Chandrayaan-3: ''వెల్కమ్‌ బడ్డీ''..విక్రమ్‌ కి స్వాగతం చెప్పిన ప్రదాన్‌!

ఇస్రో ఓ ఆసక్తి కరమైన విషయాన్ని ప్రజలతో పంచుకుంది. చంద్రయాన్‌ 2 కు చెందిన ఆర్బిటార్‌ ప్రదాన్‌ ప్రస్తుతం కక్ష్యలోనే తిరుగుతున్న విషయం తెలిసిందే. ఆ ఆర్బిటార్..విక్రమ్‌ కు వెల్కమ్‌ చెప్పింది. ఈ విషయం గురించి ఇస్రో తన ట్విట్టర్‌ లో పేర్కొంది. ''వెల్కమ్‌ బడ్డీ'' అంటూ ఆ మెసేజ్‌ లో పోస్టు చేశారు.

New Update
Chandrayaan-3: ''వెల్కమ్‌ బడ్డీ''..విక్రమ్‌ కి స్వాగతం చెప్పిన ప్రదాన్‌!

Chandrayaan-2 orbiter welcomes Chandrayaan-3: భారతదేశం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్‌ చంద్రయాన్ -3. దీని గురించి యావత్‌ భారతదేశం ఎంతో గర్వంగా ఉంది. రష్యా లూనా కుప్పకూలిన తరువాత ప్రపంచం మొత్తం ఇప్పుడు చంద్రయాన్ 3 మీదే దృష్టి పెట్టింది. చంద్రయాన్‌ 3 మిషన్‌ లో భాగంగా వెళ్లిన విక్రమ్‌ ల్యాండర్‌ (Vikram Lander)చంద్రుని ఉపరితలానికి అతి చేరువలో ఉంది.

బుధవారం సాయంత్రానికి చంద్రుని పై ఆ ల్యాండర్‌ దిగుతుంది. ఈ క్రమంలో ఇస్రో (ISRO) ఓ ఆసక్తి కరమైన విషయాన్ని ప్రజలతో పంచుకుంది. చంద్రయాన్‌ 2 (Chandrayaan-2) కు చెందిన ఆర్బిటార్‌ ప్రదాన్‌ ప్రస్తుతం కక్ష్యలోనే తిరుగుతున్న విషయం తెలిసిందే. ఆ ఆర్బిటార్..విక్రమ్‌ కు వెల్కమ్‌ చెప్పింది.


ఈ విషయం గురించి ఇస్రో తన ట్విట్టర్‌ లో పేర్కొంది. ''వెల్కమ్‌ బడ్డీ'' అంటూ ఆ మెసేజ్‌ లో పోస్టు చేశారు. చంద్ర‌యాన్‌-2 ఆర్బిటార్‌, చంద్ర‌యాన్‌-3 ల్యాండ‌ర్‌తో టూ వే క‌మ్యూనికేష‌న్ ఏర్పాటు చేసిన‌ట్లు ఇస్రో తెలిపింది. ఆగ‌స్టు 23వ తేదీన సాయంత్రం 5.20 నిమిషాల నుంచి విక్ర‌మ్ ల్యాండింగ్‌పై లైవ్ టెలికాస్ట్ ఉంటుంద‌ని ఇస్రో వెల్ల‌డించింది.

ఆగస్టు 21న చంద్రయాన్ 3 ల్యాండర్‌ మాడ్యూల్‌ లోని ల్యాండర్‌ హజార్డ్‌ డిటెక్షన్‌, అవాయిడెన్స్‌ కెమెరా తో తీసిన కొన్ని చంద్రుని చిత్రాలను ఇస్రో పంచుకుంది. ఈ కెమెరా చంద్రుని మీద ఉన్న సురక్షితమైన ల్యాండింగ్ ప్రాంతాన్ని గుర్తించడంలో చంద్రయాన్‌ 3 కి సహాయం చేయనున్నట్లు తెలుస్తుంది. అంతే కాకుండా బండరాళ్లు లేని ల్యాండింగ్‌ ప్రాంతం కోసం వెతకడానికి కెమెరా సాయపడనున్నట్లు ఇస్రో పేర్కొంది.

ఆగస్టు 17న, ల్యాండర్ మాడ్యూల్, ప్రొపల్షన్ మాడ్యూల్ రెండు కూడా విడిపోయాయి.ప్రొపల్షన్‌ మాడ్యూల్ మిషన్‌ జీవితం సుమారు మూడు నుంచి ఆరు నెలలు వరకు ఉండగా, ల్యాండర్‌ మ్యాడుల్‌ 14 ఎర్త్ డేస్‌ లేదా ఒక లూనార్‌ డే మాత్రమే పని చేస్తుందని ఇస్రో శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ప్రొపల్షన్ మాడ్యూల్ చంద్ర కక్ష్యలో ఒక సంవత్సరం వరకు తన ప్రయాణాన్ని కొనసాగించవచ్చని ISRO ఆగస్టు 17న ట్విట్టర్‌ లో రాసింది.

