World Population: 2100 నాటికి ప్రపంచ జనాభా తగ్గనుందా? ఐక్యరాజ్యసమితి ఏం చెబుతోంది?

ప్రపంచంలో రోజురోజుకూ జనాభా పెరిగిపోతోంది. మఖ్యంగా భారత్, చైనాలాంటి దేశాల్లో అయితే మరీ ఎక్కువగా ఉంది ఈ ప్రమాదం. దీని మీద ఆందోళనలు కూడా వ్యక్తం అవుతున్నాయి. అయితే ఐక్యరాజ్యసమితి మాత్రం ఏం వర్రీ అవ్వక్కర్లేదు అని చెబుతోంది. భవిష్యత్తులో జనాభా తగ్గుతుందని అంటోంది.

New Update
World Population: 2100 నాటికి ప్రపంచ జనాభా తగ్గనుందా? ఐక్యరాజ్యసమితి ఏం చెబుతోంది?

World Population in 2100: భవిష్యత్తు ఎలా ఉంటుందో మన ఊహకు అందదు. మనం అనుకున్న వాటికి వ్యతిరేకంగా కూడా జరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు చెప్పబోయే విషయం కూడా అలాంటిదే. ప్రస్తుతం ప్రపంచంలో జనాభా పెరుగుతోందే తప్ప ఎక్కడా తగ్గడం లేదు. ఇది అనర్ధాలకు దారి తీస్తోందన ఇపర్యావరణ సంస్థలు, ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి కూడా. అయితే ఐక్యరాజ్యసమితి (United Nations) మాత్రం జనాబా పెరుగుదల గురించి అస్సలు వర్రీ అవ్వకండి అని చెబుతోంది. 2100నాటికి జనాభాలో తగ్గుతుందని అంటోంది. ఐక్యరాజ్యసమితి అందించిన ‘రివిజన్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్ట్స్ -2022’ (World Population Prospects) డేటాలోని ఈ వివరాలను వెల్లడించింది.

Also read:నిరుద్యోగులకు గుడ్ న్యూస్..పోస్టల్ జాబ్‌లకు నోటిఫికేషన్ రిలీజ్

ఈ డేటాలో భారత్ తో పాటూ పాకిస్తాన్, చైనా, అమెరికా, యూరోపియన్ కంట్రీల జనాభాకు సంబంధించిన వివరాలున్నాయి. దీని ప్రకారం ప్రస్తుం భారత జనాభా 140 కోట్లు ఉంది. అంతకు ముందు 2021లో మన దేశ జనాభా (India Population) 153 కోట్లు. అంటే అప్పటికీ ఇప్పటికీ 13కోట్ల మంది తగ్గారు. దీనిబట్టి చూస్తే వచ్చే 77 ఏళ్ళల్లో అంటే 2100నాటికి జనాబా మరింత తగ్గుతుందని అంటోంది. చైనా గురించి అయితే మరింత షాకింగ్ విషయాలు చెబుతోంది రివిజన్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్ట్స్ -2022 నివేదిక. 2100 నాటికి చైనా జనాభా 140 కోట్ల నుంచి దాదాపు 77 కోట్లకు తగ్గిపోనుంది.

ఐక్యరాజ్యసమితి యూఎన్‌ ఇన్‌స్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యుయేషన్ (ఐహెచ్‌ఎంఈ), ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ అప్లైడ్ సిస్టమ్స్ అనాలిసిస్ (ఐఐఏఎస్‌ఏ)లు అందించిన డేటాలలోని అంశాలను క్రోడీకరించి 2100నాటి జనాభా అంచనాలను రూపొందించారు. ఇందులో ప్రపంచ జనాభా 2086 నాటికి గరిష్ట స్థాయికి చేరుకుంటుందని ...కానీ సంతానోత్పత్తి రేట్లు 2050 కన్నా ముందుగానే త్వరితగతిన తగ్గుతాయని అంచనా. 2100కి వీటి స్థిరీకరణ జరగనుందని పేర్కొన్నారు. జనాభా తగ్గడానికి కారణాలను కూడా ఇందులో విశ్లేషించారు. మహిళలు ఉద్యోగాల్లో ఎక్కువగా పనిచేయడం, కుటుంబ నియంత్రణ మీద అవగాహన, గర్భనిరోధకాలు ఎక్కువగా లభించడం, జీవన ప్రమాణాలు పెరగడం వంటివి సంతానోత్పత్తి తగ్గుదలకు తోడ్పడతాయని చెబుతున్నారు.

