Trump Tarrifs: అసలైన ప్రమాదం ముందుంది: జేపీ మోర్గాన్‌!

ట్రంప్‌ అమల్లోకి తీసుకుని వచ్చిన ప్రతీకార సుంకాలు దేశ భవిష్యత్తు పై పెను ప్రభావం చూపుతాయని ప్రముఖ బహుళజాతి ఆర్థిక సేవల సంస్థ జేపీ మోర్గాన్‌ అంచనా వేసింది. 1.3 శాతం గా ఉన్న జీడీపీ మైనస్‌0.3 శాతానికి పడిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది.

New Update
morgan

morgan

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ అమల్లోకి తీసుకుని వచ్చిన ప్రతీకార సుంకాలు దేశ భవిష్యత్తు పై పెను ప్రభావం చూపుతాయని ప్రముఖ బహుళజాతి ఆర్థిక సేవల సంస్థ జేపీ మోర్గాన్‌ అంచనా వేసింది. 1.3 శాతం గా ఉన్న జీడీపీ మైనస్‌0.3 శాతానికి పడిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది.ఫలితంగా అగ్రరాజ్యంలో ఈ ఏడాదే ఆర్థిక మాంద్యం తలెత్తే ప్రమాదం ఉందని అభిప్రాయపడింది.

Also Read: Kerala: మీరు సరిగా పని చేయడం లేదు..కుక్కల్లాగా నడవండి..ఉద్యోగులకు వేధింపులు!

అమెరికా స్థూల దేశీయోత్పత్తి పై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందని జేపీ మోర్గాన్‌ కు చెందిన ఆర్థిక వేత్త మైఖేల్‌ ఫెరోలి వెల్లడించారు. ప్రపంచ దేశాల పై ట్రంప్‌ విధించిన ప్రతీకార సుంకాలే ఇందుకు ప్రధాన కారణమని ,ఆర్థిక మాంద్యంతో అమెరికాలో నిరుద్యోగ రేటు 5.3 శాతానికి పెరగనుందని ఆయన అంచనా వేశారు.

Also Read: Rain Alert: మళ్లీ వర్షాలు.. ఈ జిల్లాల వాసులకు హెచ్చరికలు!

JP Morgan Predicts Recession In US

కార్మిక విభాగ నివేదికల ప్రకారం మార్చిలో నిరుద్యోగ రేటు 4.2 శాతంగా ఉన్నట్లు తెలిపారు. మార్చిలో ఉద్యోగ నియామకాలు బలంగా ఉన్నప్పటికీ ప్రతీకార సుంకాల ప్రభావంతో క్రమంగా తగ్గే ప్రమాదం ఉందని ఆర్థిక వేత్తల అంచనా.రాబోయే రోజుల్లో నిత్యావసర ధరలు పెరగడం సహా వృద్ధి రేటు మందగిస్తుందని వారు అభిప్రాయపడ్డారు. ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు వడ్డీ రేట్లను ఫెడ్‌ తగ్గించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

ప్రపంచ దేశాల నుంచి అమెరికాకు దిగుమతయ్యే వస్తువులు 20 శాతం కంటే ఎక్కువగానే తగ్గనున్నట్లు మరో ఆర్థిక వేత్త జోనాథన్‌ పింగిల్‌ అంచనా వేశారు.రాబోయే త్రైమాసికాల్లో అమెరికా జీడీపీలో దిగుమతులు 1986 ముందు స్థాయిలకు తగ్గే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. భారత్‌ సహా అన్ని ప్రపంచ దేశాల పై ప్రతీకార సుంకాలతో విరుచుకుపడ్డారు ట్రంప్‌.దీంతో స్టాక్‌ మార్కెట్లు కుదేలయ్యాయి.అమెరికాతో పాటు అన్ని ప్రధాన మార్కెట్లు పతనమవుతున్నాయి.

ప్రస్తుత సుంకాల పరిణామాలను ఆర్థికవిప్లవంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ పేర్కొన్నారు. ఇది సవాళ్లతో కూడుకున్నదని ,చివరకు విజయం తమదేనని స్పష్టం చేశారు. అమెరికాతో పోలిస్తే చైనాకు పెద్దదెబ్బ తగిలింది. చైనాతో పాటు అనేక ఇతర దేశాలు మనతో అన్యాయంగా వ్యవహరించాయి. మనం మౌనంగా , నిస్పహాయంగా మిగిలిపోయాం. ఇక పై ఆ పరిస్థితి ఉండదు.

ఉద్యోగాలు,వ్యాపారాలను గతంలో ఎన్నడూ లేని విధంగా తిరిగి తీసుకొస్తున్నాం.ఇప్పటికే 5 ట్రిలియన్‌ డాలర్లకు పైగా పెట్టుబడులు సాధించాం. ఇదొక ఆర్థిక విప్లవం.ఇందులో మనం విజయం సాధిస్తాం. అయితే..ఇదేమీ అంత సులభం కాదు.కానీ తుది ఫలితం చరిత్మాత్రకంగా ఉంటుంది అని ట్రూత్‌ సోషల్‌ వేదికగా ట్రంప్‌ పేర్కొన్నారు.

ట్రంప్‌ విధిస్తున్న సుంకాలు అమెరికాకు మేలు చేస్తాయని తాను భావించడం లేదని మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా పేర్కొన్నారు.

Also Read: Ukraine: పేరుకే అగ్రరాజ్యం..చేసేవన్నీ బలహీనమైన పనులే..అమెరికాపై జెలెన్ స్కీ విమర్శలు

Also Read: Musk: యూఎస్‌-యూరప్‌ ల మధ్య సుంకాలుండవు..మస్క్‌ సంచలన వ్యాఖ్యలు!

 

latest telugu news updates | latest-telugu-news | telugu-news | tarriffs | america | jp morgan | trump tariffs | today-news-in-telugu | donald-trump | breaking news in telugu | international news in telugu

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

USA: యాపిల్ కు అండగా ట్రంప్..సుంకాల నుంచి ఫోన్లు, కంప్యూటర్లు మినహాయింపు

సుంకాల విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రతీకార సుంకాల నుంచి స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లు, సెమీ కండక్టర్లను మినహాయించారు.  దీనికి సంబంధించి అమెరికా కస్టమ్స్‌ అండ్‌ బోర్డర్‌ ప్రొటెక్షన్‌ తాజాగా మార్గదర్శకాలను జారీ చేసింది.

New Update
iPHONE 16 Trump Tariffs

iPHONE 16 Trump Tariffs Photograph: (iPHONE 16 Trump Tariffs)

గత పది రోజులుగా ప్రపంచం మొత్తం టారీఫ్ ల వార్ తో దడదడలాడిపోతోంది. టారీఫ్ లతో దాదాపు అన్ని దేశాలనూ బెంబేలెత్తించారు. అయితే రెండు రోజు క్రితం ఈ సుంకాలకు 90 రోజుల బ్రేక్ ను కల్పిస్తూ అనౌన్స్ చేశారు. మళ్ళీ ఇందులో చైనాను మాత్రం కలపలేదు. దీంతో మిగతా దేశాలన్నీ కాస్త ఊపిరి పీల్చుకున్నా చైనాతో మాత్రం ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. అయితే తాజాగా సుంకాల విషయంలో మరో కీలక నిర్ణయం ప్రకటించింది అమెరికా. 

ఫోన్లు, కంప్యూటర్ల మీద..

అమెరికా మీద చైనా 125 శాతం, అమెరికా 145 శాతం సుంకాలను విధించుకుంటున్నాయి. దీంతో ఇరు దేశాల మధ్య వాణిజ్య యుద్ధం నడుస్తోంది. ఈ క్రమంలో చైనా నుంచి వచ్చే అన్ని ఉత్పత్తుల మీద 145 ఉంటాయి కానీ స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్ల మీద కాదంటూ ఒక కీలక ప్రకటన చేశారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. స్మార్ట్‌ఫోన్లు, కంప్యూటర్లు, హార్డ్‌ డ్రైవ్‌లు, కంప్యూటర్‌ ప్రాసెసర్లు, మెమొరీ చిప్‌లు, సెమీ కండక్టర్లు, సోలార్‌ సెల్స్‌, ఫ్లాట్‌ టీవీ డిస్‌ప్లేలు వంటి వాటిని ఈ ప్రతీకార సుంకాల నుంచి మినహాయింపు పొందుతాయి. అమెరికాకు చెందిన యాపిల్ సంస్థకు సంబంధించి ప్రోడక్ట్స్ ఎక్కువ శాతం చైనా నుంచే వస్తాయి. 

యాపిల్ కంపెనీకి ఊరట..

సుంకాల పెంచడంతో స్మార్ట్ ఫోన్లు, యాపిల్ ఫోన్లు ధరలు పెరుగుతాయని వినియోగదారుల్లో ఆందోళన పెరిగింది. దీంతో ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల కోసం అమెరికా వాసులు స్టోర్లకు కూడా పరుగెత్తారు. కానీ ఇప్పుడు అమెరికా కస్టమ్స్‌ అండ్‌ బోర్డర్‌ ప్రొటెక్షన్‌ తాజాగా జారీ చేసిన మార్గదర్శకాలతో అందరూ ఊపిరి పీల్చుకుంటున్నారు. నిజానికి ప్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్ల ఉత్పత్తుల మీద ప్రతీకార సుంకాలను పెంచాలంటే అవన్నీ అమెరికాలోనే తయారు చేయాలి. కానీ అక్కడ ఇవి చాలా తక్కువగా ఉన్నాయి. ఇప్పుడు ఉన్నట్టుండి తయారీ కంపెనీలను పెట్టడం కూడా  కుదరదు.  దీనికి కొన్నేళ్ళు సమయం పడుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. అమెరికా సుంకాల నిర్ణయంతో అత్యధికంగా నష్టపోయిన యాపిల్ కంపెనీ...ఇప్పుడు తాజా నిర్ణయంతో హమ్మయ్య అనుకుంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.

 today-latest-news-in-telugu | usa | china | trump tariffs | apple | i-phone

Also Read: SRH VS PBKS: ఉప్పల్‌లో కొడితే తుప్పల్లో పడింది భయ్యా.. సన్‌రైజర్స్ ముందు భారీ టార్గెట్

 

Advertisment
Advertisment
Advertisment