటి క్రితమే విడుదలయ్యాయి. ఫలితాలతో పాటు మెయిన్ పరీక్ష ఫైనల్ ‘కీ’ని కూడా అధికారులు వెబ్సైట్లో ఉంచారు.
వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి హైకోర్టులో ఊరట లభించింది. గెస్ట్హౌస్ వివాదంలో న్యాయస్థానం స్టేటస్ కో విధించింది. శ్రీసత్యసాయి జిల్లాలో గుర్రాల కొండపై కేతిరెడ్డికి చెందిన 2.42 ఎకరాల భూమిపై వివాదం నడుస్తోన్న సంగతి తెలిసిందే.
సినీ దర్శకుడు రాంగోపాల వర్మకు ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ లో ఊరట దక్కింది. విచారణకు రావాలని సీఐడీ అధికారులు ఆర్జీవీకి నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో...విచారణలో వర్మపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని హైకోర్ట్ సీఐడీకి ఆదేశాలు జారీ చేసింది.
పాస్టర్ ప్రవీణ్ మృతితో ఆయన కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. కొడుకు మృతితో ఆయన తల్లి మరియమ్మ మంచం పట్టారు. మరియమ్మ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. ఆమె బాగోగులు తెలుసుకునేందుకు కడప ఆశా వర్కర్ దేవి మరియమ్మకు ఫోన్ చేశారు.
ఏపీలో రిజిస్ట్రేషన్లు ఇకపై స్లాట్ బుకింగ్ విధానంలో జరగనున్నాయి. జిల్లాల్లోని రిజిస్ట్రార్ కేంద్రాల్లో శుక్రవారం నుంచి స్లాట్ బుకింగ్ విధానం అమల్లోకి రానుంది. అధికారిక వెబ్సైట్ లేదా కార్యాలయాల్లో క్యూఆర్కోడ్ స్కాన్ ద్వారా స్లాట్ బుక్ చేసుకోవచ్చు.
ఏపీ అసెంబ్లీ ఆవరణలో దొంగలు తమ చేతివాటాన్ని ప్రదర్శించారు. ఎమ్మెల్సీల ప్రమాణస్వీకారం సందర్భంగా టీడీపీ ఎమ్మెల్సీ బీటీ నాయుడు జేబులోని రూ.10వేలు, ఆయన గన్ మెన్ జేబులో ఉన్న రూ.40వేలు, హైకోర్టు లాయర్ జేబులో రూ.50వేలను కొట్టేశారు.
ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేసిన.. తమ్ముడు నాగబాబుకు ఆత్మీయ అభినందనలు అంటూ చిరు తన ట్విట్టర్ లో పోస్టు చేశారు. అయితే చిరు పోస్ట్ పై నాగబాబు స్పందించారు. మీ ప్రేమ, తోడ్పాటుకు ధన్యవాదాలు. మీరు ఇచ్చిన పెన్ నాకు ఎంతో ప్రత్యేకమని బదులిచ్చారు నాగబాబు.
కొడాలి నానికి సర్జరీ చేయనున్న డాక్టర్ రామకాంత పాండా చాలా ఫేమస్. ఆయన పద్మభూషణ్ అవార్డును కూడా పొందారు. నాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్కు కూడా ఆయనే విజయవంతంగా సర్జరీ నిర్వహించారు. క్రిటికల్ స్టేజ్లో ఉన్న వారిని సైతం బతికించి దేవుడయ్యారు.
పాస్టర్ ప్రవీణ్ కేసులో మరో సంచలనం చోటుచేసుకుంది. ప్రవీణ్ ఫోన్పే, పేటీఎం ట్రాన్సాక్షన్లు బయటపడ్డాయి. ఎల్బీనగర్ సవేరా వైన్స్లో లిక్కర్ షాపులో మధ్యాహ్నం 12: 24 నిమిషాలకు రూ. 950 ఫోన్ పే చేసి రెండు టీన్స్ బాటిల్ కొనుగోలు చేశారు ప్రవీణ్ .