చంద్రుని దక్షిణ ధ్రువంపై చంద్రయాన్-3 విజయవంతంగా ల్యాండ్ అయినట్లయితే, చంద్రుని దక్షిణ ధ్రువంపై అంతరిక్ష నౌకను ల్యాండ్ చేసిన మొదటి దేశంగా భారతదేశం అవుతుంది.

Also Read: చంద్రయాన్‌ గెలిచింది..రష్యా ఓడింది.. ఇది ఇండియా గెలుపే బాసూ!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

India: పాకిస్తానీయులకు ముగిసిన డెడ్ లైన్..537 మంది వెనక్కు..

టెంపరరీ వీసాలతో భారత్ కు వచ్చిన పాక్ పౌరులకు భారత ప్రభుత్వం ఇచ్చిన గడువు ఈ రోజు తో ముగిసింది. దీంతో ఇప్పటి వరకు 537 మంది అట్టారీ-వాఘా సరిహద్దు మార్గంలో పాకిస్థాన్‌కు వెళ్ళారని తెలుస్తోంది. వీరిలో తొమ్మది మంది దౌత్య వేత్తలు, అధికారులు ఉన్నారు.

New Update
pak

Pakistan People

పాకిస్తానీయులు ఇండియాలో ఉండటంపై భారత ప్రభుత్వం సీరియస్ గా ఉంది. పహల్గామ్ లో దాడి జరిగిన తర్వాత పాక్ పౌరులు తమ దేశం నుంచి వెళ్ళిపోవాలని ఆదేశాలను జారీ చేసింది. ఏప్రిల్ 24న ఈ ఉత్తర్వులను ఇచ్చింది. దీంతో పాకిస్తానీయులు దేశం విడిచి వెళ్ళడం ప్రారంభించారు. ఇప్పటివరకు నాలుగు రోజుల్లో 537 మంది అట్టారీ-వాఘా సరిహద్దు మార్గంలో పాకిస్థాన్‌కు  వెళ్లిపోయినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఒక్క ఆదివారం రోజునే 287 మంది వెళ్ళారని సమాచారం . ఇందులో తొమ్మిది మంది దౌత్యవేత్తలు, అధికారులు ఉన్నట్లు చెప్పారు. కొంతమంది ఫ్లైట్స్ ద్వారా వెళ్ళారని..అయితే నేరుగా పాక్ కు విమాన సర్వీసులు లేవు కాబట్టి..ఇతర దేశాలకు వెళ్ళి అక్కడ నుంచి వెళ్ళిపోయి ఉండవచ్చని చెప్పారు. ఇదే సరిహద్దు ద్వారా 850 మంది భారతీయులు పాకిస్థాన్‌ నుంచి స్వదేశానికి తిరిగి వచ్చినట్లు చెప్పారు.

మూడు లక్ష జరిమానా..

పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్‌లో ఉంటున్న పాకిస్థానీయులను నిర్ణీత గడువులోగా వెళ్లిపోవాలని కేంద్రం ఆదేశించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ ఆదేశాలు ఉల్లంఘించి ఎవరైనా గడువు దాటినా కూడా ఇంకా భారత్‌లోనే ఉంటే చట్టం ప్రకారం వాళ్లని అరెస్టు చేయవచ్చు. దీనిపై దర్యాప్తు చేపట్టి.. మూడేళ్ల వరకు జైలు శిక్ష లేదా రూ.3 లక్షల జరిమానా, లేదా రెండు విధించే ఛాన్స్ కూడా ఉంటుంది.  సార్క్‌ వీసాల కింద ఇండియాలో ఉంటున్న పాకిస్థానీయులు ఏప్రిల్ 26లోగా దేశం విడిచి వెళ్లిపోవాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే మెడికల్ వీసాల కింద వచ్చినవాళ్లకు మాత్రం ఏప్రిల్ 29 వరకు గడువు ఇచ్చింది. స్టూడెంట్, బిజినెస్, విజిటర్ తదితర 12 విభాగాల్లో వీసాలు ఉన్నవాళ్లు మాత్రం ఏప్రిల్ 27 నాటికి వెళ్లిపోవాలని ఆదేశించింది. ఏప్రిల్ 4 నుంచి ఇమిగ్రేషన్ అండ్ ఫారినర్స్‌ యాక్ట్‌-2025 అమల్లోకి వచ్చింది. 

 today-latest-news-in-telugu | india | pakistan 


Also Read: Sitakka: నీ బిడ్డ కార్లలో తిరిగితే.. మా ఆడబిడ్డలు బస్సులో కూడా తిరగొద్దా?: కేసీఆర్ కు సీతక్క స్ట్రాంగ్ కౌంటర్!

Advertisment
Advertisment
Advertisment