/rtv/media/media_files/2024/12/28/P79l9qMKUUKCj6n1Qvuf.jpg)
rains
తెలంగాణలో నేటి నుంచి వచ్చే నాలుగు రోజుల పాటు అంటే ఆదివారం వరకు వర్షాలు విస్తారంగా కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు ప్రకటించారు. ఒడిశా నుంచి కోమోరిన్ ప్రాంతం వరకూ ఉన్న ద్రోణి, చత్తీస్గఢ్లో ఏర్పడిన ఉన్నత వాయు చక్రవాత తుపాను ప్రభావంతో వాతావరణ మార్పులు చోటు చేసుకుంటాయని.. రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని చెప్పారు. గురువారం మధ్యాహ్నం 3 వరకు ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడంతో పాటుగా దట్టమైన మేఘాలు కమ్ముకుంటాయని చెప్పారు.
Also Read: Trump Tarriffs: నిజమైన స్నేహితుడు అయితే ఇలా చేయడు...ట్రంప్ సుంకాల పై వివిధ దేశాధినేతలు!
నేటి నుంచి ఆదివారం వరకు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు. గురువారం ఆదిలాబాద్, నిజామాబాద్, మహబూబ్నగర్, రంగారెడ్డి, కామారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయన్నారు. ఈ మేరకు ఆ జిల్లాలకు అధికారులు ఆరెంజ్ అలర్డ్ జారీ చేశారు.ఏప్రిల్ 3, 4 తేదీల్లో మహబూబ్నగర్, నారాయణపేట, జోగులాంబ గద్వాల్, వికారాబాద్, సంగారెడ్డి, , వనపర్తి జిల్లాల్లో వడగళ్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని అన్నారు. ఈ మేరకు ఐఎండీ అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.
Telangana Weather Orange Alert
నిజామాబాద్, కామారెడ్డి, హైదరాబాద్, ఆదిలాబాద్ పరిసరాల్లో గంటకు 30-50 కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీస్తాయని అధికారులు తెలిపారు. నేడు, రేపు ఆదిలాబాద్, వికారాబాద్, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో పిడుగులు పడతాయని హెచ్చరించారు. ప్రజలు బయట తిరగడం తగ్గించి, ఆశ్రయం కోసం సురక్షిత ప్రదేశాలను ఎంచుకోవాలని సూచించారు.
గురువారం గాలి వేగం బంగాళాఖాతంలో గంటకు 16 కిలోమీటర్లుగా ఉంటుందని.. తెలంగాణలో గంటకు 9 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయన్నారు. వర్షం పడే ముందు గాలి వేగం పెరుగుతుందని చెప్పారు. ఉష్ణోగ్రత తెలంగాణలో 33 నుంచి 34 డిగ్రీల సెల్సియస్ ఉంటుందని తెలిపారు. తేమ పగటివేళ 40 శాతం ఉంటుందని.. రాత్రివేళ 80 శాతం దాటుతుందని అన్నారు. దీంతో తీవ్ర ఉక్కపోత తగ్గుతుందని చెప్పారు.
గత కొన్ని రోజులుగా తెలంగాణలో ఎండలు దంచికొడుతుండగా.. వాతావరణ మార్పులతో ప్రజలకు ఉపశమనం దొరుకుతుంది. అయితే వగడళ్ల వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అధికారులు తెలిపారు.
Also Read: Ap Weather Report: ఏపీలో వింత వాతావరణం.. అక్కడ ఎండలు ..ఇక్కడ వానలు!
Also Read: Trump Tarriffs:ప్రతీకార సుంకాల పై ట్రంప్ కీలక ప్రకటన..భారత్ కు ఎంత శాతం విధించారంటే..!
telangana | mahabubnagar | adilabad | rains | weather | telangana-weather | telangana weather news | telangana weather report today | telangana weather updates | telangana-weather-report | telangana-weather-update | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates
Maoist: మవోయిస్టులకు ఆర్ఎస్ ప్రవీణ్ మద్దతు.. దేశ పౌరులను చంపడం అత్యంత నేరం అంటూ!
చర్చలకు సిద్ధమంటూ మావోయిస్టు పార్టీ ప్రకటించిన లేఖపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత ప్రభుత్వం ఒక మెట్టు దిగి వారితో చర్చలు జరపాలని కోరారు. 2004లో లాగా కాకుండా ఈ చర్చలు ఒక ప్రణాళిక బద్ధంగా ఉండాలని RTVకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కోరారు.
rsp maoist Photograph: (rsp maoist)
Maoist: కేంద్ర ప్రభుత్వంతో తాము చర్చలకు సిద్ధమంటూ మావోయిస్టు పార్టీ ప్రకటించిన అంశంపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ లేఖపై ఒక రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్గా తన మనసులో ఉన్నది వ్యక్తపరుస్తున్నట్లు తెలిపారు. ఆగస్టులో మావోయిస్టు పార్టీ చర్చలకు ఒప్పుకుంటుంది. కాబట్టి భారత ప్రభుత్వం కూడా ఒక మెట్టు దిగి చర్చలు జరపాలన్నారు. భారతదేశ పౌరులు దేశంలో ఉన్న పౌరులను చంపడం అత్యంత నేరమని సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో స్పష్టంగా ఉంది. కావున ఈసారి జరగబోయే చర్చలు 2004లో లాగా కాకుండా ఒక ప్రణాళిక బద్ధంగా ఉంటే బాగుంటుందని RTVకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కోరారు.
Also Read: పసిబిడ్డల ఉసురు తీస్తున్న అక్రమ సంబంధాలు.. ఈ ఏడాది ఎంతమందిని చంపేశారంటే!
పేపర్ మిల్లు ఎన్నికల కోసం సిద్ధం..
అలాగే సిర్పూర్ పేపర్ మిల్లు ఎన్నికల కోసం సిద్ధమవుతున్నట్లు తెలిపారు. స్థానికులకే సిర్పూర్ పేపర్ మిల్లులో ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సిర్పూర్ లో ఉన్న సమస్యల కోసం ఆగిపోయిన అభివృద్ధి కోసం ధర్నాలు రాస్తారోకోలు మేమే చేస్తున్నాం. రాష్ట్రంలో HCU భూములను దారాదత్తం చేయడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పక్కా ప్రణాళిక బద్దంగా ముందుకు పోతుంది. దీన్ని మా బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇద్దరు కలిసి భూముల అమ్ముకోవడానికి కొన్ని ఫైల్స్ మందు పెట్టుకుని కూర్చున్నారు. వాళ్ళ పని భూములమ్ముకోవడమే. 27 న వరంగల్ లో జరిగే టిఆర్ఎస్ సభకు విజయవంతం చేయాలని కోరారు.
Also Read: అమెరికా ఆహారం బంద్..11 దేశాలకు కష్టం!
rs-praveen | amithsha | today telugu news
సింగపూర్ చేరుకున్న పవన్, చిరు దంపతులు.. | Chiranjeevi And Surekha To Singapore | RTV
అమరావతిలో నారావారి నూతన గృహ శంకుస్థాపన.. | CM Chandrababu New House In Amaravati | RTV
నా బిడ్డను బాధ పెట్టొద్దని 5 లక్షలు ఇస్తే... ! | Marchiyaral Newly Married Couple Sad Story | RTV
Kajal: యంగ్ బ్యూటీలకు ఏమాత్రం తగ్గని కాజల్.. నెట్టింట హాట్ ఫొటో షూట్ వైరల్
కొడుకుని తలుచుకుని పవన్ కన్నీరు | Pawan Kalyan Emotional Over Son Mark | RTV