USA: హెచ్ 1బీ వీసా, గ్రీన్ కార్డ్..నిత్యం ఉంచుకోవాల్సిందే..వలసదారులకు స్ట్రిక్ట్ రూల్స్

అమెరికాలో వలసదారులపై మరిన్ని కఠిన నియమాలు అమల్లోకి వచ్చాయి. దీని ప్రకారం హెచ్ 1 బీ వీసాలు అయినా, గ్రీన్ కార్డ్ లు అయినా ఎప్పుడూ వెంట ఉంచుకోవాలి. అక్రమవలదారులను నియంత్రించేందుకు అమలు చేస్తున్న ఈ రూల్ కు అక్కడి కోర్టు కూడా అనుమతి ఇచ్చింది. 

New Update
usa

H!-B Visa

అమెరికాలో ట్రంప్ ప్రభుత్వం రోజురోజుకూ మితిమీరిన రూల్స్ ను పెడుతోంది. తాజాగా మరో స్ట్రిక్ట్ రూల్ ను అమల్లోకి తీసుకువచ్చింది. దీని ప్రకారం అమెరికా వచ్చిన ఏ దేశస్థుడు అయినా తమ వీసాలు లేదా గ్రీన్ కార్డులను 24 గంటలు తమ వద్దనే ఉంచుకోవాలని చెప్పింది. ఈ నియమం ఏప్రిల్ 11 నుంచి అమల్లోకి వచ్చింది. అమెరికా ప్రజలను రక్షించడమే లక్ష్యంగా పెట్టుకున్న అధ్యక్షుడు ట్రంప్  ఈ నిర్ణయాన్ని తీసుకువచ్చారని చెబుతున్నారు. ఈ వివాదాస్పద నిర్ణయానికి అమెరికా కోర్టు కూడా అనుమతి ఇచ్చింది. ఈ కొత్త రూల్ ప్రకారం అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న వలసదారులు ప్రభుత్వంలో నమోదు చేసుకోవాలి మరియు వారి వద్ద పత్రాలను ఉంచుకోవాలి. 

Also Read :  ప్రవీణ్ ది ముమ్మాటికీ హత్యే.. ప్రూఫ్స్ ఇవే.. హర్షకుమార్ సంచలన వీడియో!

అమెరికాలో అక్రమవలసదారులను అరికట్టడానికి ట్రంప్ ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. దీని గురించి ముందుగా ఏమీ చెప్పలేదు కానీ నిర్ణయాన్ని మాత్రం అమల్లో పెట్టేసింది. అమెరికాలో చట్టాలా ప్రకారం దేశంలోకి అడుగు పెట్టిన ప్రతీవారు తప్పనిసరిగా రిజిస్టర్ చేసుకోవాలి. కానీ ఇంతకు ముందు అంతా ఈ రూల్ ను కఠినంగా అమలు చేయకపోవడం వలన చాలా మంది వలసదారులు వచ్చేశారని అధికారులు చెబుతున్నారు. ఇప్పుడు దానిని అరికట్టడానికే రిజిస్ట్రేషన్  ప్రక్రియను తప్పనిసరి చేయడమే కాకుండా..పత్రాలను కూడా వెంట తీసుకెళ్ళాలని చెబుతున్నామని వివరించారు.  అయితే ఈ కొత్త నియమం అమెరికాలో చట్టవిరుద్ధంగా లేదా నకిలీ పత్రాలతో నివసిస్తున్న వారిని మాత్రమే ప్రభావితం చేస్తుంది. దీంతో పాటూ 14 ఏళ్లు పైబడిన వారు మరియు 30 రోజులు లేదా అంతకంటే ఎక్కువ కాలం అమెరికాలో ఉన్నవారు, ఫారం G-325R నింపడం ద్వారా ప్రభుత్వంలో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి. 14 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉంటే, అతని/ఆమె తల్లిదండ్రులు అతని/ఆమెను నమోదు చేసుకోవాలి. అలా చేయకపోతే జరిమానా లేదా జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. 

Also Read :  ఏపీలో విషాదం..ముగ్గురు విద్యార్థుల ఆత్మహత్యలు!

Also Read :  ఆ స్టార్ హీరో కుమారుడితో అనుపమ డేటింగ్.. నెట్టింట దర్శనమిస్తున్న ఫొటో?

H-1B వీసా మరియు గ్రీన్ కార్డ్ హోల్డర్లకు ..

అయితే, H-1B వర్క్ వీసా, స్టూడెంట్ వీసా (F1 మొదలైనవి) లేదా గ్రీన్ కార్డ్ వంటి చెల్లుబాటు అయ్యే వీసా ఉన్నవారు మళ్ళీ ఫారమ్ G-325R నింపాల్సిన అవసరం లేదు. వారు ఇప్పటికే రిజిస్టర్ చేయబడి ఉంటారు కనుక ఈ రిజిస్టర్ ప్రక్రియ వారికి మినహాయించబడింది. అయితే, వారు తమ చెల్లుబాటు అయ్యే పత్రాలను (వీసా, పాస్‌పోర్ట్, I-94, గ్రీన్ కార్డ్ మొదలైనవి) ఎల్లప్పుడూ తమ వద్ద ఉంచుకోవాలి మరియు US ప్రభుత్వ అధికారులు కోరినప్పుడల్లా ఈ పత్రాలను సమర్పించాలి. 

Also Read: TS: సలేశ్వరానికి వేలల్లో భక్తులు..శ్రీశైలం హైవేపై ట్రాఫిక్ జామ్

 

h1b visa | new-rule | usa | today-latest-news-in-telugu | today-news-in-telugu | breaking news in telugu | telugu-news | international news in telugu | donald-trump

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు
తదుపరి కథనాన్ని చదవండి

Pak: భారత్ పై మరోసారి అక్కసు వెళ్లగక్కిన పాక్‌ సైన్యాధిపతి!

పాక్‌ నేతలు భారత్‌ పై విషం చిమ్ముతూనే ఉన్నారు.పాక్‌ సైన్యాధిపతి ఆసిం మునీర్‌ మరోసారి భారత్‌ పై అక్కసు వెళ్లగక్కారు.రెండు దేశాల సిద్ధాంతాన్ని ప్రస్తావించిన ఆయన..అన్ని అంశాల్లో హిందూ,ముస్లింలు వేర్వేరు అని వ్యాఖ్యానించారు.

New Update
 Pakistan army chief Asim Munir

Pakistan army chief Asim Munir

పహల్గాం ఉగ్రదాడిలో పాకిస్థాన్‌ పాత్ర ఉందని పేర్కొన్న భారత్‌..దాయాది దేశం పై చర్యలకు ఉపక్రమించిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో పాక్‌ నేతలు భారత్‌ పై విషం చిమ్ముతూనే ఉన్నారు.పాక్‌ సైన్యాధిపతి ఆసిం మునీర్‌ మరోసారి భారత్‌ పై అక్కసు వెళ్లగక్కారు.

Also Read: Russia-Ukrain-Putin: ఉక్రెయిన్‌ తో చర్చల పునరుద్దరణకు రెడీ..!

రెండు దేశాల సిద్ధాంతాన్ని ప్రస్తావించిన ఆయన..అన్ని అంశాల్లో హిందూ,ముస్లింలు వేర్వేరు అని వ్యాఖ్యానించారు.మతంఆచారాలు,సంప్రదాయాలు, ఆలోచనలు,ఆకాంక్షల్లో హిందూ ,ముస్లింలు వేర్వేరు.వీటి ఆధారంగానే రెండు దేశాలు ఉండాలనే భావన ఏర్పడింది.పాకిస్తాన్‌ ఏర్పాటుకు పూర్వీకులు ఎన్నో త్యాగాలు చేశారు.

Also Read: BIG BREAKING: భారత్-పాకిస్థాన్ యుద్ధం డేట్‌ ఫిక్స్‌..! పాక్ మాజీ హైకమిషనర్‌ సంచలన కామెంట్స్‌

వాటిని ఎలా కాపాడుకోవాలో మనకు తెలుసు అని పాక్‌ ఆర్మీ చీఫ్‌ ఆసిం మునీర్‌ పేర్కొన్నారు. ఖైబర్‌ పఖ్తుంఖ్వాలోని పాక్‌ మిలిటరీ అకాడమీ పాసింగ్‌ ఔట్‌ పరేడ్‌ లో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.అంతకు ముందు ప్రవాస పాకిస్థానీల తొలి సదస్సులోనూ మునీర్‌ ఇదే విధంగా మాట్లాడారు.

మనది ఒక దేశం కాదని,రెండు దేశాలన్నారు.కశ్మీర్‌ తమ జీవనాడి లాంటిదని వ్యాఖ్యానిచారు.ఇలా మాట్లాడిన కొన్ని రోజుల్లోనే పహల్గాంలో ముష్కరులు పాశవిక దాడులకు పాల్పడ్డారు.


జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన హిందువుల ఊచకోత తర్వాత, భారత్ .. పాకిస్తాన్‌పై కఠిన చర్యలు తీసుకుంది. సింధూ జల ఒప్పందాన్ని తక్షణమే నిలిపివేయడం, పాకిస్తాన్ హైకమిషన్‌లో దౌత్యవేత్తల సంఖ్యను తగ్గించడం, అట్టారి-వాఘా సరిహద్దును మూసివేయడం వంటి కఠినమైన నిర్ణయాలు తీసుకుంది. ఇవి పాకిస్తాన్‌లో భయాందోళనలను సృష్టించింది. ఏ క్షణమైనా భారత్ తో యుద్దం సంభవించవచ్చనని భావించిన పాక్.. భయపడిపోయి చైనాను ఆశ్రయించి సహాయం కోసం విజ్ఞప్తి చేసింది.

పాకిస్తాన్ ఉప ప్రధాన మంత్రి, విదేశాంగ మంత్రి మహ్మద్ ఇషాక్ దార్ ఇస్లామాబాద్‌లో చైనా రాయబారి జియాంగ్ జెతో సమావేశమయ్యారు. తాజా పరిస్థితులను ఆయనకు వివరించారు.  ఒకవేళ భారత్ తో యుద్దం సంభవిస్తే సహాయం చేయాలని కోరారు.  అందుకు చైనా కూడా హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. 

మరోవైపు పాకిస్తాన్ యుద్ధానికి సిద్ధంగా ఉందని ఇప్పటికే ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్ వెల్లడించారు.  భారత్ తమపై ఎటువంటి ఆధారాలు లేకుండా తప్పుడు ఆరోపణలు చేస్తోందని అన్నారు. ఉగ్రవాద దాడిపై నిష్పాక్షిక దర్యాప్తుకు సిద్ధంగా ఉందని ఆయన పేర్కొన్నారు. 

పహల్గాం ఘటనతో మా దేశానికి ఎలాంటి సంబంధం లేదు. అయినా భారత్‌ మమ్మల్ని నిందిస్తోంది.ఈ దాడి పై ఇప్పటి వరకు ఎలాంటి దర్యాప్తు జరిగినట్లు కనిపించడం లేదు. ఒక వేళ దర్యాప్తు జరిగితే సహకరించేందుకు పాక్‌ సిద్ధంగా ఉంటుంది. అయితే అంతర్జాతీయంగా విచారణ జరగాలని మేం కోరుకుంటున్నాం అని ఆయన పేర్కొన్నారు. కాగా ఏప్రిల్ 22న జరిగిన ఈ ఊచకోతలో, 25 మంది భారతీయులు, ఒక నేపాలీ పౌరుడిని ఉగ్రవాదులు చంపేశారు.

Also Read:Mohan Bhagwat: 'పాకిస్తాన్ తప్పు చేసింది'.. ఉగ్రదాడిపై RSS చీఫ్ సంచలన వ్యాఖ్యలు

Also Read: BIG BREAKING: భారత్-పాకిస్థాన్ యుద్ధం డేట్‌ ఫిక్స్‌..! పాక్ మాజీ హైకమిషనర్‌ సంచలన కామెంట్స్‌

pak | army | chief | Asim Munir | bharat | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates

Advertisment
Advertisment
Advertisment