Weather Alert: ముంచుకొస్తున్న దిత్వా తుపాను.. ఏపీలో ఆ జిల్లాలకు రెడ్ అలెర్ట్
నైరుతి బంగాళాఖాతంలో దిత్వా తుపాను కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో చిత్తూరు, తిరుపతి, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ జారీ చేసింది.
నైరుతి బంగాళాఖాతంలో దిత్వా తుపాను కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో చిత్తూరు, తిరుపతి, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ జారీ చేసింది.
నెల్లూరు జిల్లాలో ఈ రోజు ఎన్ కౌంటర్ ఘటన చోటు చేసుకుంది. ఒక కేసులో నిందితులను పట్టుకునేందుకు చేసిన ప్రయత్నంలో పోలీసులు కాల్పులు జరపాల్సి వచ్చింది. ఓహత్యకేసులో నిందితులను పట్టుకునే క్రమంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.
మావోయిస్టు పార్టీ సంచలన ప్రకటన చేసింది. ఈ మేరకు ఆయుధ విరమణపై ఓ తేదీని ప్రకటించింది. జనవరి 1న ఆయుధాలను విడిచి సామూహికంగా లొంగిపోతామని తెలిపారు. ఒక్కొక్కరు బదులుగా అందరం ఒకేసారి లొంగిపోతామని వెల్లడించడం సంచలనంగా మారింది.
స్క్రబ్ టైఫస్ అనేది ఓరియెంటియా సుత్సుగాముషి అనే బాక్టీరియా వల్ల వచ్చే ఒక తీవ్రమైన జ్వరం. ఈ వ్యాధి సోకిన లార్వల్ మైట్స్ కరవడం ద్వారా మనుషులకు వ్యాపిస్తుంది. సాధారణ జ్వరం, జలుబు, వణుకు నల్లని మచ్చ, దద్దుర్లు ఉంటే వైద్యులను సంప్రదించాలి.
మావోయిస్టు పార్టీకి మరో మరో బిగ్ షాక్ తగిలింది. మావోయిస్టు పార్టీ పొలిట్బ్యూరో సభ్యుడు దేవ్జీతో పాటు మరో 50 మంది మావోయిస్టులు పోలీసుల అదుపులో ఉన్నారని తెలుస్తోంది. ఈ మేరకు దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ(డీకేఎస్జడ్సీ) ఒక సంచలన ప్రకటన చేసింది.
ఆంధ్రప్రదేశ్లో కొత్తగా మూడు జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. ఈ మేరకు సీఎం చంద్రబాబు వీటికి ఆమోదం తెలిపారు. కొత్తగా మార్కాపురం, మదనపల్లె, పోలవరం జిల్లాలు ఏర్పాటు చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది.
కలియుగ ప్రత్యక్ష దైవంగా పిలుచుకునే తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ వివాదం కొనసాగతుండగానే పరకామణిలో చోరీ తెలుగురాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. దొంగను పట్టుకున్నారు. అయితే ఆ దొంగ వెనుకాల ఉంది మీరంటే మీరంటూ వైసీపీ, కూటమి నేతలు దుమ్మెత్తి పోసుకుంటున్నారు.
సంక్రాంతి అనగానే తెలుగువారికి చాలా ముఖ్యమైన పండుగ.అందులోనూ ఆంధ్రప్రదేశ్ వారికి పెద్ద పండుగ. ఈ పండుగకు ఇంకా ఏడు వారాలపైనే సమయం ఉంది. అయినప్పటికీ దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన వారు ఇప్పటికే రిజర్వేషన్లు చేసుకోవడంతో రైళ్లు, బస్సుల్లో రిజర్వేషన్లు అయిపోయాయి.
అతనికి పెళ్లయి ఒక పాప కూడా ఉంది. అయినా మరో మహిళతో ప్రేమలో పడ్డాడు. ఆమెను ఇంటికి తీసుకువచ్చాడు. విషయం తెలుసుకున్న మహిళ కుటుంబసభ్యులు ఆమెను తీసుకెళ్లారు. మనస్థాపంతో అతను పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. దీంతో అతన్ని భార్య ఆసుపత్రిలో చేర్చింది.