Minister Seethakka-Padi Koushik Reddy: తమ్ముడూ మా ఇంటికి భోజనానికి రండి అంటూ పాడి కౌశిక్‌ రెడ్డిని ఆహ్వానించిన సీతక్క!

రైతు రుణమాఫీ, బోనస్ వంటి అంశాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన పాడి కౌశిక్ రెడ్డికి సమాధానం ఇస్తూ.. మంత్రి సీతక్క కౌంటర్ ఇచ్చారు. తన జీవన విధానం వేరని.. కౌశిక్ లైఫ్ స్టైల్ వేరంటూ చురకలంటించారు.బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా తన ఇంటికి భోజనానికి రావాలన్నారు.

New Update
seethakka

seethakka

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి.ఈ  సమావేశాల్లో భాగంగా శనివారం ఓ ఆసక్తికర చర్చ జరిగింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి, మంత్రి సీతక్కకు మధ్య ఓ ఇంట్రస్టెంటింగ్‌ చర్చ నడిచింది. రైతు సమస్యలు, రైతు రుణమాఫీ, సన్నవడ్లకు బోనస్‌ అంశాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన పాడి కౌశిక్ రెడ్డికి మంత్రి సీత‌క్క తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. "త‌మ్ముడూ నీ జీవన విధానం వేరు.. నా జీవన విధానం వేరు.. నియోజ‌క‌వర్గంలో నేను తిరుగుతున్నట్లు నువ్వు తిరగగలవా.." అంటూ మంత్రి సీతక్క సైటర్లు వేశారు. 

Also Read: Indonesia: ఇండోనేషియాలో ముగ్గురు భారతీయులకు మరణ శిక్ష..?!

ప్రజ‌ల‌కు ఎవ‌రు ఎక్కువ అందుబాటులో ఉంటారో తేల్చుకుందామంటూ మంత్రి సీత‌క్క పాడికి సవాలు కూడా విసిరారు. అంతేకాకుండా.. హైద‌రాబాద్‌లో తిరిగే వాళ్లకు రైతులకు బోన‌స్ వ‌స్తుందో లేదో ఎలా తెలుస్తుందంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.తాను ప్రభుత్వ క్వార్టర్స్‌లోనే నివసిస్తున్నానని.. తాను ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన కోటల్లో నివసించడం లేదని సీతక్క సెటైర్‌ వేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వ హయాంలో నిర్మించిన భవనంలో ఉండటం తన అదృష్టంగా అనుకుంటున్నట్లు మంత్రి సీతక్క చెప్పుకొచ్చారు. తన కుమారుడు కూడా హన్మకొండలోనే ఉంటాడని.. తన జీవన విధానం గురించి ప్రజలకు మొత్తం తెలుసన్నారు. 

Also Read:  Tummala Nageswara rao:తెలంగాణ రైతులకు పెద్ద షాక్‌.. వారికి రుణమాఫీ లేదని చెప్పిన మంత్రి తుమ్మల..!

ఈ సందర్భంగా.. తన ఇంటికి వచ్చి భోజనం చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను సీతక్క ఆహ్వానించారు.అంతకు ముందు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌషిక్ రెడ్డి మాట్లాడుతూ.. గత బడ్జెట్‌లో రుణమాఫీకి రూ. 31 వేల కోట్ల బడ్జెట్ పెట్టారని.. అందులో రూ.20,616 కోట్లు రుణమాఫీ చేసినట్లు చెబుతున్నారని, ఇంకా రూ.11 వేల కోట్లకు పైగా రుణమాఫీ ఎందుకు చేయాలేదని ప్రశ్నించారు. తన హుజురాబాద్ నియోజకవర్గం వీణవంకలో దాదాపు 1070 మంది రైతులు అప్పు తీసుకుంటే.. అందులో 495 మందికి మాత్రమే రుణమాఫీ అయ్యిందని చెప్పుకొచ్చారు. 


