BIG BREAKING: నాలుగు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ విడుదల
కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు (తమిళనాడు, పశ్చిమ బెంగాల్, అస్సాం, కేరళ), కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరి ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేసింది.
కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు (తమిళనాడు, పశ్చిమ బెంగాల్, అస్సాం, కేరళ), కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరి ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేసింది.
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అక్కడి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) సంచలన నిర్ణయం తీసుకుంది. ఇరాన్, కువైట్, ఖతార్, సౌదీ అరేబియా, UAE, ఒమాన్, బహ్రెయిన్ దేశాల్లో జరగనున్న సీబీఎస్సీ పరీక్షలు రద్దు చేసింది.
బెంజమిన్ నెతన్యాహూ మరణించారంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై ఇరాన్ సంచలన వ్యాఖ్యలు చేసింది. "ఒకవేళ ఆయన ప్రాణాలతో ఉంటే.. వేటాడి మరీ చంపుతాం" అంటూ ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ వార్నింగ్ ఇచ్చింది. ప్రస్తుతం యుద్ధంలో ఈ హెచ్చరికలు హాట్ టాపిక్గా మారాయి.
తమిళనాడులో రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. బీజేపీ, టీవీకే పార్టీలు పొత్తు పెట్టుకునే అవకాశాలున్నట్లు ప్రచారం నడుస్తోంది. పొత్తులో భాగంగా తమిళ వెట్రి కళగం (TVK) అధినేత విజయ్కు బీజేపీ డిప్యూటీ సీఎం పదవి ఆఫర్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. తెలంగాణలో ఆదివారం, సోమవారం ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
ఇజ్రాయెల్, అమెరికాల సంయక్త దాడులను సింగిల్గానే ఎదుర్కొవడమే కాకుండా ఆ దేశాలకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది ఇరాన్. అదే సమయంలో అమెరికా మిత్ర రాజ్యాల మీద కూడా ఇరాన్ దాడులకు పాల్పడుతుందని ఆరోపణలు వెల్లువెత్తుతున్న సమయంలో ఇరాన్ సంచలన వ్యాఖ్యలు చేసింది.
త్వరలో జరగనున్న అసోం అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ వరుసగా తన అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తోంది. గతంలో మొదటి జాబితా విడుదల చేయగా తాజాగా 23మందితో కూడిన తన రెండో విడత అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. అభ్యర్థుల సంఖ్య 65కి చేరింది.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోని శాఖమూరు పార్కులో శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా, అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మించిన 58 అడుగుల పొట్టి శ్రీరాములు విగ్రహావిష్కరణ ఈ నెల 16న చేయనున్నారు.
పశ్చిమ బెంగాల్, అస్సాం, తమిళనాడు, కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను భారత ఎన్నికల సంఘం (ECI) ఈరోజు ప్రకటించనుంది. ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించడానికి ఈరోజు 4 గంటలకు విజ్ఞాన్ భవన్లో మీడియా సమావేశం నిర్వహించనుంది.