2100 నాటికి ఏ దేశంలో ఎంత జనాభా(అంచనా)?
భారతదేశం: 153 కోట్లు
చైనా: 77 కోట్ల 10 లక్షలు
నైజీరియా: 54 కోట్ల 60 లక్షలు
పాకిస్తాన్: 48 కోట్ల 70 లక్షలు
కాంగో: 43 కోట్ల 10 లక్షలు
అమెరికా: 39 కోట్ల 40 లక్షలు
ఇథియోపియా: 32 కోట్ల 30 లక్షలు
ఇండోనేషియా: 29 కోట్ల 70 లక్షలు
టాంజానియా: 24 కోట్ల 40 లక్షలు
ఈజిప్ట్: 20 కోట్ల 50 లక్షలు
బ్రెజిల్: 18 కోట్ల 50 లక్షలు
ఫిలిప్పీన్స్: 18 కోట్లు
బంగ్లాదేశ్: 17 కోట్ల 70 లక్షలు
సూడాన్: 14 కోట్ల 20 లక్షలు
అంగోలా: 13 కోట్ల 30 లక్షలు
ఉగాండా: 13 కోట్ల 20 లక్షలు
మెక్సికో: 11 కోట్ల 60 లక్షలు
కెన్యా: 11 కోట్ల 30 లక్షలు
రష్యా: 11 కోట్ల 20 లక్షలు
ఇరాక్: 11 కోట్ల 10 లక్షలు
ఆఫ్ఘనిస్తాన్: 11 కోట్లు
మొజాంబిక్: 10 కోట్ల 60 లక్షలు
వియత్నాం: 9 కోట్ల 10 లక్షలు
కామెరూన్: 8 కోట్ల 70 లక్షలు
మాలి: 8 కోట్ల 70 లక్షలు
మడగాస్కర్: 8 కోట్ల 30 లక్షలు
టర్కీ: 8 కోట్ల 20 లక్షలు
ఇరాన్: 7 కోట్ల 90 లక్షలు
దక్షిణాఫ్రికా: 7 కోట్ల 40 లక్షలు
యెమెన్: 7 కోట్ల 40 లక్షలు
జపాన్: 7 కోట్ల 40 లక్షలు

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

మోదీకి సౌదీ పర్యటనలో ఫైటర్ జెట్ల ఎస్కార్ట్.. 6 విమానాలతో స్వాగతం (VIDEO)

సౌదీ అరేబియా పర్యటనకు బయలుదేరిన ప్రధాని మోదీకి రాయల్‌ సౌదీ ఎయిర్‌ఫోర్స్‌‌ గగనతలంలో ఎస్కార్ట్ ఏర్పాటు చేసింది. మోదీ విమానం ఆ దేశంలోకి వెళ్లగానే 6ఫైటర్ జెట్లతో ఎస్కార్ట్‌గా వచ్చాయి. 2వ స్ట్రాట‌జిక్ పార్ట్నర్‌షిప్ కౌన్సిల్ స‌మావేశానికి ఆయన అక్కడికి వెళ్లారు.

New Update
Saudi Arabia visit

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సౌదీ అరేబియా పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. 2 రోజుల పాటు ఆయన సౌదీలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా మంగళవారం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో సౌదీ బయల్దేరి వెళ్లారు. ప్రధానికి సౌదీ ప్రభుత్వం ప్రత్యేకంగా స్వాగతం పలికింది. మోదీ ప్రయాణిస్తోన్న విమానం ఆ దేశ గగనతలంలోకి ప్రవేశించగానే రాయల్‌ సౌదీ ఎయిర్‌ఫోర్స్‌‌కు చెందిన ఎఫ్‌-15 విమానాలు దానిని ఎస్కార్ట్‌గా వచ్చాయి. మోదీ ప్రయాణిస్తు్న్న విమానానికి ఇరువైపులా మూడేసి చొప్పున 6 జెట్ ఫైటర్లు ఎస్కార్ట్‌గా నిలిచి స్వాగతం పలికాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరల్‌ అవుతున్నాయి.

Also read: New Pope: కొత్త పోప్ ఎన్నికలో కీలకంగా నలుగురు ఇండియన్ కార్డినల్స్

సౌదీకి బ‌య‌లుదేరి వెళ్లడానికి ముందు ప్రధాని ఓ ట్వీట్ చేశారు. ఇటీవ‌ల 2 దేశాల మ‌ధ్య బంధం మ‌రింత దృఢ‌మైంద‌న్నారు. ర‌క్షణ‌, వాణిజ్య, పెట్టుబ‌డి, ఎనర్జీ రంగాల్లో స‌హ‌కారం పెరిగింద‌న్నారు. ప్రాంతీయంగా శాంతి, సామ‌ర‌స్యం, స్థిర‌త్వం పెంచేందుకు ఇండియా, సౌదీ దేశాలు క‌ట్టుబ‌డి ఉన్నట్లు తెలిపారు.

Also read: BIG BREAKING: గుజరాత్‌లో కూప్పకూలిపోయిన విమానం.. భారీ పేలుడు

ప్రధాని హోదాలో మోదీ సౌదీ వెళ్లడం ఇది మూడోసారి అయినా.. జెడ్డాకు వెళ్లడం ఇదే మొద‌టిసారి. రెండ‌వ స్ట్రాట‌జిక్ పార్ట్నర్‌షిప్ కౌన్సిల్ స‌మావేశంలో ఆయ‌న పాల్గొనున్నారు. ప్రధాని తన పర్యటనలో జెడ్డాలో ఆ దేశంతో 6 ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు. సౌదీ ఆరేబియా చ‌క్రవ‌ర్తి మ‌హ‌మ్మద్ బిన్ స‌ల్మాన్ అల్ సౌద్‌తో జ‌రిగే చ‌ర్చల్లో భార‌తీయ యాత్రికుల‌కు చెందిన హ‌జ్ కోటా గురించి మాట్లాడ‌నున్నారు.

(saudi-arabia | modi-visit | Air escort)

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు