Khammam: ఖమ్మం ఆస్పత్రిలో కలకలం.. వృద్ధురాలి ప్రాణాలు తీసిన లిఫ్ట్!

ఖమ్మం జిల్లాకి చెందిన సరోజనమ్మకి ఛాతీ నొప్పి రావడంతో ఓ ప్రైవేట్‌ హాస్పిటల్‌ లో స్టంట్‌ వేయించుకుంది.ఆపరేషన్‌ గది నుంచి రూమ్‌ కి లిఫ్ట్‌ లో తరలిస్తున్న సమయంలో లిఫ్ట్‌ పాడైపోవడంతో ఒక్కసారిగా కిందపడిపోయింది.దీంతో మహిళకు తీవ్ర గాయాలు కావడంతో చనిపోయింది.

New Update
lift

lift

అదృష్టం అడ్డం తిరిగితే అరటిపండు తిన్న పన్ను విరిగిందని..ఛాతిలో నొప్పి వచ్చి ఆసుపత్రికి వెళ్తే..అక్కడ స్టంట్‌ వేసి ఆపరేషన్‌ చేశారు.అంతా బాగానే ఉంది అనుకుంటున్న సమయంలో మృత్యువు ఆమెను లిఫ్ట్‌ రూపంలో వెంటాడింది. ఆపరేషన్‌ థియేటర్‌ నుంచి మామూలు గదికి తీసుకుని వచ్చే క్రమంలో లిఫ్ట్‌ ఎక్కగా..అది కాస్త ఫెయిల్‌ అయ్యి కిందకి పడిపోయింది. దీంతో ఆపరేషన్‌ చేయించుకున్న మహిళ మృతి చెందింది. ఈ విషాధ ఘటన ఖమ్మంలో జరిగింది. 

Also Read:  India-Canada-Trudeau: ట్రూడో హయంలో తీవ్రవాదులకు లైసెన్స్‌లు!

బాధితురాలి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం, ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం వనంవారి కిష్టాపురం గ్రామానికి చెందిన సరోజనమ్మకు ఈ నెల 20న ఛాతీలో నొప్పి రావడంతో నగర కేంద్రం నెహ్రూ నగర్​లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకుని వెళ్లారు. డాక్టర్లు పరీక్షించి గుండె సమస్య ఉందని చెప్పడంతో అక్కడే జాయిన్‌ చేశారు. శుక్రవారం సాయంత్రం ఆమె గుండెకు స్టెంటు వేసి ఎలాంటి ప్రాణాపాయం లేదని కుటుంబ సభ్యులకు చెప్పారు.

Also Read: Telangana Rains:తెలంగాణలో భారీ వర్షాలు.. మరో రెండు రోజులూ ఇదే పరిస్థితి..!

అనంతరం రెండో అంతస్తులో ఉన్న ఆపరేషన్​ థియేటర్​ నుంచి నాలుగో అంతస్తులోని ఐసీయూకు తరలించేందుకు సిద్ధమయ్యారు. సరోజనమ్మను స్ట్రెచర్​పై ఇద్దరు సిబ్బంది తీసుకువెళ్తున్నారు. ఈ క్రమంలో లిఫ్టు ఎక్కిస్తుండగా స్ట్రెచర్​ సగం వరకు లోపలికి వెళ్లింది. ఆ తర్వాత లిఫ్టు క్యాబిన్​ ఒక్కసారిగా పైకి వెళ్లింది. లిఫ్టులోనే మహిళ, సిబ్బంది ఉండిపోయారు. పైకి వెళ్లిన లిఫ్టు తిరిగి కిందకు ఒక్కసారిగా పడిపోయింది. అక్కడే ఉన్న సహాయక సిబ్బంది వెంటనే లోపల ఇరుక్కున్న ఇద్దరినీ డోర్​ తొలగించి బయటకు తీసుకొచ్చారు. 

ఈ ప్రమాదంలో సరోజనమ్మకు గాయాలు కాగా చికిత్స అందిస్తుండగా మృతి చెందారు. ఆసుపత్రి సిబ్బంది ఇద్దరికీ స్వల్ప గాయాలు అయ్యాయి. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే ఈ ఘటనపై ఇంకా ఫిర్యాదు అందలేదని సీఐ  తెలిపారు. మృతురాలికి భర్త, కుమారుడు ఉన్నారు. ఈ విధంగా ఆమె చనిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు.

Also Read: Breaking News: రోడ్డు ప్రమాదంలో అడిషనల్‌ డీసీపీ స్పాట్‌ డెడ్‌!

Also Read: Ap Weather: ఏపీ ప్రజలకు చల్లని కబురు.. ఈ జిల్లాల్లో నాలుగు రోజులు వానలే..వానలు!

khammam | crime | hospital | lift | accident | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

SRH vs HCA : ఉప్పల్ స్టేడియంలో విజిలెన్స్ విచారణ..ఆయన డుమ్మా?

