Telangana: ఈ జిల్లాల్లో మళ్లీ  వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ!

తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాలకు బుధ, శుక్రవారాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని IMD యెల్లో అలర్ట్ జారీ చేసింది.

New Update
hyd

తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ రానున్న రెండు రోజులు.. పాటు బుధవారం, శుక్రవారం భారీ వర్ష సూచన జారీ చేసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు.. బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు ప్రభావిత జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు చెబుతున్నారు.

Also Read: Mujra Party : మొయినాబాద్‌లో ముజ్రా పార్టీ భగ్నం..ఏడుగురు అమ్మాయిలు అరెస్ట్!

IMD విడుదల చేసిన ప్రత్యేక బులెటిన్ ప్రకారం.. రాష్ట్రంలోని సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్‌, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, హన్మకొండ జిల్లాల్లో ఏప్రిల్ 9వ తేదీన ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉంది.అంతేకాకుండా.. ఈ సమయంలో గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు కూడా వీస్తాయని అధికారులు తెలిపారు.

Also Read: USA-China: మేం కూడా మా ఆయుధాలతో సిద్ధంగా ఉన్నాం..104 శాతం టారీఫ్ లపై చైనా మండిపాటు

Telangana Rain Alert

ఈదురుగాలుల వల్ల చెట్లు విరిగిపడే అవకాశం ఉండటంతో.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా బహిరంగ ప్రదేశాల్లో ఉన్నవారు సురక్షితమైన చోటుకు చేరుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. గత కొంతకాలంగా రాష్ట్రంలో నమోదవుతున్న ఉష్ణోగ్రతల విషయానికి వస్తే.. నిన్న హైదరాబాద్ నగరంలోని ముషీరాబాద్ ప్రాంతంలో అత్యధికంగా 39.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఇది రానున్న వర్షాల నేపథ్యంలో వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పులను సూచిస్తోంది. అధిక ఉష్ణోగ్రతల తర్వాత ఒక్కసారిగా వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో.. ప్రజలు ఆరోగ్యపరంగా కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

ఇక నిజామాబాద్ జిల్లాలో వాతావరణంలో గత కొన్ని రోజులుగా భిన్నమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దాదాపు ఐదు రోజుల క్రితం ఈ జిల్లాలో బలమైన ఈదురుగాలులు, వడగళ్లతో కూడిన వర్షం కురిసింది. దీని ఫలితంగా జిల్లాలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. అయితే.. వారం రోజుల పాటు చల్లగా ఉన్న వాతావరణం ఆదివారం నుండి మళ్లీ వేడిగా మారుతుంది. గత మూడు రోజులుగా ఎండ తీవ్రత క్రమంగా పెరుగుతూ వస్తోంది. దీంతో ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతున్నాయి. అయితే.. రానున్న వర్ష సూచనతో నిజామాబాద్ జిల్లా ప్రజలకు కూడా కొంత ఉపశమనం లభించే అవకాశాలు కనపడుతున్నాయి.

వాతావరణ శాఖ ఈ హెచ్చరికల నేపథ్యంలో.. ఆ జిల్లాల యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రజలకు తగిన సూచనలు జారీ చేయడంతో పాటు.. సహాయక చర్యలు చేపట్టేందుకు రెడీ గా ఉంది. విద్యుత్ శాఖ అధికారులు కూడా ఈదురుగాలుల వల్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగే అవకాశం ఉన్నందున.. మరమ్మత్తు బృందాలను ముందుగానే సిద్ధం చేశారు. రైతులు తమ పంటలను కాపాడుకునేందుకు తగిన చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు. 

Also Read: Pawan Kalyan: 3 రోజులపాటు ఆస్పత్రిలోనే పవన్‌ చిన్న కుమారుడు!

Also Read: America: అమెరికా ఆహారం బంద్‌..11 దేశాలకు కష్టం!

telngana | adilabad | nizamabad | rains | rain-alert | telangana-rain | telangana rain alert | telangana rains today | telangana rains update | telangana rains updates | telangana-rains | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Hyderabad: హైదరాబాద్‌లో పాకిస్తానీయులు.. పోలీసులు సంచలన నిర్ణయం

హైదరాబాద్‌లో షార్ట్‌ టర్మ్ వీసా హోల్డర్స్‌ అయిన నలుగురు పాకిస్తానీయులను పోలీసులు గుర్తించారు. ఆ నలుగురికి నోటీసులు జారీ చేశారు. రేపటిలోగా హైదరాబాద్‌ విడిచి వెళ్లిపోవాలని ఆదేశించారు. లాంగ్‌టర్మ్‌ వీసాలు ఉన్నవాళ్లని మాత్రం కేంద్రం మినహాయించింది.

author-image
By B Aravind
New Update
Hyderabad Police Sent Notices to Pakistani nationals on short on visa

Hyderabad Police Sent Notices to Pakistani nationals on short on visa

పహల్గాం ఉగ్రదాడి ఘటనతో హై అలెర్ట్ నెలకొంది. భారత్‌లో ఉంటున్న పాకిస్తానీయులపై  పోలీసులు నిఘా పెడుతున్నారు. తాజాగా హైదరాబాద్‌లో ఉంటున్న నలుగురు పాకిస్తానీయులను పోలీసులు గుర్తించారు. వాళ్లని షార్ట్‌ టర్మ్ వీసా హోల్డర్స్‌గా గుర్తించారు. ఈ నేపథ్యంలో ఆ నలుగురికి నోటీసులు జారీ చేశారు. రేపటిలోగా హైదరాబాద్‌ విడిచి వెళ్లిపోవాలని ఆదేశించారు.    

Also Read: దాడిపై దర్యాప్తు సిద్ధమని కాళ్ల బేరానికి పాకిస్తాన్.. మాకు నీళ్లు కావాలి!

Hyderabad Police Sent Notices To Pakistani Nationals

మొత్తంగా చూసుకుంటే హైదరాబాద్‌లో 213 మంది పాకిస్తానీయులు ఉన్నారు. ఇందులో 209 మందికి లాంగ్‌టర్మ్ వీసాలు ఉన్నాయి. మిగతా నలుగురికి షార్ట్‌ టర్మ్‌ వీసాలు ఉన్నాయి. ఈ నలుగురి పైనే పోలీసులు నిఘా పెట్టారు. రేపటిలోగా వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే లాంగ్‌టర్మ్‌ వీసాలు ఉన్నవాళ్లని మాత్రం కేంద్రం మినహాయించింది.  

ఇదిలాఉండగా.. దేశ వ్యాప్తంగా ఉన్న పాకిస్థానీలు భారత్ వదిలి ఏప్రిల్ 29 లోగా వెళ్లిపోవాలని కేంద్రం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు కేంద్ర హోంశాఖ మంత్రి అమిషా సైతం అన్ని రాష్ట్రాల ముఖ్య మంత్రులకు ఫోన్‌లు చేసి తమ తమ రాష్ట్రాల్లో ఉన్న పాకిస్థానీయులను గుర్తించి తమ దేశాలకు పంపించేయాలని తెలిపారు.  దీంతో రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు అదే పనిలో పడ్డాయి. ఇందులో భాగంగానే తెలంగాణలో పోలీసులు రాష్ట్రం మొత్తం జల్లెడ పట్టారు. 

Also Read: గుజరాత్‌లో 550 మంది బంగ్లాదేశీయులు అరెస్టు!

మరోవైపు హైదరాబాద్ పోలీసులు గురువారం ఓ పాక్ యువకుడ్ని అదుపులోకి తీసుకున్నారు. మహమ్మద్ ఫయాజ్ అనే యువకుడు గతంలో హైదరాబాద్కి చెందిన ఓ యువతిని వివాహం చేసుకున్నాడు. ఇప్పుడు ఆ యువతిని కలిసేందుకు పాక్ నుంచి నేపాల్ మీదుగా హైదరాబాద్కు వచ్చాడు. దీంతో మహమ్మద్ ఫయాజ్ను గుర్తించిన పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. కాగా ఆ పాక్ యువకుడు దుబాయ్లో ఉద్యోగం చేస్తున్నట్లు తెలిసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.  

Also Read: అమర్నాథ్ యాత్రపై స్పెషల్ ఫోకస్.. కేంద్రం కీలక నిర్ణయం

Also Read :  పాకిస్తాన్‌తో యుద్ధం వద్దు.. సీఎం సిద్ధరామయ్య సంచలన కామెంట్స్

telugu-news | rtv-news | Pahalgam attack

Advertisment
Advertisment
Advertisment