/rtv/media/media_files/2025/04/13/43DwHnKQfACUBlnCIaQS.jpg)
Russia Attacks On Indian Medicine Warehouse
ఉక్రెయిన్ రాజధాని కీవ్ లోని ఇండియన్ డ్రగ్ కంపెనీ గోడౌన్ పై శనివారం రష్యా దాడి చేసింది. కుసుమ్ అనే కంపెనీకి చెందిన స్టోరేజ్ పై దాడి జరిగిందని ఢిల్లీలోని ఉక్రెయిన్ రాయబార కార్యాలయం తెలిపింది. రష్యా కవాలానే భారతీయ కంపెనీల మీద దాడులు చేస్తోందని ఆరోపించింది. ఉక్రెయిన్ కు నష్టం జరగాలంటే అక్కడ ప్రజలకు అవసరమైన వాటి కొరత తీసుకురావాలని రష్యా భావిస్తోంది. అందుకే పిల్లలు, వృద్ధుల కోసం మందులు నిల్వ చేసే గోడౌన్స్ పై రష్యా దాడులు చేస్తోందని ఉక్రెయిన్ రాయబార కార్యాలయం విమర్శించింది. భారత్ తో స్నేహం ఉందని చెప్పే రష్యా ఇలా టార్గెట్ చేసి మరీ ఎందుకు దాడులు చేస్తోందని ప్రశ్నించింది.
Also Read : ముంబై ఎయిర్పోర్టులో భారీగా బంగారం పట్టివేత.. మొత్తం ఎన్ని కిలోలంటే?
ఈ దాడిని ఉక్రెయిన్ లోని బ్రిటన్ రాయబారి మార్టిన్ హారిస్ కూడా ధృవీకరించారు. రష్యా డ్రోన్ల దాడిలో ఔషధాల గోదాము పూర్తిగా ధ్వంసమైందని తెలిపారు. కుసేమ్ హెల్త్ కేర్ ఉక్రెయిన్ తో పాటూ 29 దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది.
Also Read : అర్థరాత్రి ఆలయం తెరవాలంటూ..పూజారి పై దాడి!
Russia Attacks On Indian Companies
Today, a Russian missile struck the warehouse of Indian pharmaceutical company Kusum in Ukraine.
— UKR Embassy in India (@UkrembInd) April 12, 2025
While claiming “special friendship” with India, Moscow deliberately targets Indian businesses — destroying medicines meant for children and the elderly.#russiaIsATerroristState https://t.co/AW2JMKulst
today-latest-news-in-telugu | russia | ukraine | indian | medicine
Also Read: Cricket: వన్డేల్లో కీలక మార్పు..ఒక బంతితోనే..
Also Read : ఆల్కహాల్తో మెదడుకు పొంచిఉన్న ముప్పు
international news in telugu | today-news-in-telugu | latest-telugu-news | breaking news in telugu | telugu-news