Vande Bharat Train లో సిగరేట్ అంటించిన ప్యాసింజర్.. బోగీ అంతా పొగ-VIRAL VIDEO

విశాఖ- సికింద్రాబాద్‌ వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ లో ఓ ప్రయాణికుడు సిగరెట్ తాగడం కలకలం రేపింది. బాత్రూం లో సిగరెట్‌ తాగడంతో పొగ కోచ్‌ అంతా వ్యాపించి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌ అవుతుంది.

New Update
vandhe bharat smoke

vandhe bharat smoke

సాధారణ రైళ్లల్లో ఇప్పటివరకు లేని కొన్ని స్పెషల్స్‌, వేగం.. వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ (Vande Bharat Express) లో ఉండటం వల్ల వాటికి రోజురోజుకి డిమాండ్ పెరుగుతోంది. ఆక్యుపెన్సీ రేషియో భారీగా ఉంటోంది. సాధారణ రైళ్లతో పోల్చుకుంటే టికెట్ ధర అధికమే అయినప్పటికీ- త్వరగా గమ్యస్థానాలకు చేరడానికి  ప్రయాణికులు వందే భారత్‌ను ఆశ్రయిస్తోన్నారు.

Also Read:BIG BREAKING: బ్రిటన్ ప్రధానికి హెచ్‌ఐవీ టెస్ట్‌.. !

ఇలాంటి ప్రతిష్ఠాత్మక ఎక్స్‌ప్రెస్ రైళ్లల్లో భద్రత కొరవడిందనే అభిప్రాయాలు బయటకు వస్తున్నాయి. తాజాగా విశాఖపట్నం - సికింద్రాబాద్ (Visakhapatnam - Secunderabad) వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో చోటు చేసుకున్న ఓ సంఘటన దీనికి అద్దం పట్టింది. భద్రత గురించి ప్రయాణికుల్లో ఉన్న ఆందోళనను రెట్టింపు చేసినట్టయింది. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ టాయ్‌లెట్‌లో ఓ ప్రయాణికులు సిగరెట్ తాగినట్లు సమాచారం.

Also Read: Sri Lanka: ఆ కోతి చేసిన పనికి 11 గంటలు కరెంట్‌ కట్‌.. ఆ మంకీ ఏం చేసిందో తెలుసా?

తాను కూడా ఇబ్బంది పడ్డానంటూ..

ఈ పొగ మొత్తం ఆ కోచ్‌లో వ్యాపించింది. సిగరెట్ పొగ ఘాటుతో ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. మహిళలు, వయోధిక వృద్ధులు మరింత ఇబ్బంది పడ్డారు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ విషయాన్ని టీసీ దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఉపయోగం లేకుండా పోయిందని  ప్రయాణికులు చెబుతున్నారు. సిగరెట్ పొగ ఘాటు వల్ల తాను కూడా ఇబ్బంది పడ్డానంటూ టీసీ ప్రయాణికులతో చెప్పడం ఈ వీడియోలో స్పష్టంగా వినపడుతుంది. రెండు నిమిషాలు ఈ రైలును నిలిపివేసి డోర్లను తీయాలంటూ కొందరు ప్రయాణికులు విజ్ఞప్తి చేశారు.

సికింద్రాబాద్- విశాఖపట్నం-సికింద్రాబాద్ మధ్య నడిస్తోన్న 20707/20708 వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. వంద శాతానికి పైగా ఆక్యుపెన్సీతో నడుస్తోన్న రైలు ఇది. అత్యంత ఆదరణ ఉండే సర్వీసుల్లో ఇదీ ఒకటి.  అలాంటి ప్రజాదరణ ఉన్న ఎక్స్‌ప్రెస్‌లో ఈ ఘటన జరగడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది.

Also Read:LUMPY SKIN VACCINE:లంపీ స్కిన్‌ వ్యాధి - టీకా కనుగొన్న భారత్‌ బయోటెక్‌

Also Read: Maha Kumbh Mela: 350 కి.మీ మేర నిలిచిన ట్రాఫిక్‌...గూగుల్‌ మ్యాప్‌ చూసుకుని వెళ్లండంటున్న సీఎం!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

KTR  : హనుమాన్ పూజలో పాల్గొని.. స్వాములతో కలిసి భోజనం చేసిన కేటీఆర్

బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ ఇవాళ సిరిసిల్ల జిల్లాలో ప‌ర్యటించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం (తెలంగాణ భవన్)లో నిర్వహించిన హ‌నుమాన్ దీక్షా స్వాముల‌ పూజ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు.

New Update
ktr

ktr

ktrKTR  : బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ ఇవాళ సిరిసిల్ల జిల్లాలో ప‌ర్యటించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం (తెలంగాణ భవన్)లో నిర్వహించిన హనుమాన్ పూజ కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. సిరిసిల్లలోని తెలంగాణ భ‌వ‌న్‌లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో హ‌నుమాన్ దీక్షా స్వాముల‌కు ఏర్పాటు చేసిన భిక్ష కార్యక్రమానికి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా నిర్వహించిన హనుమాన్ పూజ‌లో కేటీఆర్ పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. కేటీఆర్‌కు అర్చకులు వేదాశ్వీర‌చ‌నాలు అందించారు.

Also read :  తండ్రితో మంచు మనోజ్ లొల్లి.. మోహన్ బాబు ఇంటివద్ద హై టెన్షన్!

హనుమాన్ మాలదారులకు భిక్ష ఏర్పాటు చేసి స్వయంగా కేటీఆర్ వడ్డించారు. మాలాదారులు సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ కు చిత్రపటం అందించారు.అనంత‌రం హ‌నుమాన్ దీక్షా స్వాముల‌ను కేటీఆర్ ఆప్యాయంగా ప‌లుక‌రించారు. స్వాముల‌తో క‌లిసి కేటీఆర్ భోజ‌నం చేశారు. కేటీఆర్‌తో స్వాములు ఫొటోలు దిగేందుకు ఆస‌క్తి చూపారు. కేటీఆర్ వెంట సిరిసిల్ల జిల్లా నాయ‌కులు ఉన్నారు.  

Advertisment
Advertisment
Advertisment