Fire Accident: అమ్రాబాద్ అడవిలో భారీ అగ్ని ప్రమాదం.. నల్లమలలోకి ఎంట్రీ!

నాగర్ కర్నూల్ అమ్రాబాద్ రిజర్వు టైగర్ అటవీ ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. దోమల పెంట అటవీ క్షేత్ర పరిధిలో కార్ చిచ్చు మొదలైనట్లు స్థానికులు తెలిపారు. శ్రీశైలం, నల్లమలలోకి ఈ మంటలు ప్రవేశించే అవకాశం ఉందని అధికారులు ఆందోళన చెందుతున్నారు.

New Update
fire acident

Amrabad Reserve Tiger Forest fire accident

Fire Accident: నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ రిజర్వు టైగర్ అటవీ ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఆదివారం రాత్రి దోమల పెంట అటవీ క్షేత్ర పరిధిలో కార్ చిచ్చు మొదలైనట్లు స్థానికులు తెలిపారు. శ్రీశైలం నుంచి హైదరాబాద్ వెళ్లే రహదారికి కుడి వైపున వందలాది హేక్టర్లలో అడవి అంటుకున్నట్లు అధికారులు తెలిపారు. 

Also Read: రోహిత్ శర్మపై బాడీ షేమింగ్ పోస్టు .. డిలీట్ చేసిన ముస్లిం మహిళా నేత!

అల్లాడుతున్న వన్య ప్రాణులు..

ఈ మంటలతో అడవిలో ఉన్న వణ్య ప్రాణులు అల్లాడుతూ ఎక్కడెక్కడికో పరుగులు తీస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అడవిలో ఉన్న వివిధ విలువై మొక్కలు, వన ములికలు పూర్తిగా వినాశనం అయ్యాయి. ఈ అడివిలో కార్చిచ్చు సంఘటనలు గుర్తించే అటవీశాఖ షాట్ లైట్ ప్రస్తుతం కార్చిచ్చు ప్రమాదాలను పసిఘట్టలేకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ మంటలను వీలైనంత త్వరగా అదుపుచేయకపోతే నల్లమల అడవిలోకి ప్రవేశించే అవకాశం ఉందని, అలా జరిగితే భారీ విపత్తు తప్పదని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

Also Read: రణవీర్‌ అల్హాబాదియా వివాదం.. సుప్రీంకోర్టు కీలక తీర్పు 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Nagarjuna Sagar : నాగార్జున సాగర్ ఎర్త్ డ్యాం దగ్గర మరోసారి అగ్నిప్రమాదం..దగ్ధమైన సీసీకెమెరాలు

నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ డ్యాం పరిధిలో మరోసారి అగ్నిప్రమాదం జరిగింది. ప్రధాన ఎర్త్‌‌‌‌‌‌‌‌ డ్యాం వద్ద ఆదివారం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఎర్త్‌‌‌‌‌‌‌‌ డ్యాం వెంట ఉన్న చెట్లు పూర్తిగా కాలిపోయాయి. సీసీ కెమెరాలతో పాటు సామాగ్రి దగ్ధమయ్యాయి.

New Update
Nagarjuna Sagar

Nagarjuna Sagar

Nagarjuna Sagar :  నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ డ్యాం పరిధిలో మరోసారి అగ్నిప్రమాదం జరిగింది. నాగార్జునసాగర్‌‌‌‌‌‌‌‌ ప్రధాన ఎర్త్‌‌‌‌‌‌‌‌ డ్యాం వద్ద ఆదివారం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పాయింట్‌‌‌‌‌‌‌‌ నుంచి శివుడి పార్క్‌‌‌‌‌‌‌‌ వరకు ఎర్త్‌‌‌‌‌‌‌‌ డ్యాం వెంట ఉన్న చెట్లు పూర్తిగా కాలిపోయాయి. సీసీ కెమెరాలు  కొంత సామాగ్రి దగ్ధమయ్యాయి.ఈ రోజు మధ్నాహ్నం ఎర్త్ డ్యాం దగ్గర  మంటలు చెలరేగాయి. స్థానికుల సమాచారంతో  ఘటనా స్థలానికి వచ్చిన ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేశారు. అప్పటికే మంటలకు  ఎర్త్ డ్యాం పై ఉన్న సీసీ కెమెరాలు, విద్యుత్ వైర్లు ధ్వంసం అయ్యాయి. డ్యాం దగ్గర ఇటీవల వరుసగా అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. వేసవికాలం కావడం వల్ల డ్యాం పైన ఎండిపోయిన గడ్డి ఎక్కువగా ఉండడంతో వేడికి అంటుకుని మంటలు చెలరేగుతున్నాయని సిబ్బంది చెబుతున్నారు. అయితే కృష్ణ జలాల విషయంలో తెలంగాణ, ఆంధ్ర వివాదం నేపథ్యంలో కావాలనే ఎవరైనా ఇలా చేస్తున్నారా అనే అనుమానాలు లేకపోలేదు.

Also Read :  దేశానికి స్ఫూర్తినిచ్చిన పోరాటం..ఆ భూములపై కేటీఆర్ బహిరంగ లేఖ

Also read :  డీఎంకే ప్రభుత్వంపై మోదీ ఫైర్.. వాళ్లు తమిళంలో సంతకం చేయాలన్న ప్రధాని

మార్చి 19న  నాగార్జునసాగర్‌‌‌‌‌‌‌‌ ప్రధాన ఎర్త్‌‌‌‌‌‌‌‌ డ్యాం వద్ద  ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పాయింట్‌‌‌‌‌‌‌‌ నుంచి శివుడి పార్క్‌‌‌‌‌‌‌‌ వరకు ఎర్త్‌‌‌‌‌‌‌‌ డ్యాం వెంట ఉన్న చెట్లు పూర్తిగా కాలిపోయాయి. విషయం తెలుసుకున్న ఫారెస్ట్‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్లు ఘటనాస్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఫిబ్రవరి 15, 21 తేదీల్లో డీఫారెస్ట్‌‌‌‌‌‌‌‌ ఏరియాలో అగ్ని ప్రమాదం జరిగి చెట్లు, మొక్కలు కాలి బూడిదయ్యాయి. తాజాగా మరోసారి ప్రమాదం జరగడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు తాజాగా మరోసారి ప్రమాదం జరగడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

ఇది కూడా చూడండి: సగానికి పైగా విద్యార్థి వీసాల్లో కోత..తెలుగు రాష్ట్రాల వారివే ఎక్కువ

ఇది కూడా చూడండి: అదుపుతప్పి బావిలో పడ్డ ట్రాక్టర్.. ఏడుగురు మహిళా కూలీలు మృతి

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు