ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లో మోసపోయిన సచివాలయ ఉద్యోగి.. RTV షేర్ చేసిన వీడియోకి స్పందించిన మంత్రి లోకేష్‌

ఏపీలో సచివాలయం వెల్ఫేర్ అసిస్టెంట్‌ ఆన్‌బెట్టింగ్‌లు ఆడి మోసపోయాడు. తన భార్య, పిల్లలతో కలిసి సూసైడ్ చేసుకుంటామని సెల్ఫీ వీడియో తీశాడు. RTV ఎక్స్‌లో షేర్ చేసిన ఈ వీడియోకి మంత్రి లోకేష్ స్పందించారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టితస్ చదవండి.

author-image
By B Aravind
New Update
Minister Nara Lokesh Responds on Online Betting Victim's Video

Minister Nara Lokesh Responds on Online Betting Victim's Video

ఈమధ్య కాలంలో ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లు పెరిగిపోయాయి. చాలామంది వీటికి అలవాటైపోయి డబ్బులు పోగొట్టుకుంటున్నారు. అప్పులు చేసి మరీ ఈ బెట్టింగ్‌ గేమ్స్‌ ఆడుతున్నారు. చివరికీ అప్పులు ఎక్కువై వాటిని కట్టలేక.. కొందరు భయంతో, మనస్తాపంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అయితే తాజాగా ఏపీలో సచివాలయం వెల్ఫేర్ అసిస్టెంట్‌ లక్ష్మీ ప్రసాద్ అనే వ్యక్తి కూడా ఆన్‌బెట్టింగ్‌లు ఆడి మోసపోయాడు. తన భార్య, పిల్లలతో కలిసి సూసైడ్ చేసుకుంటామని సెల్ఫీ వీడియో తీశాడు. 

Also Read: రాష్ట్ర ప్రభుత్వాలు అందులో విఫలమయ్యాయి.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

ఈ వీడియోను RTV ఎక్స్‌లో షేర్‌ చేయగా.. దీనికి మంత్రి నారా లోకేష్ స్పందించారు. వాళ్లను ఇంటికి తిరిగిరావాలని కోరారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. పల్నాడు జిల్లా దాచేపల్లి సచివాలయం వెల్ఫేర్ అసిస్టెంట్‌గా లక్ష్మీ ప్రసాద్ అనే వ్యక్తి పనిచేస్తున్నాడు. ఇటీవల ఆన్‌లైన్‌లో బెట్టింగ్‌లు ఆడి డబ్బులు పోగొట్టుకున్నాడు. చివరికి పెన్షన్ డబ్బులతో పరారయ్యాడు. ఆ తర్వాత ఓ సెల్ఫీ వీడియోలో మాట్లాడారు. ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లో మోసపోయానని.. నా కుటుంబం, పిల్లలు రెండ్రోజులుగా ఏమీ తినలేదని చెప్పాడు. నెలరోజుల్లో పెన్షన్‌ డబ్బులు చెల్లిస్తానని.. జిల్లా కలెక్టర్, దాచెపల్లి కమిషనర్‌ తనను క్షమించాలని కోరారు. 

Also Read: అసెంబ్లీలో గుట్కా నమిలి ఉమ్మిన ఎమ్మెల్యే.. వీడియో వైరల్

RTV అధికారిక ఎక్స్‌లో షేర్ చేసిన ఈ వీడియోకి మంత్రి లోకేష్ స్పందించారు. '' మనుషులుగా మనం తప్పులు చేస్తుంటాం. కానీ వాటి నుంచి నేర్చుకోవడం చాలా ముఖ్యం. మీ కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వండి. జీవితాలను నాశనం చేసే బెట్టింగ్ యాప్స్‌కు దూరంగా ఉండండి. మీ కుటుంబ భద్రతపై మేము బాధ్యతలు తీసుకుంటాం. ఇంటికి సురక్షితంగా రండి'' అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. 

Also Read: 'మీరు పెంచితే మేము పెంచుతాం'.. అమెరికాకు చైనా షాక్

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

టీచర్‌ను చెప్పుతో కొట్టిన విద్యార్థిని సస్పెండ్

టీచర్‌ని చెప్పుతో కొట్టిన విద్యార్థినిపై రఘు ఇంజనీరింగ్ కాలేజ్ చర్యలు తీసుకుంది. యువతి వెంకటలక్ష్మీని కాలేజీ యాజమాన్యం సస్పెండ్ చేసింది. కాలేజీలో విద్యార్థిని ఫోన్ లెక్చరర్ తీసుకున్నందుకు ఆమెను బూతులు తిడుతూ దాడికి దింగింది.

New Update
raghu clg

కాలేజ్‌లో టీచర్‌ని చెప్పుతో కొట్టిన స్టూడెంట్‌పై యాజమాన్యం చర్యలు తీసుకుంది. ఆంద్రప్రదేశ్ విజయనగరంలోని రఘు ఇంజనీరింగ్ కాలేజ్‌లో ఇది జరిగింది. టీచర్‌ను దుర్భాషలాడుతూ ఆమెపై దాడికి దిగింది యువతి. ఆ విద్యార్థిని టీచర్‌ను చెప్పుతో కొడుతున్నప్పుడు అక్కడే ఉన్న కొందరు విద్యార్థులు వీడియో తీశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. విద్యార్థిని ప్రవర్తన పట్ల ఇంటర్‌నెట్‌లో చాలా మంది సీరియస్ అయ్యారు. విద్యార్థిని గురుగుబెల్లి వెంకటలక్ష్మీని రఘు ఇంజనీరింగ్ కాలేజీ సస్పెండ్ చేసింది.

విద్యార్థిని.. ఆ ఫోన్ 12వేలు ఇస్తావా? ఇవ్వవా? అంటూ టీచర్‌ని బూతులు తిడుతూ గొడవకు దిగింది. చివరికి ఫోన్ ఇస్తావా? లేదంటే చెప్పుతో కొట్టమంటావా అంటూ టీచర్ పై రెచ్చిపోయింది. దీంతో టీచర్ ఇవ్వను అనేసరికి ఆమెపై చెప్పుతో దాడి చేసింది. ఆ తర్వాత టీచర్ విద్యార్థిని మధ్య గొడవ పెరగడంతో పక్కనే ఉన్న విద్యార్థులు, ఇతర టీచర్లు వారిని విడిపించే ప్రయత్నం చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విద్యార్థిని తీరుపై  నెటిజన్లు మండిపడుతున్నారు.

(Raghu Engineering College | student | teacher | latest-telugu-news | viral-video)

Advertisment
Advertisment
Advertisment