BIG BREAKING: వాహనదారులకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
దేశంలో అతిపెద్ద ప్రైవేట్ ఇంధన రిటైలర్ అయిన నయారా ఎనర్జీ పెట్రోల్, డీజిల్ ధరలు పెంచింది. కంపెనీ పెట్రోల్ ధరను లీటరుకు రూ.5.30, డీజిల్ ధరను లీటరుకు రూ.3 పెంచింది.
దేశంలో అతిపెద్ద ప్రైవేట్ ఇంధన రిటైలర్ అయిన నయారా ఎనర్జీ పెట్రోల్, డీజిల్ ధరలు పెంచింది. కంపెనీ పెట్రోల్ ధరను లీటరుకు రూ.5.30, డీజిల్ ధరను లీటరుకు రూ.3 పెంచింది.
ముఖ టెక్ దిగ్గజం, ఫేస్బుక్ మాతృసంస్థ మెటా మరోసారి భారీ స్థాయిలో ఉద్యోగులను తొలగించింది. సంస్థలోని వివిధ విభాగాల నుంచి సుమారుగా 700 మంది ఉద్యోగులపై వేటు విధించింది. ముఖ్యంగా రియాలిటీ ల్యాబ్స్, సేల్స్, రిక్రూటింగ్, ఫేస్బుక్ విభాగాల్లో లేఆఫ్లు జరిగాయి.
హార్ముజ్ జలసంధిలోని చమురు నౌకలను కాపాడుకునేందుకు ఇండియా రంగంలోకి దిగింది. క్రూడ్ ఆయిల్ సేఫ్టీ కోసం ఇండియన్ నేవి ఆపరేషన్ ఊర్జా సురక్ష ప్రారంభించింది. ఈ ఆపరేషన్ కోసం భారత నౌకాదళం ఐదుకు పైగా అగ్రశ్రేణి యుద్ధనౌకలను రంగంలోకి దించింది.
రైలు ప్రయాణాల్లో ఆహార నాణ్యత అనేది దశాబ్దాలుగా ప్రయాణికులను వేధిస్తున్న సమస్య. అయితే, మోడ్రన్ ఇండియన్ రైల్వేస్ ముఖచిత్రంగా భావించే వందే భారత్ ఎక్స్ప్రెస్ విషయంలో కూడా ఇలాంటి ఫిర్యాదులు రావడం అధికారులను అప్రమత్తం చేసింది.
హర్మూజ్ జలసంధి గుండా భారత నౌకల రాకపోకలకు లైన్ క్లియర్ అయ్యింది. భారత్తో పాటు మరో నాలుగు మిత్ర దేశాలకు చెందిన నౌకలను తమ జలసంధి గుండా అనుమతిస్తున్నట్లు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ సంచలన ప్రకటన చేశారు.
దక్షిణాసియాలో భౌగోళిక ఉద్రిక్తతలు పెరుగుతుండగా హిందూ మహాసముద్రంలో చైనా తన వ్యూహాత్మక ఉనికిని ప్రమాదకరంగా విస్తరిస్తోంది. శాస్త్రీయ పరిశోధనల ముసుగులో అత్యాధునిక నిఘా నౌకలను మోహరిస్తూ భారత్ తీరప్రాంతాలపై కన్నేసింది.
భారత్ తన అవసరాలకు కావాల్సిన LPGలో దాదాపు 60 శాతం గల్ఫ్ దేశాల నుంచే దిగుమతి చేసుకుంటోంది. ప్రస్తుతం హార్ముజ్ జలసంధి మూతపడటంతో వంట గ్యాస్ కొరత ఏర్పడవచ్చనే భయాందోళనలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి.
ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లతో పాటు గేమింగ్, డేటింగ్ యాప్లకు కూడా కేవైసీ తప్పనిసరి కానుంది. ఆన్లైన్ సేఫ్టీ పటిష్టం చేసేందుకు కేంద్ర హోం శాఖ, ఐటీ శాఖ కలిసి ఏర్పాటు చేసిన పార్లమెంటరీ కమిటీ ఈ మేరకు కీలక ప్రతిపాదనలు చేసింది.