Ayodhya Ram Mandir : ఆన్‌లైన్‌లో ఫేక్ అయోధ్య రామాలయ ప్రసాదాలు.. అమెజాన్‌కు నోటీసులు..

నకిలీ అయోధ్య రామాలయ ప్రసాదాలు అమ్మకాలు పెట్టారనే ఆరపోణలతో కేంద్రం అమెజాన్ సంస్థకు నోటీసులు పంపింది. వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని లేకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. సెల్లర్లపై చర్యలు తీసుకుంటామని.. నోటీసులపై పాలసీ ప్రాకారం ముందుకెళ్తామని అమెజాన్‌ స్పందించింది.

New Update
Ayodhya Ram Mandir : ఆన్‌లైన్‌లో ఫేక్ అయోధ్య రామాలయ ప్రసాదాలు.. అమెజాన్‌కు నోటీసులు..

Ayodhya : అయోధ్య(Ayodhya) లో రామాలయ ప్రారంభోత్సవం జరగనున్న వేళ.. ఆన్‌లైన్‌ నకిలీ ఉత్పత్తులు కనిపిస్తున్నాయి. తాజాగా అమెజాన్‌(Amazon) లో నకిలీ ప్రసాదాలు(Duplicate Prasad) అమ్మకాలు పెట్టారన్న ఆరోపణలతో.. కేంద్ర ప్రభుత్వం.. ఈ-కామర్స్(E-Commerce) దిగ్గజ సంస్థ అమెజాన్‌ సంస్థకు నోటీసులు పంపింది. కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) ఈ వ్యవహారంపై ఫిర్యాదు చేసింది. దీంతో సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ(CCPA) రంగంలోకి దిగింది. అమెజాన్‌ సంస్థకు నోటీసులు జారీ చేసింది.

Also Read: రూ. 1600 కోట్ల పెట్టుబడితో నిర్మించిన బోయింగ్‌ కేంద్రాన్ని ప్రారంభించిన ప్రధాని మోడీ!

శ్రీ రామ మందిర్(Sri Ram Mandir) అయోధ్య ప్రసాదం, అయోధ్య రామ మందిర్‌ అయోధ్య ప్రసాదం, రామ మందిర్‌ అయోధ్య ప్రసాదం-దేశీ దూద్‌ పేడ, ఖోయా ఖోబీ లడ్డూ, రఘుపతి నెయ్యి లడ్డూ అమెజాన్‌లో అమ్ముతున్నట్లు సమాచారం. అయితే వీళ్లు సాధారణంగా ఉండే మిఠాయిలనే.. అయోధ్య రామమందిర ప్రసాదంగా ఆన్‌లైన్‌(Online) లో అమ్మతున్నట్లు సీఏఐటీ ఫిర్యాదులో తెలిపింది. తప్పుడు ప్రకటనలు చేసి వినియోగదారుల్ని మోసం చేస్తున్నారని ఆరోపించింది.

అమెజాన్‌కు నోటీసులు వెళ్లిన నేపథ్యంలో వారం లోపు ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాలని సీసీపీఓ ఆదేశించింది. లేనిపక్షంలో వినియోగదారుల రక్షణ చట్టం-2019 ప్రకారం చర్యలు తప్పవంటూ హెచ్చరించింది. అయితే దీనిపై అమెజాన్ స్పందించింది. సెల్లర్ల జాబితాను పరిశీలించేలా చర్యలు తీసుకుంటామని.. నోటీసులపై తమ పాలసీ ప్రకారం ముందుకెళ్తామని కంపెనీ ప్రతినిధి పేర్కొన్నారు.

Also Read: అయోధ్యలో విపత్తుల చిరు ఆసుపత్రి భీష్మ్..

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

RCB VS RR: హుర్రే..ఓన్ గ్రౌండ్ లో ఆర్సీబీ గెలిచింది..ఆరఆర్ పై విక్టరీ

మొత్తానికి సొంతగడ్డపై బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ మ్యాచ్ గెలిచింది. ఐపీఎల్ 18 సీజన్ లో బెంగళూరు చినస్వామి స్టేడియంలో ఆర్సీబీ గెలవడం ఇదే మొదటిసారి. రాజస్థాన్ రాయల్స్ మీద ఆర్సీబీ 11 పరుగులు తేడాతో విజయం సాధించింది. 

New Update
ipl

RCB VS RR

ఐపీఎల్ లో ఈ రోజు ఆర్సీబీ, ఆర్ఆర్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో బెంగళూరు 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 205 పరుగులు చేసి ఆర్ఆర్ కు 206 టార్గెట్ ఇచ్చింది. ఈ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 194 పరుగులే చేసింది.  పరుగుల ఛేదనలో ఆర్ఆర్ తొమ్మిది వికెట్లను కోల్పోయింది. యశస్వీ జైస్వాల్‌ (49), ధ్రువ్‌ జురెల్‌ (47) పోరాడినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. బెంగళూరు జట్టులో హేజిల్ వుడ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. 19వ ఓవర్లో కేవలం ఒక పరుగే ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. చివరి ఓవర్లో లక్ష్యం 17 పరుగులు కాగా, యశ్‌ దయల్‌ వికెట్‌ తీసి కేవలం 5 పరుగులే ఇచ్చాడు. ఆర్సీబీలో హేజిల్‌ వుడ్‌ 4, కృనాల్‌ పాండ్య 2, భువనేశ్వర్‌ కుమార్‌, యశ్‌ దయాల్‌ ఒక్కో వికెట్‌ తీశారు. 

చిన్నస్వామి స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య రసవత్తరమైన మ్యాచ్ జరుగింది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ  20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. 

ఎవరెన్ని కొట్టారంటే?

ఫిల్ సాల్ట్ 23 బంతుల్లో 26 పరుగులు, విరాట్ కోహ్లీ 42 బంతుల్లో 70 పరుగులు, పడిక్కల్ 27 బంతుల్లో 50 పరుగులు, కెప్టెన్ రజత్ పాటిదార్ 3 బంతుల్లో 1 పరుగు చేశాడు. అలాగే మ్యాచ్ ఆఖరి వరకు ఆడిన డేవిడ్ 15 బంతుల్లో 23 పరుగులు, జితేశ్‌ శర్మ 10 బంతుల్లో 20 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. 

కోహ్లీ పరుగుల వరద

32 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. ఆ తర్వాత కూడా దూకుడుగానే ఆడుతూ రన్స్ రాబట్టాడు. అప్పటికే రెండు సిక్సులు కొట్టి ఫ్యాన్స్‌కు మంచి ఊపు తెప్పించాడు. కానీ మరో షార్ట్ ఆడే క్రమంలో క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో 42 బంతుల్లో 70 పరుగులు చేసి ఔరా అనిపించాడు. అయితే ఈ మ్యాచ్‌లో రెండు సిక్సులు కొట్టిన కోహ్లీ.. మరో సిక్స్ కొట్టుంటే అరుదైన రికార్డు క్రియేట్ చేసి ఉండేవాడు. 

today-latest-news-in-telugu | IPL 2025 | rcb-vs-rr | match

Advertisment
Advertisment
Advertisment