టికెట్ల విషయంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌కు హైదరాబాద్ సన్ రైజర్స్‌కు మధ్య వివాదం తలెత్తిన విషయం తెలిసిందే. ఆ వివాదం పై విజిలెన్స్ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ విచారణకు HCA ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు హాజరు కానట్టు తెలిసింది

New Update
 HCA vs SRH

HCA vs SRH

SRH vs HCA :  టికెట్ల విషయంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌కు హైదరాబాద్ సన్ రైజర్స్‌కు మధ్య వివాదం తలెత్తిన విషయం తెలిసిందే. ఆ వివాదం ముదిరి ముదిరి పాకాన పడింది. దీంతో ఈ  వ్యవహారంపై విజిలెన్స్ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఎస్ఆర్‌హెచ్‌పై తీవ్ర ఒత్తిడికి గురి చేయడమే కాకుండా.. ఎక్కువ టికెట్లు కేటాయించాలంటూ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌ వేధింపులకు గురి చేస్తుందని ఎస్ఆర్‌హెచ్ ఆరోపిస్తూ.. ప్రభుత్వానికి ఈ మెయిల్ చేసింది. అయితే విచారణ సందర్భంగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్, సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం మధ్య నెలకొన్న వివాదం తాత్కళికంగా సద్దుమణిగినట్లు తెలిసింది.

ఇది కూడా చూడండి: ఏపీకి వాతావరణశాఖ చల్లని కబురు.. ఈ జిల్లాల్లో వానలు..!

 ఉప్పల్ స్టేడియంలో ఎస్ఆర్‌హెచ్‌ టికెట్ల విషయంలో వేధింపులపై విజిలెన్స్ అధికారులు విచారణ జరిపారు. అయితే  ఈ విచారణకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు హాజరు కానట్టు తెలిసింది. వ్యక్తిగత పనుల నిమిత్తం హైదరాబాద్‌కు దూరంగా ఉన్నానని ఆయన విజిలెన్స్ అధికారులుకు సమాచారం అందించారట. ఈ నేపథ్యంలో బుధవారం విచారణకు హాజరవుతానని హెచ్‌సీఏ ప్రెసిడెంట్ స్పష్టం చేశారు. ఇక హెచ్‌సీఏ సెక్రటరీ బస్వరాజు నుంచి విజిలెన్స్ అధికారులు వివరాలు సేకరించారు. అనంతరం బస్వరాజు స్టేడియం నుంచి వెళ్లిపోయారు. అలాగే విజిలెన్స్ అధికారులు స్టేడియంలోనే విచారణ కొనసాగించారు. మరోవైపు..ఇరు వర్గాలతో ప్రభుత్వం సమావేశం ఏర్పాటు చేసింది. ఆ క్రమంలో ఎస్ఆర్‌హెచ్ నుంచి వెళ్లిన టికెట్లు ఎన్ని.. కాంప్లిమెంటరీ టికెట్లు ఎన్ని.. వాటిని ఏదైనా బ్లాక్ మార్కెట్‌లో విక్రయిస్తున్నారా..వీటన్నింటిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి నివేదిక అందజేయాలని విజిలెన్స్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం విజిలెన్స్ అధికారులు ఉప్పల్ స్టేడియం చేరుకున్నారు.

Also Read: Adolescence: ప్రధాని మెచ్చిన 'Adolescence' వెబ్ సీరిస్.. అన్ని స్కూళ్లలో ప్రదర్శించాలని ఆదేశం.. దాని ప్రత్యేకత ఇదే!

 మంగళవారం SRH ప్రతినిధులతో HCA సెక్రటరీ దేవరాజ్‌ జరిపిన చర్చలు తాత్కాలికంగా సఫలం అయ్యాయి. SRH, HCA, బీసీసీఐ మధ్య జరిగిన త్రైపాక్షిక ఒప్పందాన్ని పాటించాలని SRH ప్రతిపాదించింది. పాత ఒప్పందం ప్రకార‌మే స్టేడియం సామ‌ర్థ్యంలోని 10 శాతం కాంప్లిమెంట‌రీ పాసులను హెచ్‌సీఏకు కేటాయించనున్నారు. ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్‌లను విజ‌య‌వంతంగా నిర్వహించేందుకు ఎస్ఆర్‌హెచ్‌కు పూర్తిగా స‌హ‌క‌రిస్తామ‌ని హెచ్‌సీఏ హామీ ఇచ్చింది. చర్చల అనంతరం వివాదాల‌న్నీ ముగిశాయని హెచ్‌సీఏ-ఎస్ఆర్‌హెచ్‌ ప్రక‌టించాయి.

ఇది కూడా చూడండి: డెత్ ఓవర్ల స్పెషలిస్ట్‌..  రూ. 30లక్షలకు ముచ్చెమటలు పట్టించాడు!
 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు