Tamilanadu CM: తమిళనాడు తరువాత ముఖ్యమంత్రిగా ఆయనకే జైకొడుతున్న జనం!

తమిళనాడులో ప్రస్తుతం ఎన్నికలు జరిగితే.. సీఎంగా ఎవరిని ఎన్నుకుంటారు? అనే దాని మీద సీ ఓటర్ ఓ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో డీఎంకే అధ్యక్షుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి స్టాలిన్‌ను ఎక్కువ మంది ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటామన్నారు.

New Update
stalin tn

stalin tn

తమిళనాడులో ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్‌ పెడితే  ముఖ్యమంత్రిగా ఎవరిని ఎన్నుకుంటారు? అంటే ఎక్కువ మంది తమిళులు.. డీఎంకే అధినేత, ప్రస్తుత సీఎం ఎంకే స్టాలిన్‌వైపే మొగ్గు చూపుతున్నారు. తర్వాతి స్థానంలో టీవీకే అధ్యక్షుడు, ఇళయ దళపతి విజయ్‌.. ప్రధాన ప్రతిపక్షనేత, మాజీ సీఎం ఎడప్పాడి పళనిసామి ఉన్నారు. ఈ మేరకు సీ ఓటర్స్‌ సంస్థ ప్రజాభిప్రాయసేకరణలో ఈ విషయం తెలిసింది. ప్రస్తుతం తమిళనాడు రాజకీయ పరిస్థితులపై సీ ఓటర్ సర్వే నిర్వహించి, ఫలితాలు వెల్లడించింది. 

Also Read: Ap Weather Report: నేడు 126 మండలాల్లో తీవ్ర వడగాలులు...హెచ్చరికలు జారీ !

ప్రస్తుతం ఎన్నికలు జరిగితే సీఎంగా ఎవరుండాలి? అనే ప్రశ్నకు అత్యధికంగా 27 శాతం మంది స్టాలిన్‌‌ పేరే చెప్పుకొచ్చారు. రెండో స్థానంలో ఉన్న విజయ్‌కు 18 శాతం, ఎడప్పాడి పళనిసామికి 10 శాతం, బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు అన్నామలైకు 9శాతం మంది మద్దతు ఇచ్చినట్లు తెలుస్తుంది. ఈ సర్వే ద్వారా తమిళనాడులో స్టాలిన్‌‌కు తిరుగులేదని రుజువయ్యింది. ఆయన తర్వాత ప్రజాదరణ కలిగిన నేతగా విజయ్‌ ఉన్నారని తెలిసింది.

Also Read: Standup Comedian: తల్లి మీద జోకులు..వివాదంలో స్టాండ్‌ అప్‌ కమెడియన్‌!

డీఎంకే ప్రభుత్వ పనితీరుపై 50 శాతం మందికి పైగా సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది.. ఇందులో 15శాతం మంది అత్యంత సంతృప్తికరంగా ఉందని, 36 శాతం మంది సంతృప్తికరంగా ఉందని చెప్పారు. 25శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేయగా.. 24 శాతం మంది ఏమీ చెప్పలేమని సమాధానం దాటవేశారు. సీఎంగా ఎంకే స్టాలిన్‌ పాలన, పనితీరు ఎలా ఉందనే ప్రశ్నకు... 22 శాతం మంది అత్యంత అద్భుతంగా ఉందని, 33 శాతం మంది సంతృప్తికరంగా ఉందని చెప్పారు. 22 శాతం మంది మాత్రం అసంతృప్తి వ్యక్తం చేశారు. కానీ, 23 శాతం మంది సమాధానం చెప్పడం కష్టమని తెలిపారు. మొత్తంగా చూస్తే స్టాలిన్‌ నాయకత్వంలోని డీఎంకే సర్కారుపై అత్యధికశాతం మంది తమిళులు సంతృప్తి వ్యక్తం చేయడం గమనార్హం.

అయితే, రాష్ట్రంలో ప్రస్తుత ముఖ్యమైన సమస్యల విషయానికి వస్తే.. 15 శాతం మంది మహిళల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మహిళల భద్రతకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇవ్వాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. దీంతో నిత్యావసర ధరలు భారీగా పెరిగాయని 12 శాతం, మాదక ద్రవ్యాల సమస్య ఎక్కువగా ఉందని 10 శాతం, నిరుద్యోగ సమస్యపై 8 శాతం మంది తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఇక, నియోజకవర్గాల విషయానికి వస్తే ఎమ్మెల్యే పనితీరుపై అడిగిన ప్రశ్నకు 16శాతం మంది మాత్రమే సంతృప్తి చెందారు. కాగా, తమిళనాడు శాసనసభకు మరో ఏడాదిలో ఎన్నికలు జరగనున్నాయి. వచ్చే మార్చి- ఏప్రిల్‌లో అక్కడ ఎన్నికలు జరుగుతాయి.

Also Read: Ugadi: ఉగాది పండుగ అసలు ఎందుకు జరుపుకుంటారు? ఉగాది పచ్చడికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి?

Also Read:  Telangana Rain Alert: మండుతున్న ఎండల్లో చల్లటి కబురు చెప్పిన వాతావరణ శాఖ..రానున్న మూడు రోజుల పాటు వానలే వానలు!

tamilanadu | dmk | dmk-party | stalin | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates | elections | survey 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

UPI: నిలిచిపోయిన యూపీఐ సేవలు...ఇబ్బందుల్లో వినియోగదారులు

ఈ మధ్య తరుచుగా యూపీఐ సేవల్లో అంతరాయం ఏర్పడుతోంది. ఈరోజు మళ్ళీ దేశ వ్యాప్తంగా యూపీఐ సేవలు నిలిచిపోయాయి. గూగుల్ పే,పేటీఎం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూపీఐ యాప్స్ పనిచేయకపోవడంతో   కస్టమర్లు ఇబ్బందిపడ్డారు. 

New Update
hdfc

UPI

ఈరోజు మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఏ యూపీఐ సేవా పని చేయలేదు. అసలు ఏ ట్రాన్సాక్షన్స్ పని చేయలేదు. రీసెంట్ గా మార్చి 26న యూపీఐ ట్రాన్సక్షన్స్ లో ఇదే సమస్య రాగా మళ్లీ ఇవాళ అదే సమస్య రావడంతో కస్టమర్లు మండిపడుతున్నారు. స్క్రీన్ షాట్లు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. గూగుల్ పే,పేటీఎం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూపీఐ యాప్స్ పనిచేయకపోవడంతో   కస్టమర్లు ఇబ్బందిపడ్డారు. ట్రాకింగ్ వెబ్‌సైట్ ప్రకారం ఏప్రిల్ 2న  రాత్రి 8 గంటల వరకూ యూపీఐ పని చేయడం లేదని 449 ఫిర్యాదులు నమోదయ్యాయి.

కారణం తెలియ లేదు..

యూపీఐ సేవల్లో 64 శాతం మనీ ట్రాన్స్ ఫర్, 28 శాతం పేమెంట్స్, 8 శాతం యాప్ సమమస్యలు తలెత్తాయి. అలాగే ఎస్బీఐలో 57 శాతం కస్టమర్లు మనీ ట్రాన్సక్షన్ జరపడంలో ఇబ్బంది వచ్చిందని కంప్లైంట్ ఇచ్చారు. 34 శాతం మొబైల్ బ్యాంకింగ్ సమస్యలను ఎదుర్కున్నామని చెప్పారు. అయితే  డిజిటల్ పేమెంట్స్ నిలిచిపోవడానికి కారణమేంటని అనేది మాత్రం తెలియలేదు.  దీనిపై సంబంధిత బ్యాంకులు కానీ, యాప్స్ కానీ ఏమీ ప్రకటన చేయలేదు. నేషనల్ కార్పొరేట్ ఆఫ్ ఇండియా ఎలాంటి అధికారిక ప్రకటన కూడా విడుదల చేయలేదు.  

 today-latest-news-in-telugu | upi

Also Read: RCB VS GT: లివింగ్ స్టోన్ మెరుపులు..గుజరాత్ టైటాన్స్ టార్గెల్ 170

Advertisment
Advertisment
Advertisment