బీఆర్ఎస్ హయాంలో రెండు విడతల్లో రూ.29,114 వేల కోట్ల రుణమాఫీ చేసినట్లు తెలిపారు. రైతుబంధు పథకం లాంటి గొప్ప పథకాన్ని కేసీఆర్ తీసుకొచ్చారని గుర్తు చేశారు. కానీ.. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ రైతుబంధు పథకాన్ని 2 సీజన్లలో ఎగ్గొట్టిందని, మూడో సీజన్లో రైతు భరోసా కింద రూ.15 వేలు ఇస్తామని చెప్పి.. కేవలం రూ.12 వేలు వేశామంటూ చెప్తున్నారని విమర్శించారు. ఇక రైతులకు ఇచ్చే బోనస్ పెద్ద బోగస్ అయ్యిందని పాడి కౌశిక్ రెడ్డి తీవ్ర విమర్శలు కురిపించిన సంగతి తెలిసిందే.

Also Read: Horoscope: ఈరోజు ఈ రాశివారికి వ్యాపారంలో బాగా కలిసి వస్తుంది!

Also Read: America: అమెరికాలో మరోసారి కాల్పులు...ముగ్గురు మృతి..15 మందికి తీవ్ర గాయాలు!

seethakka | congress-mla-seethakka | minister-seethakka | padi-koushik-reddy | brs | congress | assembly | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

TG News: సన్నబియ్యం లబ్ధిదారుడి ఇంట్లో భోజనం చేసిన సీఎం రేవంత్!

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సన్నబియ్యం లబ్ధిదారుడి ఇంట్లో భోజనం చేశారు. శ్రీరామనవమి సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సారపాకలో పర్యటించారు. ఈ మేరకు లబ్ధిదారుడు శ్రీనివాస్ కుటుంబ కష్టసుఖాల గురించి అడిగి తెలుసుకున్నారు.

New Update
cm revanth tg

Telangana CM Revanth Reddy lunch in fine rice beneficiary home

TG News: తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సన్నబియ్యం లబ్ధిదారుడి ఇంట్లో భోజనం చేశారు. శ్రీరామనవమి సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సారపాకలో పర్యటించారు. ఈ మేరకు లబ్ధిదారుడు శ్రీనివాస్ కుటుంబ కష్టసుఖాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఇక ఉదయం భద్రాచలంలో నిర్వహించిన సీతారాముల కల్యాణోత్సవానికి హాజరైన ముఖ్యమంత్రి.. స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. 

10 లక్షల కొత్త రేషన్‌కార్డులు..

ఇక రాష్ట్రవ్యాప్తంగా రేషన్‌కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ చేసే కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి మార్చి 30న ప్రారంభించారు. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో ఏర్పాటు చేసిన సభలో వీరు పాల్గొన్నారు. అయితే రాష్ట్రంలో ఏప్రిల్‌ నుంచి సన్నబియ్యం పంపిణీ ప్రారంభవుతుందని సీఎస్‌ శాంతి కుమారి తెలిపారు. అలాగే దాదాపు10 లక్షల కొత్త రేషన్‌కార్డులు జారీ కానున్నాయని పేర్కొన్నారు. సన్నబియ్యం పంపిణీ వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై అదనపు భారం పడుతుందని తెలిపారు. ధనవంతుల లాగే పేదవారు సన్నబియ్యం తినాలని కోరుతున్నారన్నారు. 

ఇది కూడా చూడండి: మీరు సరిగా పని చేయడం లేదు..కుక్కల్లాగా నడవండి..ఉద్యోగులకు వేధింపులు!

2024లో 1.56 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ఉత్పత్తిని సాధించినట్లు తెలిపారు. దేశంలో ఎక్కువగా వరి పండించిన రాష్ట్రంగా తెలంగాణ ఉందని.. ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇంత భారీగా వరి ఉత్పత్తి జరగలేదని తెలిపారు. సన్న బియ్యం పండిస్తే బోనస్ కూడా అందిస్తున్నామని స్పష్టం చేశారు.

ఇది కూడా చూడండి: వాట్సాప్‌ వీడియో కాల్స్ చేసుకునే వారికి గుడ్‌న్యూస్.. కొత్తగా 3 ఫీచర్లు!

 ration rice | cm revanth | khammam | telugu-news | today telugu today telugu news

 

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు